లాక్‌డౌన్‌ సడలింపు వారికి మాత్రమే: హోంశాఖ

లాక్‌డౌన్‌ కారణంగా ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులు తమ స్వస్థలాలకు చేరవేసేందుకు అనుమతిస్తూ కేంద్రం ప్రత్యేక రైళ్లు నడపునున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రైళ్లలో ప్రయాణించేందుకు లక్షలాది మంది.........

Published : 04 May 2020 01:18 IST

దిల్లీ: లాక్‌డౌన్‌ కారణంగా ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులు తమ స్వస్థలాలకు చేరవేసేందుకు అనుమతిస్తూ కేంద్రం ప్రత్యేక రైళ్లు నడపునున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రైళ్లలో ప్రయాణించేందుకు లక్షలాది మంది కూలీలు దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు సాధారణ ప్రజలు కూడా స్వస్థలాలకు పయనమవుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసింది. లాక్‌డౌన్‌కు ముందు ఉపాధి కోసం, ఉద్యోగ నిర్వహణలో భాగంగా ఇతర ప్రాంతాలకు వెళ్లి లాక్‌డౌన్‌ ఆంక్షల కారణంగా అక్కడ చిక్కుకుపోయిన వలస కార్మికులు, ఉద్యోగులకు మాత్రమే ఇతర రాష్ట్రాల్లోని తమ స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ విషయమై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని