మంటల్లో సూరత్‌ వస్త్ర దుకాణాలు..!

గుజరాత్‌లోని సూరత్‌లో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మార్కెట్‌లోని రఘువీర్‌ కాంప్లెక్స్‌ అనే ఓ ఏడు అంతస్తుల భవనంలో భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి..........

Published : 21 Jan 2020 13:20 IST

సూరత్‌: గుజరాత్‌లోని సూరత్‌లో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మార్కెట్‌లోని ఏడంతస్తుల రఘువీర్‌ కాంప్లెక్స్‌ భవనంలో భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. ఇందులోని పలు వస్త్రదుకాణాలు దగ్ధమయ్యాయి. ఇప్పటి వరకు ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఇతర సహాయక బృందాలు వెంటనే అక్కడికి చేరుకున్నాయి. దాదాపు 60 అగ్నిమాపక యంత్రాలతో మంటల్ని ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని