Earthquake: గుజరాత్‌లో భూకంపం.. రిక్టర్‌స్కేల్‌పై 5.0గా నమోదు

గుజరాత్‌లోని ద్వారకలో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 5.0గా నమోదైంది.

Published : 04 Nov 2021 17:33 IST

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని ద్వారకలో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 5.0గా నమోదైంది. గురువారం మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో ఈ ప్రకంపనలు సంభవించినట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం (ఎస్‌సీఎస్‌) పేర్కొంది. ద్వారకకు వాయవ్య దిశలో 223 కిలోమీటర్ల దూరంలో, 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. ఆస్తి నష్టానికి సంబంధించి ఎలాంటి సమాచారం రాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని