‘రద్దు’కే రైతన్నలు.. కష్టమన్న కేంద్రం
వ్యవసాయ చట్టాలపై కేంద్ర, రైతుల మధ్య ప్రతిష్టంభన కొనసా...గుతూనే ఉంది. చట్టాల రద్దు చేయాల్సిందేనని అన్నదాతలు పట్టుబట్టగా.. అది మాత్రం కుదరదని కేంద్రం చెబుతోంది. దీంతో ఎనిమిదో విడత చర్చలు
కొనసాగుతున్న ప్రతిష్టంభన: 15న మళ్లీ చర్చలు
దిల్లీ: వ్యవసాయ చట్టాలపై కేంద్రం, రైతుల మధ్య ప్రతిష్టంభన కొనసా...గుతూనే ఉంది. చట్టాలను రద్దు చేయాల్సిందేనని అన్నదాతలు పట్టుబట్టగా.. అది మాత్రం కుదరదని కేంద్రం చెబుతోంది. దీంతో ఎనిమిదో విడత చర్చలు కూడా ఫలించలేదు. చట్టాలను ఉపసంహరించుకుంటేనే తాము ఇళ్లకు వెళ్తామని రైతులు ఘంటాపథంగా చెబుతున్నారు. దీంతో తదుపరి దఫా చర్చలను జనవరి 15వ తేదీకి వాయిదా వేశారు.
నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఉద్యమం చేస్తున్న 41 రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్ తోమర్, పీయూష్ గోయల్, సోమ్ ప్రకాశ్ శుక్రవారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. అయితే చర్చలు ప్రారంభమైన కాసేపటికే ఇరు వర్గాలు తమ డిమాండ్లపై వెనక్కి తగ్గలేదు. కొత్త చట్టాలను దేశ ప్రజలందరి కోసం తీసుకొచ్చామని, ఇవి ఏ ఒక్క రాష్ట్రానికి పరిమితం కావని మంత్రుల బృందం తెలిపింది. చట్టాలను రద్దు చేయడం కుదరదని చెప్పినట్లు సమాచారం. ‘చట్టాలను రద్దు చేయలేం. కావాలంటే మీరు సుప్రీంకోర్టు వెళ్లొచ్చు. ఈ చట్టాలు అక్రమమని న్యాయస్థానం చెబితే మేం ఉపసంహరించుకుంటాం. ఒకవేళ చట్టబద్ధమైనవేనని తీర్పు వస్తే మీరు ఉద్యమాన్ని విరమించుకోవాలి’ అని మంత్రుల బృందం రైతులకు వివరించినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఇందుకు రైతు నాయకులు అభ్యంతరం తెలిపినట్లు తెలుస్తోంది. సుప్రీం ప్రక్రియకు చాలా సమయం పడుతుందన్న రైతు ప్రతినిధులు.. చట్టాలను రద్దు చేయాల్సిందేనని పట్టుబట్టారు. ‘చట్టాలను వెనక్కి తీసుకుంటేనే మేం ఇళ్లకు వెళ్లిపోతాం’ అని రైతులు చెప్పినట్లు సదరు వర్గాలు తెలిపాయి.
ఏకాభిప్రాయం కుదరలేదు: తోమర్
రైతు సంఘాల ప్రతినిధులతో జరిగిన చర్చల్లో ఏకాభిప్రాయం కుదరలేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అన్నారు. చట్టాలు రద్దు చేయడం తప్ప మరో ప్రత్యామ్నాయం చెప్పాలని రైతులను కోరామన్నారు. దేశంలో చాలా మంది చట్టాలను సమర్థిస్తున్నారని, రైతులతో మరోసారి ఈ నెల 15న చర్చలు జరుపుతామని మంత్రి తెలిపారు.
