భారత సైన్యంలో ఈ కుర్రాడెవరు..!
పదో విడత కోర్ కమాండర్ స్థాయి సమావేశాలకు ముందు చైనా సానుభూతి పొందేందుకు ఓ ప్రచార వీడియోను విడుదల చేసింది. ఇందులో గల్వాన్ ఘటనలోని కొన్ని క్లిప్లను కూడా ఉంచింది. వీటిల్లో భారత దళాలు తమ భూభాగంలోకి వస్తున్నయాంటూ పేర్కొన్నారు.
చైనా మీదకు దూసుకెళ్లిన మణిపూర్ యోధుడు
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
పదో విడత కోర్ కమాండర్ స్థాయి సమావేశాలకు ముందు సానుభూతి పొందేందుకు చైనా ఓ ప్రచార వీడియోను విడుదల చేసింది. ఇందులో గల్వాన్ ఘటనలోని కొన్ని క్లిప్లను కూడా ఉంచింది. వీటిల్లో భారత దళాలు తమ భూభాగంలోకి వస్తున్నాయని పేర్కొంది. వాస్తవానికి భారత దళాలు చైనా ఆక్రమణలను ఖాళీ చేయించే ప్రయత్నం అది. ఈ వీడియోలో ఈశాన్య భారత దేశానికి చెందిన ఓ కుర్రాడు భారత బృందాన్ని లీడ్ చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు నెటిజన్లు ఆ కుర్రాడెవరా..? అని ఆరాతీయడం మొదలుపెట్టారు. చివరికి అతడు మణిపూర్లోని సేనాపతి జిల్లాకు చెందిన సోయిబా మనినగ్బా రంగ్నామీగా తేలింది.
2018లో సైన్యంలో సోయిబా చేరాడు. ఈ కుర్ర ఆఫీసర్ 16 బిహార్ రెజిమెంట్లో కెప్టెన్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ విషయాన్ని మణిపూర్ ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ ట్విటర్ ఖాతాలో పంచుకొన్నారు. ఈ వీడియో వెలువడిన తర్వాత అతని వివరాలపై భారత సైన్యం తొలుత గోప్యత పాటించింది. కానీ, ట్వీట్ తర్వాత కేంద్ర యువజన వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా ధ్రువీకరించారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ‘మెన్షన్ ఆఫ్ డిస్పాచెస్’ గౌరవాన్ని ఇచ్చి ప్రభుత్వం సత్కరించింది.
దూకుడుగా ఆ రోజు..
జూన్ 6వ తేదీన జరిగిన భారత్-చైనా కోర్కమాండర్ స్థాయి సమావేశంలో గల్వాన్ లోయ వద్ద చైనా దళాలు వేసిన టెంట్లను తొలగించాలని అంగీకారానికి వచ్చారు. 15వ తేదీ సాయంత్రం 16 బిహార్ రెజిమెంట్ కమాండింగ్ ఆఫీసర్ కర్నల్ సంతోష్బాబు చైనా అధికారిని కలిసి జూన్6వ తేదీ నిర్ణయాన్ని అమలు చేయాలని కోరారు. ఆ సమయంలో చైనా దళాలు సంతోష్బాబుపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. దీంతో ఆయన్ను అక్కడి నుంచి భారత స్థావరానికి తీసుకొచ్చారు. ఈ ఘటన చూసి బిహార్ రెజిమెంట్ ఆవేశంతో రగిలిపోయింది. ఘాతక్ కమాండోలతో కలిసి భారీ సంఖ్యలో చైనా స్థావరం వద్దకు చేరుకొని ప్రతి దాడి చేసింది. కొన్ని గంటల పాటు జరిగిన దాడితో చైనా దళాలు బిత్తరపోయాయి. ఈ ఘటనతో చైనా వైపు కూడా భారీగా మృతి చెందారు. తాజాగా చైనా విడుదల చేసిన సోయిబా మనినగ్బా రంగ్నామీ కనిపించిన దృశ్యం ఎప్పటిదో తెలియదు. కానీ, భారత దళాలు తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నట్లు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.
ఇప్పుడే ఎందుకా వీడియో..
పదో విడత కోర్కమాండర్ చర్చలకు ముందు చైనా ఆ వీడియోను విడుదల చేసింది. భారత్ మొదటి నుంచి చైనా వైపు మృతుల సంఖ్య 40వరకు ఉంటుందని చెబుతోంది. చైనా మాత్రం ఆ సంఖ్యను అసలు వెల్లడించలేదు. గతంలో అమెరికా నిఘా వర్గాలు కూడా 35 మంది వరకు మరణించి ఉండొచ్చని అంచనా వేశాయి. ఉపగ్రహ చిత్రాలు, కమ్యూనికేషన్లను ఇంటర్సెప్ట్లు, బాధితులను తరలించడానికి వినియోగించిన అంబులెన్స్లను బట్టి ఈ అంచనా వేశారు. కానీ, ఇటీవల చైనాకు వ్యూహాత్మక మిత్రదేశమైన రష్యాకు చెందిన అధికారిక పత్రిక కూడా 40 మందికిపైగా చైనా జవాన్లు మృతి చెందారని వార్తను ప్రచురించింది. దీంతో చైనా వైపు మృతుల సంఖ్య భారీగా ఉందని దాదాపు నిర్ధారణ అయింది. దీంతో పరువు కాపాడుకోవడానికి గల్వాన్ ఘర్షణలో మృతి చెందిన నలుగురిని సీఎంసీ గౌరవించిందని పేర్కొంది. ఇక గ్లోబల్ టైమ్స్ ట్విటర్ విడుదల చేసిన వీడియోను చైనాలో ప్రజలు చూసే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ ట్విటర్ వాడరు. కేవలం బాహ్యప్రపంచం కోసమే దానిని విడుదల చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
-
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!
-
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు..
-
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
-
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