భోజనం.. నీళ్లు లేవు: 800 కి.మీ. ప్రయాణం

మహమ్మారి కరోనా వైరస్‌ వలస కూలీల పాలిట పెను శాపంగా మారింది. స్వస్థలాలకు చేరుకునేందుకు వారు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ఇప్పటివరకూ

Published : 10 May 2020 01:23 IST

రాయ్‌పూర్‌: మహమ్మారి కరోనా వైరస్‌ వలస కూలీల పాలిట పెను శాపంగా మారింది. స్వస్థలాలకు చేరుకునేందుకు వారు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ఇప్పటివరకూ కాలి నడకన, సైకిళ్లపైనా, దొంగచాటుగా వెళ్లారు. ఇటీవల ప్రభుత్వం ఆంక్షలు సడలించి ప్రత్యేక రైళ్లు వేయడంతో కాస్త ఉపశమనం లభించింది. మరోవైపు లారీల ద్వారా వలసకూలీలను తరలిస్తున్నారు. అలా ఛత్తీస్‌గఢ్‌కు చేరిన కూలీల పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు.

తెలంగాణ నుంచి ఛత్తీస్‌గఢ్‌కు ఒక పెద్ద ఇనుప ట్రక్‌లో పలువురు వలస కూలీలు బయలుదేరి వెళ్లారు. దారి మధ్యలో కనీసం వాళ్లు తాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితి. అలా 800 కి.మీ. ప్రయాణించారు. మండుటెండలో వారు పడిన అవస్థలు చెప్పలేనవి. పైన ఎండ మండిపోతుంటే ఆ వేడికి ట్రక్‌ పెనంలా మాడిపోతుంటే ఆ బాధనంతా పంటి బిగువన భరించారు. తమ బిడ్డలకు ఎండ తగలకుండా  చీర కొంగు కప్పి తీసుకెళ్తున్న దృశ్యం అవి చూసిన వారి హృదయాలను కలచి వేసింది.

‘రెండు గంటలకు పైగా మండుటెండలోనే ప్రయాణిస్తున్నాం. కనీసం మాకు తాగడానికి, తినడానికి కూడా ఏమీలేవు’ అని అందులో ప్రయాణిస్తున్న ఓ వలస కూలీ ఆవేదన వ్యక్తం చేశారు. ‘నాలుగు రోజుల కిందట మేము హైదరాబాద్‌లో బయలు దేరాం. అధికారులెవరూ మాకు ఏదీ ఇవ్వలేదు. ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం కూడా సాయం చేయలేదు. కనీసం మా పిల్లలకైనా తినడానికి ఏమైనా ఇవ్వండి’ అని ఓ మహిళ వాపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు