‘ఖేలో ఇండియా’ అథ్లెట్లకు సరైన వేదిక: మోదీ
దేశంలోనే తొలిసారిగా ‘ఖేలో ఇండియా’ యూనివర్శిటీ క్రీడా పోటీలకు శనివారం ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ఒడిశాలోని జవహార్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించనున్న ఈ క్రీడలను మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మొదలుపెట్టారు.
దిల్లీ: దేశంలోనే తొలిసారిగా ‘ఖేలో ఇండియా’ యూనివర్శిటీ క్రీడా పోటీలను శనివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఒడిశాలోని జవహార్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన ఈ క్రీడలను మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మొదలుపెట్టారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఒడిశా ఈ రోజు కొత్త చరిత్రకు వేదికైందన్నారు. భవిష్యత్తులో భారత క్రీడా రంగానికి ఇది గొప్ప ముందడుగుగా పేర్కొన్నారు. ఈ పోటీలు అథ్లెట్లకు తమ కలల్ని నెరవేర్చుకునేందుకు మంచి వేదిక అని అన్నారు. అథ్లెట్లు ఈ పోటీల ద్వారా నైపుణ్యాల్ని మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంది అన్నారు. వీటి ద్వారా ప్రతిభ ఉన్న కొత్త క్రీడాకారులు వెలుగులోకి వస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు.
పోటీల ప్రారంభోత్సవం సందర్భంగా జవహార్లాల్ నెహ్రూ స్టేడియానికి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, కేంద్రమంత్రులు కిరణ్ రిజిజు, ధర్మేంద్ర ప్రధాన్, క్రీడాశాఖ కార్యదర్శి రాధే శ్యామ్ తదితరులు హాజరయ్యారు. ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా ఉన్న 159 యూనివర్శిటీల నుంచి 3400 మంది అథ్లెట్లు పాల్గొననున్నారు. వీరంతా రగ్బీ సహా మొత్తం 17 క్రీడల్లో పోటీ పడనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దక్కని బెయిల్.. కేంద్ర కారాగారానికి రేవణ్ణ
మహిళ కిడ్నాప్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి హెచ్.డి.రేవణ్ణను పరప్పన అగ్రహార కేంద్ర కారాగారానికి బుధవారం తరలించారు. -
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ 100 సర్వీసుల రద్దు
టాటా గ్రూప్లోని విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్ప్రెస్కు ఉద్యోగుల సెగ తగిలింది. -
పూంఛ్ దాడిలో పాక్ మాజీ కమాండో.. గుర్తించిన ఏజెన్సీలు..!
పూంఛ్ వద్ద వాయుసేన కాన్వాయ్పై జరిగిన దాడిలో పాక్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దేశానికి చెందిన మాజీ కమాండో ఈ ఘటనలో నేరుగా పాల్గొన్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి.
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్