Taliban in Afghanistan: అమెరికా వదిలేసిన ‘టైం’బాంబ్.. అఫ్గాన్..!
అఫ్గానిస్థాన్ గడ్డ పై నుంచి చివరి అమెరికన్ సైనికుడు కూడా నిన్న రాత్రే వెళ్లిపోయారు. తాలిబన్ ప్రత్యేక దళాలు కాబుల్ ఎయిర్పోర్టును ఆక్రమించుకొన్నాయి.
తాలిబన్లకు పాలన ఆషామాషీ కాదు
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
అఫ్గానిస్థాన్ గడ్డ పై నుంచి చివరి అమెరికన్ సైనికుడు కూడా నిన్న రాత్రే వెళ్లిపోయారు. తాలిబన్ ప్రత్యేక దళాలు కాబుల్ ఎయిర్పోర్టును ఆక్రమించుకొన్నాయి. అక్కడ అమెరికా పనికిరాకుండా చేసి వదిలేసిన విమానాలు, హెలికాప్టర్లను పరిశీలించారు. అనంతరం గాల్లోకి తుపాకులు కాల్చి సంబరాలు కూడా చేసుకొన్నారు. ఇక తాలిబన్ల చేతికి అఫ్గాన్ పగ్గాలు పూర్తిగా వచ్చేశాయి. దేశాన్ని పరిపాలించి.. ప్రజల సమస్యలను తీర్చాల్సిన సమయం ఆసన్నమైంది. తాలిబన్లకు ఇదే అసలైన సవాలు.
వార్లార్డ్స్, జాతినేతల ముఠాలను కలిపి తాలిబన్లు అంటారు. ఒకరు చెప్పిన మాట మరో వర్గం వినాల్సిన సమయం.. అప్పుడే సమన్వయం ఉంటుంది. ఉదాహరణకు..‘మహిళలతో ఎలా ప్రవర్తించాలో మా ఫైటర్లకు తెలియదు.. కొన్నాళ్లు ఇళ్లలోనే ఉండండి’ అంటూ కొన్నాళ్ల క్రితం తాలిబన్ ప్రతినిధి చేసిన ప్రకటన వారిలోని సమన్వయ లోపానికి చిహ్నం. తాలిబన్ ప్రతినిధిగా ఉన్న వ్యక్తికి పట్టుఉంటే ‘మహిళలను ఏమీ అనవద్దు’ అని ఫైటర్లను ఆదేశిస్తే చాలు. కానీ, అతను అలా చేయలేదు. పాలన మొత్తం ఇదే పరిస్థితి కొనసాగితే మళ్లీ 1990ల నాటి దుస్థితి తలెత్తుతుంది.
ప్రజల అనుమానాలను తీర్చి నమ్మకం కలిగించాలి..
తాలిబన్లు కాబుల్ను ఆక్రమించిన సమయంలో శాంతి మంత్రం పఠించారు. తాము మారిపోయామని వారు చెప్పిన మాటలను ప్రజలు విశ్వసించేలా భవిష్యత్తులో వారి ప్రవర్తన ఉండాలి. 1996 నుంచి 2001 మధ్యలో వీరు మహిళలు, మైనారిటీలపై చేసిన అరాచకాలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఈసారి పాలనలో తాలిబన్లు ఉదారవాదాన్ని తెస్తామని ప్రపంచానికి చెప్పారు.
అన్ని వర్గాలకు పాలనలో భాగస్వామ్యం..
ఇప్పటికే దేశంలో ప్రభుత్వం కూలిపోయి రెండు వారాలవుతోంది. తీవ్రమైన అస్థిరత రాజ్యమేలుతోంది. ఎవరు ఏమిటో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుపై తాలిబన్ల చర్చలు కొలిక్కి రాలేదు. ఐరాసతో సహా పలు ప్రపంచ దేశాలు అఫ్గాన్ పాలనలో దేశంలోని అన్ని వర్గాలకు భాగస్వామ్యం ఉంటేనే గుర్తిస్తామని చెబుతున్నాయి. తాలిబన్లు కూడా దీనిపై సానుకూలంగానే స్పందించారు. ఇప్పటికే మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, మాజీ నేత అబ్దుల్లా అబ్దుల్లా, గుల్బుద్దీన్ హిక్మత్యార్ వంటి నాయకులతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే షియా వర్గాలతో చర్చలు జరిపేందుకు ప్రతినిధులను పంపారు. అంతేకాదు.. వీరితో జరిగే ఒప్పందాలను దీర్ఘకాలం కొనసాగించకపోతే అంతర్యుద్ధం తప్పదు.
