అపరిశుభ్రచేతులే అంటువ్యాధులకు కారణం
బోస్టన్: ప్రయాణంలో తమ చేతులు శుభ్రపరుచుకోవడం వలన అంటువ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. కేవలం ప్రపంచంలోని అతిపెద్ద విమానాశ్రయాల నుంచి ప్రయాణించే వారిలో కేవలం పదిశాతం మంది శుభ్రత పాటించినా..ఫలితంగా అంటువ్యాధుల వ్యాప్తిని దాదాపు 24శాతం తగ్గించవచ్చని అంటున్నారు శాస్ర్తవేత్తలు.
విమాన ప్రయాణికుల పరిశుభ్రతతో అంటువ్యాధుల నియంత్రణ అంటున్న పరిశోధకులు
బోస్టన్: ప్రయాణంలో తమ చేతులు శుభ్రపరుచుకోవడం వలన అంటువ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. కేవలం ప్రపంచంలోని అతిపెద్ద విమానాశ్రయాల నుంచి ప్రయాణించే వారిలో కేవలం పదిశాతం మంది శుభ్రత పాటించినా..ఫలితంగా అంటువ్యాధుల వ్యాప్తిని దాదాపు 24శాతం తగ్గించవచ్చని అంటున్నారు శాస్ర్తవేత్తలు. విమానాశ్రయాల్లో ఎంత ఎక్కువ మంది వారి చేతులు శుభ్రపరుచుకుంటారో..అంత ఎక్కువగా వ్యాధి వ్యాప్తి తీవ్రతను తగ్గించవచ్చని అమెరికాకు చెందిన మస్సాచుసెట్స్ ఇన్ట్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందన పరిశోధకులు చెబుతున్నారు.
కరోనావైరస్ విజృంభనకు ముందే రిస్క్ అనాలిసిస్ జర్నల్లో ప్రచురితమైన ఈ పరిశోధనా పత్రంలో..సాధారణ వైరస్ల గురించి పేర్కొన్నప్పటికీ..కరోనా వైరస్ల వంటి వైరస్ల వ్యాప్తికి అపరిశుభ్ర చేతులే కారణమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కానీ అత్యధిక రద్దీ ఉండే విమానాశ్రయాలల్లో ప్రయాణికులు దీన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా చాలా తేలికగా తీసుకుంటున్నారని తెలిపారు.
విశ్వవ్యాప్తంగా వివిధ దేశాల మధ్య ప్రయాణాల సమయంలో కేవలం 20శాతం మంది ప్రయాణికులు మాత్రమే తమ చేతులను సబ్బు, నీటితో శుభ్రం చేసుకుంటున్నారు. మిగతా 80శాతం మంది విమానాశ్రయాల్లోని కుర్చీలు, టాయిలెట్ల తలుపులు, బ్యాగు తనిఖీ ప్రదేశాలను ముట్టుకోవడంతో వారి చేతులకు ఉండే సూక్ష్మజీవులతో అవి మరింత కలుషితం అవుతున్నాయని తెలిపారు. ఇక టాయిలెట్కి వెళ్ళివచ్చే వారిలో కేవలం డెబ్బైశాతం మంది తమ చేతులను శుభ్రం చేసుకుంటుండగా..వీరిలో సగం మంది మాత్రమే సక్రమంగా తమ చేతులను శుభ్రం చేసుకుంటున్నారని సిప్రస్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొ.క్రిస్టోస్ నికోలేడ్స్ పేర్కొన్నారు. ఇక మిగతా ముప్పై శాతం మంది అసలు శుభ్రతే పాటించడం లేదని తెలిపారు.
ఒకవేళ ప్రపంచంలోని అన్ని విమానాశ్రయాల్లో ప్రయాణికులు శుభ్రత పాటిస్తే..విశ్వవ్యాప్తంగా దాదాపు 70శాతం వ్యాధులను వివిధ దేశాలకు వ్యాప్తిచెందకుండా నివారించవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. వ్యాధి బయటపడిన వెంటనే సమీపంలోని దాదాపు పది విమానాశ్రయాల్లో ఈ నిబంధనలు పాటిస్తే వ్యాధి వ్యాప్తి తీవ్రతను మరింత అరికట్టవచ్చని సూచించారు. కేవలం ఆ సమయంలో విమాన ప్రయాణికులను పరిశుభ్రతపై అప్రమత్తం చేయడం వలన దాదాపు 37శాతం వ్యాధుల వ్యాప్తిని అరికట్టవచ్చని పరిశోధకులు అంచనా వేశారు. వివిధ దేశాల మధ్య దూరం, వాటి మధ్య సేవలందించే విమానాల సంఖ్యను పరిగణలోకి తీసుకొని పరిశోధకులు ఈ అంచనాకు వచ్చారు. అంతేకాకుండా విమానాశ్రయాల్లో ప్రయాణికులు వేచి ఉండే సమయం, ఆ సమయంలో వేరే దేశాల ప్రజలతో చేసే సంభాషణలను పరిగణలోకి తీసుకున్నారు.
అయితే బహిరంగ ప్రకటనలతో ప్రయాణికులను చైతన్యపరచడం, పోస్టర్లు అంటించడం, చేతులు శుభ్రపరుచుకోడానికి తగిన సౌకర్యం కల్పించడం వంటి చర్యలతో దీన్ని అమలుచేయచ్చని అంటున్నారు. ఇలాంటి చర్యలతో చేతులు శుభ్రపరుచుకొనే అవకాశాలు మెరుగవుతాయని పలు పరిశోధనలు రుజువుచేశాయని గుర్తుచేశారు. చేతుల శుభ్రతతో అత్యంత సమర్థవంతంగా, తక్కువ ఖర్చుతో వ్యాధుల వ్యాప్తిని నియంత్రించవచ్చని అమెరికా వ్యాధి నియంత్రణ కేంద్రం, ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన సూచనలను ఉదహరించారు పరిశోధకులు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలపై అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం