చైనా.. వీటికి జవాబులేవి: అమెరికా
కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పుడే తమ వైద్యబృందానికి అనుమతి ఎందుకివ్వలేదని చైనాపై అమెరికా మంత్రి మైక్ పాంపియో తీవ్ర విమర్శలు చేశారు. బీజింగ్ తమ ప్రశ్నలకు జవాబులు చెప్పాలని, పారదర్శకంగా ఉండాలని పేర్కొన్నారు. కొవిడ్-19ను ప్రపంచ మహమ్మారిగా ప్రకటించడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ....
ఆ వైరస్ వుహాన్లోనే పుట్టింది.. అక్కడ ల్యాబ్ ఉంది: మైక్ పాంపియో
వాషింగ్టన్: కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పుడే తమ వైద్య బృందానికి అనుమతి ఎందుకివ్వలేదని చైనాపై అమెరికా మంత్రి మైక్ పాంపియో తీవ్ర విమర్శలు చేశారు. బీజింగ్ తమ ప్రశ్నలకు జవాబులు చెప్పాలని, పారదర్శకంగా ఉండాలని పేర్కొన్నారు. కొవిడ్-19ను ప్రపంచ మహమ్మారిగా ప్రకటించడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఎక్కువ సమయం తీసుకుందని విమర్శించారు. దేశంలోని వివిధ మీడియా సంస్థలకు ఇచ్చిన ముఖాముఖిలో ఆయన ఆ కమ్యూనిస్టు దేశంపై విరుచుకుపడ్డారు.
‘ఆరంభంలో, సరైన సమయంలో, అవసరమైనప్పుడు చైనీస్ కమ్యూనిస్టు పార్టీ అమెరికాకు అనుమతి ఇవ్వలేదు. అధ్యక్షుడు దానిపైనే ఈ రోజు మాట్లాడారు. అక్కడ ప్రయోగశాల ఉందని తెలుసు. మాంసాహార విపణి ఉందని తెలుసు. ఆ వైరస్ వుహాన్లోనే పుట్టిందని తెలుసు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. ఇప్పటికీ అమెరికాకు తెలియని సమాచారం ఎంతో ఉంది. అమెరికాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ పతనమైంది’ అని పాంపియో అన్నారు.
‘మాకిప్పుడు జవాబులు కావాలి. పారదర్శకత కావాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ తన కర్తవ్యాన్ని నిక్కచ్చిగా చేయాలి. ప్రపంచానికి సరైన, కాలానుగుణ, సమర్థ, నిజమైన సమాచారం ఇవ్వాలి. వారీ పని చేయలేదు. ప్రపంచానికి మేలు చేసే సంస్థలు అవసరం. ఇది అన్ని దేశాలకు సరైన సమాచారం అందించాలి. కానీ అలా జరగలేదు. ఇలాంటి మహమ్మారులు మళ్లీ రాకుండా జాగ్రత్త పడాలి. అన్ని దేశాలను అప్రమత్తం చేయాల్సిన సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆ పని చేయలేదు. అమెరికన్ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోని ఆ సంస్థకు అమెరికన్ పన్నుదారుల డబ్బులను ఒక్క డాలర్ కూడా ఇవ్వం’ అని పాంపియో విమర్శించారు.
‘ఆ వైరస్ చైనాలోని వుహాన్లో పురుడు పోసుకుంది. ఇవన్నీ నిజాలు. ప్రతి ప్రభుత్వం రెండు పనులు చేయాలని మేం కోరుకుంటున్నాం. ఒకటి ఏం జరుగుతుందో యదార్థంగా చెప్పాలి. దేశంలో కరోనా స్థితిని వివరించాలి. ఎందరు చనిపోయారు? ఎలాంటి కేసులున్నాయి?ఎలాంటి పరీక్షలు నిర్వహిస్తున్నారో వివరించాలి. చైనా అధ్యక్షుడి విషయానికి వస్తే... ఈ వైరస్ బహుశా అమెరికా సైనికులు లేదా అమెరికా ఆయుధ ప్రయోగశాల సృష్టి అంటున్నారు. అలాంటప్పుడు ఇది చాలా రిస్క్. మీరు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తే నష్టపోతారు. అమెరికన్ల ఆరోగ్యానికి, జీవన శైలికి చైనా ఎనలేని ముప్పు తీసుకొచ్చింది. ప్రపంచానికి తప్పుడు సమాచారం చెప్పింది’ అని పాంపియో ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమెరికాలో కరోనా వైరస్తో మంగళవారానికి 25,000 మందికి పైగా మృతిచెందారు. 6,05,000పైగా అమెరికన్లు కొవిడ్-19తో బాధపడుతున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా 1,26,722 మంది మరణించారు. బాధితుల సంఖ్య 20 లక్షలు దాటేసింది.
చదవండి: లాక్డౌన్ సడలింపు మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
నేటి నుంచి ‘వీఐటీఈఈఈ’ ప్రవేశ పరీక్షలు
వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ కోర్సులో చేరేందుకు వీఐటీ.. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలను (వీఐటీఈఈఈ) నిర్వహిస్తోంది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి డాక్టర్ లక్ష్మి