మాజీ ఐఏఎస్పై ప్రజా భద్రతా చట్టం
మాజీ ఐఏఎస్ అధికారి, జమ్మూకశ్మీర్ పీపుల్స్ మూవ్మెంట్ పార్టీ(జేకేపీఎం) చీఫ్ సా ఫైజల్పై పోలీసులు కఠినమైన జాతీయ భద్రతా చట్టాన్ని(పీఎస్ఏ) ప్రయోగించారు...........
శ్రీనగర్: మాజీ ఐఏఎస్ అధికారి, జమ్మూకశ్మీర్ పీపుల్స్ మూవ్మెంట్ పార్టీ(జేకేపీఎం) చీఫ్ షా ఫైజల్పై పోలీసులు కఠినమైన ప్రజా భద్రతా చట్టాన్ని(పీఎస్ఏ) ప్రయోగించారు. అదే రాష్ట్రానికి చెందిన మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా సహా మరికొంత మంది నేతలు ఇప్పటికే ఇదే చట్టం కింద నిర్బంధంలో ఉన్నారు. ఆగస్టు 5న అధికరణ 370 రద్దు చేసిన తర్వాత ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఫైజల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పీఎస్ఏ కింద అరెస్టు చేసిన వారిని రెండేళ్ల పాటు ఎలాంటి విచారణ లేకుండా జైల్లో ఉంచే అధికారం పోలీసులకు ఉంటుంది.
మరోవైపు ఒమర్ అబ్దుల్లాపై పీఎస్ఏ ప్రయోగించడాన్ని ఆయన సోదరి సారా అబ్దుల్లా పైలట్ సుప్రీం కోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. సారా పిటిషన్పై వివరణ ఇవ్వాలని జమ్మూకశ్మీర్ పాలకవర్గాన్ని ఆదేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్