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే..
అఫ్గాన్ ఆర్థిక పరిస్థితే అన్నిటికంటే అధ్వానంగా ఉంది. చెప్పుకోదగ్గ పరిశ్రమలు లేకపోవడం, 9 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యం అమెరికా సీజ్ చేయడంతో నిధుల కొరత తీవ్రంగా ఉంది. దేశంలో మంచినీటి వ్యవస్థ, కమ్యూనికేషన్లు, రోడ్ల నిర్వహణ, ఉద్యోగుల జీతాలు వంటి వాటికి కూడా నిధులు లేవు.
దీనికి తోడు విదేశాల నుంచి వచ్చే సహాయ నిధులు పూర్తిగా నిలిచిపోయాయి. బ్యాంకుల్లో నుంచి డబ్బు తీసుకొనేందుకు ప్రజలు ఏటీఎంల ఎదుట బారులు తీరిననట్లు బీబీసీ పేర్కొంది.
అఫ్గాన్ జీడీపీలో దాదాపు 40శాతం విదేశీ సహాయ నిధులే కావడం గమనార్హం. చాలా దేశాలు అఫ్గాన్ నిధులు మంజూరును సస్పెండ్ చేశాయి. ఈ ప్రభావం తాలిబన్ కరెన్సీపై ప్రతికూలంగా పడుతుంది. చాలా తక్కువ దేశాలు మాత్రమే అఫ్గానిస్థాన్లో దౌత్య కార్యాలయాలను కొనసాగిస్తున్నాయి. దీంతో పాక్,ఇరాన్,చైనా,కతర్,రష్యాలపైనే తాలిబన్లు ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.
ఉగ్రమూకకు అడ్డాగా మారకుండా..
అమెరికా పై యుద్ధం పేరుతో ఇప్పటికే దాదాపు 10వేల మంది పాక్ ఉగ్ర మూకలు అఫ్గాన్ గడ్డపై తిష్టవేశాయి. దీనికి తోడు ఒసామా బిన్ లాదెన్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేసిన అమిన్ ఉల్ హక్ ఇప్పటికే అఫ్గాన్లోని నాంగ్రహార్ ప్రావిన్స్కు చేరుకొన్నాడు. అతను అల్-ఖైయిదా ఆయుధ కొనుగోలు విభాగానికి అధ్యక్షుడు కూడా. తాలిబన్- అల్ ఖైయిదా మధ్య సాంస్కృతిక, వివాహ సంబంధాలు ఉన్నట్లు ఐరాస నివేదిక పేర్కొంది. ఇక ఐసిస్-కె ఉండనే ఉంది. ఈ ఉగ్ర సంస్థ దాడుల నుంచి ప్రజలను రక్షించాల్సిన బాధ్యత తాలిబన్లపై పడింది. ఇన్నాళ్లు ఆ పని నాటో దళాలు చూసేవి. వారికున్న సాంకేతికత.. ఇంటెలిజెన్స్ సమాచారం.. కమ్యూనికేషన్లు తాలిబన్లకు లేవనే చెప్పాలి. ఇక అఫ్గాన్ భూభాగాన్ని విదేశీ శక్తులు వాడుకోకుండా చూస్తామని తాలిబన్లు చెప్పిన మాట ఎంత వరకు నిలబెట్టుకొంటాయో చూడాలి. వాస్తవానికి దీని అమలు ఆధారంగానే విదేశీ సహాయ నిధులు లభించే అవకాశం ఉంది.
నిపుణుల వలసలు..
