న్యూయార్క్‌లో వెంటిలేటర్‌పై 90% మృతి!

న్యూయార్క్‌లోని ఆస్పత్రుల్లో వెంటిలేటర్‌పై ఉన్న కరోనా రోగుల్లో 90% మంది మృతిచెందారని పరిశోధకులు కనుగొన్నారు. నగరంలోని నార్త్‌వెల్‌ హెల్త్‌లో ఆస్పత్రి పాలైన 5,700 బాధితుల ఎలక్ట్రానిక్‌ ఆరోగ్య రికార్డులను పరిశీలించారు. అధ్యయనం వివరాలను అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ జర్నల్‌లో ప్రచురించారు....

Published : 23 Apr 2020 18:24 IST

ముంబయి: న్యూయార్క్‌లోని ఆస్పత్రుల్లో వెంటిలేటర్‌పై ఉన్న కరోనా రోగుల్లో 90% మంది మృతిచెందారని పరిశోధకులు కనుగొన్నారు. నగరంలోని నార్త్‌వెల్‌ హెల్త్‌లో ఆస్పత్రి పాలైన 5,700 బాధితుల ఎలక్ట్రానిక్‌ ఆరోగ్య రికార్డులను పరిశీలించారు. అధ్యయనం వివరాలను అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ జర్నల్‌లో ప్రచురించారు.

నార్త్‌వెల్‌ హెల్త్‌లో చికిత్స పొందిన కొవిడ్‌-19 బాధితుల్లో 20% మంది మృతిచెందగా అందులో 88% మంది వెంటిలేటర్‌పై చనిపోయారని పరిశోధకులు తెలిపారు. అమెరికాలో నమోదైన కరోనా కేసుల్లో అతిపెద్ద కేసుల సిరీస్‌ ఇదేనని వారు పేర్కొన్నారు. ఆస్పత్రిలో 373 (14.2%) రోగులకు ఇంటెన్సిస్‌ కేర్‌లో చికిత్స అందించగా, 320 (12.2%)కు వెంటిలేషన్‌ అందించారు. 81 (3.2%) మూత్రపిండాల మార్పిడి చేసిన వారున్నారు. వీరిలో 553 (21%) మంది మరణించారు. మెకానికల్‌ వెంటిలేషన్‌ అందించిన వారిలో 88.1 శాతం మరణించారని పరిశోధకులు వెల్లడించారు. కాగా ఈ పరిశోధనలో కొన్ని పరిమితులు ఉన్నాయని వారు తెలిపారు.

‘ఈ అధ్యయనంలో కొన్ని పరిమితులు ఉన్నాయి. మొదటిది మేం న్యూయార్క్‌ మెట్రోపాలిటన్‌ ప్రాంతంలోని రోగులనే తీసుకున్నాం. రెండోది ఎలక్ట్రానిక్‌ ఆరోగ్య రికార్డుల సమాచారాన్నే పరిశీలించాం’ అని వారు తెలిపారు. అమెరికాలో కొవిడ్‌-19 కేసులు సంఖ్య 8.5 లక్షలకు చేరుకున్న సంగతి తెలిసిందే.

చదవండి: లాక్‌డౌన్‌ నుంచి వీటికి మినహాయింపు

చదవండి: కరువు భత్యంపై కేంద్రం కీలక నిర్ణయం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని