హిమపాతం వస్తోంది.. వెనక్కు వెళ్లండి..

హిమాచల్ ప్రదేశ్‌లో మంచుతో నిండిన ప్రకృతి అందాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. అయితే గత కొంత కాలంగా కురుస్తున్న మంచు కారణంగా రహదారులన్నీ మూసుకుపోవటంతో...

Updated : 15 Jan 2020 12:59 IST

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో మంచుతో నిండిన ప్రకృతి అందాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. అయితే గత కొంత కాలంగా కురుస్తున్న మంచు కారణంగా రహదారులన్నీ మూసుకుపోవటంతో రాకపోకలకు తీవ్ర అవాంతరాలు ఏర్పడుతున్నాయి. తాజాగా కొందరు పర్యాటకులు కిన్నౌర్‌ జిల్లాలోని టింకు నల్లా ప్రాంతంలో అందాలను తిలకించేందుకు వెళ్లారు. అయితే వారు రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంచు చరియలు రోడ్డుపై పడ్డాయి. వాటిని చూసేందుకని వాహనాల నుంచి కిందకు దిగిన వారి వైపుకు మంచు చరియలు రావడం అక్కడి వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ దృశ్యాన్ని వారు తమ కెమెరాల్లో బంధించే ప్రయత్నం చేశారు. అయితే మంచు వారిని వెంటాడుతున్నట్లుగా మరింత ముందుకు రావడంతో వారిలో ఒక పర్యాటకుడు వెనక్కి పో అంటూ అరిచాడు. అది మరింత ముందుకు రావడంతో భయంతో కొంతమంది తమ వాహనాలు ఎక్కి కూర్చున్నారు. మరికొందరు మాత్రం కదులుతున్న మంచు చరియను తమ కెమెరాల్లో వీడియో తీస్తూ వెనక్కి పరిగెత్తారు. దీనికి సంబంధించిన వీడియోని నవీద్ ట్రుంబో అనే ఐఆర్‌ఎస్ అధికారి తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ఇంతక ముందెన్నడూ ఇలా మంచు చరియలు కదలడం చూడలేదని అన్నారు.

 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని