Corona: టీకాలు వేసినా ఎప్పటికీ మనతోనే.. ఎందుకంటే?
కరోనా వైరస్ ఎప్పటికీ మనతోనే ఉంటుందనే విషయాన్ని గుర్తుచేస్తున్న నిపుణులు.. రానున్న రోజుల్లో వైరస్ తీవ్రత మాత్రం తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు.
వాషింగ్టన్: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి ముప్పు ఎప్పటికి అంతమవుతుందో నిపుణులే అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. టీకాల ద్వారా ప్రజల్లో ఇమ్యూనిటీ పెంచాలని ప్రపంచ దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయినప్పటికీ కరోనా కొత్తరకాలు పుట్టుకు వస్తుండడంతో హెర్డ్ ఇమ్యూనిటీ సాధించేందుకు మరింత కాలం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వైరస్ ఎప్పటికీ మనతోనే ఉంటుందని, కాకపోతే రానున్న రోజుల్లో దాని తీవ్రత తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
కొవిడ్ నిర్మూలన సాధ్యమేనా?
కొవిడ్ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించడం సాధ్యమేనా అన్న పశ్నకు నిపుణుల నుంచి ‘కాదు’ అనే సమాధానం వస్తోంది. ఇప్పటివరకు కేవలం మశూచిని మాత్రమే పూర్తిగా పారద్రోలిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. కరోనా వైరస్కు కారణమైన సార్స్-కోవ్-2ను మాత్రం పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాదని చెబుతున్నారు. కఠిన లాక్డౌన్లు, సరిహద్దులు మూసివేయడం తదితర చర్యలతో కరోనా కేసుల సంఖ్యను న్యూజిలాండ్లాంటి దేశాలు సున్నాకు తీసుకువచ్చినా.. అది అన్ని దేశాలకు సాధ్యం కాదని చెబుతున్నారు. ముఖ్యంగా పేద, మధ్య ఆదాయ దేశాలకు ఇది సవాల్గా మారుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.
టీకాలతో వైరస్ కట్టడి ఎంతవరకు?
ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లు సమర్థవంతంగానే పనిచేస్తున్నప్పటికీ.. వాటివల్ల ఎంతకాలం రక్షణ ఉంటుందనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. వైరస్ నుంచి ఒకవేళ అవి సుదీర్ఘకాలం రక్షణ కల్పించగలిగితే, హెర్డ్ ఇమ్యూనిటీ సాధించడానికి 60 నుంచి 72శాతం మందికి వాక్సినేషన్ జరగాల్సి ఉంటుందని లాన్సెట్ నిపుణులు ఇప్పటికే అంచనా వేశారు. ఇలా వ్యాక్సిన్ల సామర్థ్యం, అవి కల్పించే రక్షణ ఎంతకాలం ఉంటుందనే దానిపై వైరస్ కట్టడి ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
కొత్త వేరియంట్ల ప్రభావమెంత?
కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్నకొద్దీ అది రూపాంతరం చెందుతోంది. గతంలో సాధించిన ఇమ్యూనిటీ నుంచి తప్పించుకొంటూ, తిరిగి ప్రభావం చూపే సామర్థ్యం కరోనాకు ఉండడంతో కొత్త వేరియంట్లపై ఆందోళన నెలకొంది. బ్రిటన్, దక్షిణ అమెరికా, బ్రెజిల్, భారత్లో వెలుగు చూసిన కొత్త వేరియంట్లు వైరస్ వ్యాప్తిని వేగవంతం చేయడంతో పాటు, వ్యాక్సిన్ల పనితీరుపై ప్రభావం చూపిస్తున్నట్లు తేలింది. అందుకే కొత్త వేరియంట్లకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వ్యాక్సిన్లను అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడుతోంది. దీంతో ఇప్పటికే బూస్టర్ డోసులను అభివృద్ధి చేసే పనిలో ఆయా వ్యాక్సిన్ సంస్థలు నిమగ్నమయ్యాయి.
కేసులను తగ్గించడంలో టీకాల పాత్ర
వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ఇతరులకు వైరస్ సోకకుండా ఉంటుందా?అనే ప్రశ్నకు కాదనే సమాధానం వస్తోంది. అయితే వ్యాక్సిన్ తీసుకున్నవారు వైరస్కు గురైనప్పుడు వారిలో రోగ తీవ్రతను తగ్గించడానికి ఇది దోహదపడుతుంది. టీకా తీసుకున్నాక కూడా ఇన్ఫెక్షన్కు గురైన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు అతని నుంచి ఇతరులకు వైరస్ సోకే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వైరస్ను పూర్తిగా నిర్మూలించడంపై దృష్టిపెట్టడం కాకుండా, దానివల్ల ఆస్పత్రిలో చేరడం, ప్రాణనష్టం, ఆర్థిక భారంలాంటివి తగ్గించడమే కీలకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర విభాగాధిపతి మైక్ రేయాన్ చెప్పారు.
పూర్తిగా నియంత్రించలేకపోతే..?
కొవిడ్-19ను పూర్తిగా నియంత్రించలేకపోతే పరిస్థితి ఏంటనేది మరో ప్రశ్న. అయితే, ప్రజాసమూహాల్లో వైరస్లు ఇలా వ్యాప్తిచెందుతోంటే.. కొంతకాలం తర్వాత వాటి ప్రభావం తగ్గి, అవి స్థానికంగా వ్యాప్తిచెందేవి(ఎండమిక్)గా మారే అవకాశం ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో దాదాపు 100మంది అంతర్జాతీయ శాస్త్రవేత్తలపై నేచర్ పత్రిక జరిపిన ఓ సర్వేలో 90శాతం మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సాధారణ జలుబు వంటివి ఇలాంటి కోవకే వస్తాయని నిపుణులు గుర్తుచేస్తున్నారు.
భవిష్యత్తులో ఎలాంటి ప్రభావాలు?
వైరస్నుంచి కోలుకున్నవారితో పాటు వ్యాక్సిన్ తీసుకున్న వారికి కరోనా నుంచి కొంతకాలం రక్షణ ఉంటుంది. ఇక రెండోసారి వైరస్ సోకినవారిలో కూడా యాంటీబాడీలు సమృద్ధిగానే ఉంటున్నాయి. కేవలం రోగనిరోధకత తక్కువగా ఉన్నవారు, వ్యాక్సిన్ తీసుకోనివారే వైరస్ వల్ల తీవ్ర ముప్పుకు గురవుతారు. కరోనాపై హెర్డ్ ఇమ్యూనిటీ సాధించేంత వరకు లేదా ఎండమిక్ స్థాయి వచ్చే వరకు ఇలాంటి ప్రమాదం తప్పదు. ఆ తర్వాత కాలం గడిచేకొద్దీ కరోనా కూడా సాధారణ జలుబులాగే ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం