Emmanuel Macron: ‘ఇలాంటి విషయాలపై సోషల్‌ మీడియా ద్వారా సంభాషణ తగదు’

ఇంగ్లిష్‌ ఛానల్‌ గుండా వలసల విషయంలో ఫ్రాన్స్‌, బ్రిటన్‌ మధ్య వివాదం రాజుకుంటోంది! తాజాగా ఈ వ్యవహారంపై బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ అనుసరించిన విధానం తనను ఆశ్చర్యపరిచిందని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ అన్నారు. ఇటీవల ఇంగ్లిష్‌ ఛానల్‌లో...

Published : 26 Nov 2021 23:24 IST

రోమ్: ఇంగ్లిష్‌ ఛానల్‌ ద్వారా వలసల విషయంలో ఫ్రాన్స్‌, బ్రిటన్‌ మధ్య వివాదం రాజుకుంటోంది! తాజాగా ఈ వ్యవహారంపై బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ అనుసరించిన విధానం తనను ఆశ్చర్యపరిచిందని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ అన్నారు. ఇటీవల ఇంగ్లిష్‌ ఛానల్‌లో వలసదారుల పడవ బోల్తాపడిన ప్రమాదంలో దాదాపు 27 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఛానల్‌ ద్వారా ఇంగ్లాండ్‌కు చేరుకున్న వలసదారులను ఫ్రాన్స్‌ వెంటనే వెనక్కి రప్పించాలని బ్రిటన్‌ ప్రధాని బోరిస్ జాన్సన్ గురువారం సాయంత్రం ట్విటర్‌లో బహిరంగ లేఖ విడుదల చేశారు.

సమావేశానికి అహ్వానం రద్దు!

అయితే.. ఈ విధంగా సామాజిక మాధ్యమంలో లేఖ విడుదల చేయడంపై ఫ్రాన్స్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి విషయాల్లో ఒక నాయకుడు మరొకరితో ఇలా ట్విటర్ ద్వారా సమాచారం అందించరని మెక్రాన్‌ విమర్శలు చేశారు. ఈ తరహా వ్యవహారాలపై నాయకులు సోషల్ మీడియా ద్వారా పరస్పరం సంభాషించుకోవద్దని హితవు పలికారు. అంతకుముందు.. ఫ్రాన్స్‌ అంతర్గత వ్యవహారాల మంత్రి గెరాల్డ్ డర్మానిన్ సైతం బ్రిటన్‌ మంత్రి ప్రీతి పటేల్‌తో ఈ లేఖ విషయమై నిరసన వ్యక్తం చేశారు. వలసదారుల సంక్షోభంపై ఇతర యూరోపియన్ మంత్రులతో నిర్వహించనున్న వారాంతపు సమావేశానికి యూకేను ఆహ్వానించేది లేదని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని