పోహాపై దుమారం.. భాజపా నేతపై విమర్శలు
అటుకులతో చేసే అల్పాహారం ‘పోహా’పై మధ్యప్రదేశ్కు చెందిన భాజపా నేత ఒకరు చేసిన వ్యాఖ్యలు విమర్శలకు తావిచ్చాయి. దాన్ని తిన్నంత మాత్రన ఒక దేశ పౌరులుగా.....
ఇండోర్: అటుకులతో చేసే అల్పాహారం ‘పోహా’పై మధ్యప్రదేశ్కు చెందిన భాజపా నేత ఒకరు చేసిన వ్యాఖ్యలు విమర్శలకు తావిచ్చాయి. దాన్ని తిన్నంత మాత్రన ఒక దేశ పౌరులుగా ఎలా అంచనా వేస్తారంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఆయన తీరుపై సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు.
సీఏఏకు మద్దతుగా గురువారం ఇండోర్లో నిర్వహించిన సదస్సులో భాజపా ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గీయ ఈ వ్యాఖ్యలు చేశారు. తన ఇంటి నిర్మాణ పనికి వచ్చిన కూలీల ఆహార నియమాలు భిన్నంగా ఉన్నాయని, వారు పోహా తినడం బట్టి వారు బంగ్లాదేశీయులని అర్థమవుతోందన్నారు. తాను అనుమానించిన రెండు రోజుల తర్వాత వారు పనికి రావడం మానేశారని చెప్పారు. దీనిపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదూ చేయలేదని, ప్రజలను హెచ్చరించడానికే ఇది చెబుతున్నానని పేర్కొన్నారు.
కూలీలు పోహా తినడంపై చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆహార నియమాలను బట్టి వారి జాతీయతను ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా పోహాను ఇవాళ అల్పాహారంగా తీసుకుంటున్నారని, అంతమాత్రాన అందరూ బంగ్లాదేశీయులు అయిపోతారా? అని ట్విటర్ వేదికగా ప్రశ్నిస్తున్నారు. ‘బర్గర్ తినే వారు అమెరికన్ అయిపోతారా?’, ‘నేను రోజూ పోహా తింటున్నా. అయితే నేనూ అక్రమ వలసదారేనన్నమాట’, ‘కూలీలు పోహా కాకపోతే.. బటర్ చికెన్ తింటారా?’ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!