వుహాన్ లేబొరేటరీలో ఏం జరిగింది?
చైనాలో మొదలై ప్రపంచదేశాలను పట్టి పీడిస్తోన్న మహమ్మారి కరోనా వైరస్ అంతకంతకూ విజృంభిస్తోంది. ముఖ్యం అగ్ర రాజ్యం అమెరికా కరోనా ధాటికి చిగురుటాకులా
కరోనా వైరస్ అలా బయటకు వచ్చిందట
ఫాక్స్ న్యూస్ తాజా నివేదిక
ఇంటర్నెట్డెస్క్: చైనాలో మొదలై ప్రపంచదేశాలను పట్టి పీడిస్తోన్న మహమ్మారి కరోనా వైరస్ అంతకంతకూ విజృంభిస్తోంది. ముఖ్యంగా అగ్ర రాజ్యం అమెరికా కరోనా ధాటికి చిగురుటాకులా వణికిపోతోంది. ఆ దేశంలో మరణాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇంతటి విపత్తుకు కారణమైన కరోనా వైరస్ పుట్టుకకు చైనాయే కారణమా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నట్లు ఆ వైరస్ను సృష్టించింది చైనాయేనా? మరణాల సంఖ్య నానాటికీ పెరుగుతున్నా, కరోనా వైరస్ ఎక్కడ పుట్టిందన్న వాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకు కారణం మీరంటే.. మీరంటూ అమెరికా-చైనా అంతర్జాతీయ వేదికగా వాదించుకుంటున్నాయి. తాజాగా ఫాక్స్ న్యూస్ బయట పెట్టిన నివేదిక ఏం చెబుతోంది. దానికి ట్రంప్ ఏమంటున్నారు?
మాంసాహార మార్కెట్లో పుట్టిందనుకున్నారు
మహమ్మారి కరోనా వైరస్ జన్మస్థలం చైనాలోని వుబెయ్ ప్రావిన్స్ వుహాన్ నగరమన్నది అందరికీ తెలిసిందే. చైనాలోని ప్రధాన నగరాల్లో ఇదొకటి. ప్రపంచంలోనే అతిపెద్ద మాంసాహార మార్కెట్ ఇక్కడుంది. అక్కడి సముద్ర జంతువుల ఆహారం దొరికే చోటే గతేడాది చివర్లో కరోనా వైరస్ పుట్టిందని అందరూ అనుకుంటున్నారు. అక్కడి ఆహారాన్ని కొనుగోలు చేసి తిన్న వ్యక్తి ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకిందని భావిస్తున్నారు.
ఫాక్స్ న్యూస్ ఏం బయట పెట్టింది?
అయితే, ఫాక్స్ న్యూస్ అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా సేకరించిన నివేదిక మరోలా చెబుతోంది. ఈ వైరస్కు నిలయమైన గబ్బిలాలపై వుహన్ లేబొరేటరీలో పరిశోధన చేస్తుండగా, తొలుత అక్కడ పనిచేసే వ్యక్తికి సోకడం ద్వారా వ్యాపించిందట. ‘పేషెంట్ జీరో’ అక్కడ పనిచేస్తుండటం, ఆమె నుంచి ఈ దావానలం సామాజ్య ప్రజలకు వ్యాపించిందని చెబుతోంది. అంతేకానీ, ఇది జీవాయుధం కాదని వెల్లడించింది. వుహాన్ ల్యాబ్లో జరిగిన ఈ ఘటనను కప్పిపుచ్చేందుకు చైనా ప్రయత్నాలు చేసిందని, మార్కెట్ ద్వారా వ్యాపించినట్లు చెప్పుకొచ్చిందని ఫాక్స్ తెలిపింది.
మరిన్ని కథనాలు వింటారు: ట్రంప్
దీనిపై తాజాగా శ్వేతసౌథంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఫాక్స్ న్యూస్ విలేకరి ట్రంప్తో మాట్లాడుతూ.. ‘‘ఫాక్స్ న్యూస్కు వివిధ విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం ఉంది. కరోనా వైరస్ సహజంగానే కొన్ని జంతువుల్లో ఉంటుంది. అయితే, అది పుట్టింది మాత్రం వుహాన్లోని వైరాలజీ ల్యాబ్ నుంచే. సరైన ప్రమాణాలు పాటించకపోవడంతో అక్కడ పనిచేసే సిబ్బందిలో ఒకరికి ఈ వ్యాధి సోకింది. ఆమె తన బాయ్ ఫ్రెండ్ను కలవడం, అతను మార్కెట్కు వెళ్లడం అక్కడి నుంచి వ్యాధి ఇతరులకు వ్యాపించడం ద్వారా మహమ్మారిలా మారింది’’ దీనిపై మీరేంటారు? అని అడగ్గా, ఈ నివేదికను ట్రంప్ నిజమైనదేనని చెప్పలేదు.. అలాగని ఖండించలేదు. ‘మరిన్ని కథనాలు మనం వింటాం. చూస్తాం. ప్రస్తుత పరిస్థితిపై మరింత శూలశోధన చేస్తున్నాం’’ అని మాత్రం సమాధానం ఇచ్చారు.
రెండేళ్ల కిందటే హెచ్చరించిన యూఎస్ ఎంబసీ
ఇక ఇటీవల చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో చైనీస్ ల్యాబ్ భద్రతపై ఫోన్లో మాట్లాడారట? అని అదే విలేకరి ప్రశ్నించగా, ‘లేబొరేటరీ గురించి నేను ఏం మాట్లాడానో చర్చించదలచుకోలేదు. ఇది అప్రస్తుతం’ అని సమాధానం ఇచ్చారు. అత్యంత ప్రమాదకర వైరస్లపై పరిశోధన చేస్తున్న వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో భద్రత ప్రమాణాలపై రెండేళ్ల కిందటే యూఎస్ ఎంబసీ హెచ్చరించిందని ఇటీవల వాషింగ్టన్ పోస్ట్ కూడా ఒక కథనాన్ని ప్రచురించింది. వుహాన్లోని ఈ ల్యాబ్ మాంసాహార విక్రయ మార్కెట్కు అత్యంత సమీపంలో ఉండటం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను చంపేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్