ప్రజాస్వామ్యం అపహాస్యం: రైతులు
‘‘కేంద్రం ఇవాళ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. చర్చల్లో సాగు చట్టాల రద్దు కుదరని చెప్పింది. ఇతర రైతు సంఘాలు సాగు చట్టాలకు మద్దతు ఇస్తున్నాయి. కాబట్టి చట్టాలను వెనక్కి తీసుకోలేమని చెప్పింది. సుప్రీంకోర్టు నిర్ణయానికే వదిలేస్తే మంచిదని బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది. చర్చలు జరుగుతున్న వేళ కేంద్రం మధ్యలో తప్పుకొని సుప్రీంకోర్టు తేలుస్తుందని అనడం దేనికి నిదర్శనం? సాగు చట్టాల రద్దు తప్ప మరేదీ ఆమోద యోగ్యం కాదని చెప్పాం. సాగు చట్టాలు రద్దు చేస్తేనే ఆందోళన విరమిస్తాం’’ అని అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి నేత కవిత కురుగంటి అన్నారు.
హాలు నుంచి వచ్చేసిన మంత్రులు
రైతులు తమ డిమాండ్లపై వెనక్కి తగ్గకపోవడంతో కేంద్ర మంత్రులు సమావేశ గది నుంచి బయటకు వచ్చేశారు. అధికారులతో సంప్రదింపులు జరిపారు. అదే సమయంలో రైతు సంఘాల నేతలు గదిలో మౌనం పాటించారు. ‘విజయం లేదా వీరమరణం’ అనే రాసి ఉన్న పేపర్లు పట్టుకుని నిరసన తెలిపారు. అంతేగాక, భోజనం చేసేందుకు కూడా రైతులు నిరాకరించారు. భోజన విరామ సమయంలోనూ సమావేశ గదిలోనే ఉండిపోయారు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినీతాసింగ్ మృతిపై వదంతులు ..ఆమె ఏమన్నారంటే!
వ్యాపారవేత్త, ‘షార్క్ ట్యాంక్’ కార్యక్రమం న్యాయనిర్ణేత వినీతా సింగ్ (Vineeta Singh) మరణించారని వస్తున్న వదంతులను ఆమె సోషల్ మీడియా వేదికగా తోసిపుచ్చారు. -
ఎన్నికల బాండ్లపై సీతారామన్ వ్యాఖ్యలు.. తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్
ఎన్నికల బాండ్ల పథకం గురించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) చేసిన ప్రకటనను హస్తం పార్టీ ఖండించింది. -
‘నా తమ్ముడికి ఓట్లేస్తేనే మీకు నీళ్లు’.. డీకే శివకుమార్ వ్యాఖ్యలపై కేసు నమోదు
DK Shivakumar: తన సోదరుడికి ఓట్లేస్తేనే నీరు సరఫరా చేస్తామంటూ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
అనారోగ్య సమస్యలతో కేజ్రీవాల్ మరణించేలా కుట్ర: దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్
తిహాడ్ జైల్లో అరవింద్ కేజ్రీవాల్పై కుట్ర జరుగుతోందని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ శనివారం ఆరోపించారు. -
ఈ పోలింగ్ ‘బ్యూటీ’ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?
Isha Arora: యూపీలో విధులు నిర్వహించిన పోలింగ్ ఏజెంట్ ఈశా అరోడా ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్గా మరారు. ఇంతకీ ఎవరామె..? -
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్
Doordarshan: ‘డీడీ న్యూస్’ లోగోను కాషాయ రంగులోకి మార్చడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది ‘ప్రసార భారతి’ కాదని ‘ప్రచార భారతి’గా మారిందని పలువురు మండిపడుతున్నారు. -
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
వినీతాసింగ్ మృతిపై వదంతులు ..ఆమె ఏమన్నారంటే!
-
హామీలపై నిలదీస్తే అసహనమెందుకు?: హరీశ్రావు
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..
-
నేను ఓటు వేశా.. మీరూ వేయండి..! ఎన్నికల వేళ విశాల్ ఇంకా ఏమన్నారంటే?