జమ్మూలో ఇద్దరికి అధిక వైరల్ లోడ్!
కరోనా వైరస్ సోకినట్లుగా అనుమానిస్తున్న ఇద్దరు వ్యక్తులు జమ్మూలో చికిత్స పొందుతున్నట్లు అక్కడి పాలనా యంత్రాంగం వెల్లడించింది. తొలిదశ పరీక్షల్లో వైరల్ లోడ్ తీవ్రత అధికంగా ఉన్నట్లు గుర్తించామన్నారు.......
జమ్మూ: కరోనా వైరస్ సోకినట్లుగా అనుమానిస్తున్న ఇద్దరు వ్యక్తులు జమ్మూలో చికిత్స పొందుతున్నట్లు అక్కడి పాలనా యంత్రాంగం వెల్లడించింది. తొలిదశ పరీక్షల్లో వైరల్ లోడ్ తీవ్రత అధికంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. తదుపరి పరీక్షల్లో పాజిటివ్ వచ్చే అవకాశం అధికంగా ఉందని ఓ అధికార ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రంలో ఉంచిన వారిపై వైద్య పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు. వీరిలో ఒకరు గతంలో ఇటలీకి, మరొకరు దక్షిణ కొరియాకు వెళ్లొచ్చినట్లు తెలిసిందన్నారు. తొలుత వీరు ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డు నుంచి పారిపోయారని.. ఎట్టకేలకు తిరిగి పట్టుకున్నామన్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో జమ్ము, సాంబా జిల్లాల్లో అన్ని ప్రాథమిక పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అలాగే జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా ఉద్యోగులకు ‘బయోమెట్రిక్ హాజరు విధానం’ నుంచి మినహాయింపు కల్పించారు. జమ్మూకశ్మీర్లో దాదాపు 200 మంది ఇటీవల వైరస్ ప్రభావిత దేశాలకు వెళ్లొచ్చినట్లు గుర్తించిన కేంద్రం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు 25 మందిని పరీక్షించగా.. ఒక్కరికి కూడా పాజిటివ్ రాలేదు. మరోవైపు ఇటీవల ఇటలీకి వెళ్లొచ్చిన ఇద్దరు అమృత్సర్ వాసులకు కూడా వైరస్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ప్రాథమిక పరీక్షల్లో వైరల్ లోడ్ తీవ్రత అధికంగా ఉన్నట్లు గుర్తించామని గురునానక్ దేవ్ వైద్యులు తెలిపారు. భారత్లో ఇప్పటి వరకు 31 మందిలో వైరస్ ఉన్నట్లు నిర్ధారించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.