తాలిబన్ల ఆక్రమణ మొదలు కాగానే.. అఫ్గాన్లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న డాక్టర్లు ,అధ్యాపకులు, ఇంజినీర్లు, విశ్వవిద్యాలయ విద్యార్థులు, బ్యూరోక్రాట్లలో అత్యధిక మంది దేశం దాటేశారు. ఈ మేధోవలస దీర్ఘకాలం పాటు అఫ్గాన్ అభివృద్దిని కుంటుబరచనుంది. ఒక దశలో పరిస్థితి అర్థం చేసుకొన్న తాలిబన్ ప్రతినిధి మేధావులు దేశం వీడొద్దని కోరారు. డాక్టర్లు, ఇంజినీర్ల అవసరం దేశానికి ఉందని వారన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
Mukhtar Ansari: గ్యాంగ్స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ మృతితో యూపీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు కుటుంబ సభ్యులు మాత్రం ఆయన గుండెపోటుతో మరణించలేదని ఆరోపిస్తున్నారు. -
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
Congress: కాంగ్రెస్కు ఆదాయపు పన్ను విభాగం రూ.1700 కోట్లకు నోటీసులిచ్చింది. ఈ వ్యవహారంపై పార్టీ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. -
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
Modi-Bill Gates: ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ ‘చాయ్ పే చర్చ’లో పాల్గొన్నారు. డిజిటల్ విప్లవం, ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
‘కాలివేళ్లతో’ విధిరాత లిఖించుకున్న అపరబ్రహ్మ
సంకల్పబలం ఉంటే లక్ష్య సాధనకు ఏ వైకల్యమూ అడ్డుకాదని నిరూపిస్తున్నారు ఉత్తరాఖండ్కు చెందిన 58 ఏళ్ల దేవ్కీనందన్ శర్మ. -
ఎలాంటి తప్పూ జరగలేదు
నేషనల్ ఏవియేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఏసీఐఎల్) విమానాల లీజు అంశంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సీబీఐ పేర్కొంది. -
ఈస్టర్ రోజున పనిదినం.. వెనక్కు తగ్గిన మణిపుర్ ప్రభుత్వం
ఈస్టర్ రోజును పనిదినంగా ప్రకటిస్తూ మణిపుర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గురువారం వెనక్కు తీసుకుంది. -
కేజ్రీవాల్ పాస్వర్డులు చెప్పలేదు
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 4 డిజిటల్ పరికరాల పాస్వర్డులను చెప్పలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
మరోసారి తండ్రైన పంజాబ్ సీఎం మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(50) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు. -
మేం జోక్యం చేసుకోలేం
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. -
ఐరాస శాంతి పరిరక్షకుల నేరాలపై డేటాబేస్ ప్రారంభించిన భారత్
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులపై నమోదైన నేరాల నిక్షిప్తానికి, సదరు నిందితుల విచారణలో పురోగతిని పర్యవేక్షించడానికి భారతదేశం కొత్త డేటాబేస్ను రూపొందించిందని ఐరాస భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్ గురువారం తెలిపారు. -
నెట్ మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు: యూజీసీ
వచ్చే విద్యా సంవత్సరం నుంచీ జాతీయ అర్హత పరీక్ష (ఎన్ఈటీ) మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు కల్పించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. -
అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగుకు యోచన!
మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల తరహాలో సీయూఈటీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్) మార్కుల ఆధారంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగు నిర్వహించాలని యూజీసీ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
గురుద్వారా కర్ సేవా చీఫ్పై కాల్పులు
ఉత్తరాఖండ్లోని ఉధాంసింగ్ నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నానక్మత్తా సాహిబ్ గురుద్వారాకు చెందిన డేరా కర్ సేవా చీఫ్ బాబా తర్సేమ్ సింగ్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. -
కస్టోడియల్ మృతి కేసుల్లో.. పోలీసులకు బెయిల్ విషయంలో కఠినంగా వ్యవహరించాలి: సుప్రీం
కస్టోడియల్ మరణాల కేసులో పోలీసు అధికారులకు బెయిలిచ్చే విషయంలో న్యాయస్థానాలు కఠినంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. -
నా భర్త అనుమానాస్పద మృతిపై దర్యాప్తు జరగాలి: సీతా సోరెన్
ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అధినేత శిబు సోరెన్ కుటుంబానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పెద్ద కోడలైన సీత తన భర్త దుర్గా సోరెన్ అనుమానాస్పద మరణంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరగాలని గురువారం డిమాండ్ చేశారు. -
సంక్షిప్త వార్తలు (10)
మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్కు 1996 నాటి డ్రగ్స్ కేసులో గురువారం గుజరాత్లోని బనాస్కాంఠా జిల్లా కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు