భారత్లో అందుకే కేసులు పెరుగుతున్నాయా?
కరోనా వైరస్ను అరికట్టడానికి దేశంలో లాక్డౌన్ విధించి సుమారు రెండు నెలలు గడుస్తున్న నేపథ్యంలో వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆంక్షలను సడలించింది...
ట్రక్కులు, టెంపోల్లో ప్రయాణిస్తున్న వలసదార్లు..
ముంబయి: కరోనా వైరస్ను అరికట్టడానికి దేశంలో లాక్డౌన్ విధించి సుమారు రెండు నెలలు గడుస్తున్న నేపథ్యంలో వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆంక్షలను సడలించింది. వారి తరలింపునకు శ్రామిక్ రైళ్లు, ఆర్టీసీ బస్సులు ఏర్పాట్లు చేసినా చాలా మంది వలసదార్లు లారీలు, టెంపో వాహనాల్లో వెళ్లేందుకే మోగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో భౌతిక దూరం పాటించకుండా ప్రయాణిస్తూ కరోనా వ్యాప్తి చెందడానికి కారణమవుతున్నారు! దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో అనేక రాష్ట్రాల నుంచీ వేల సంఖ్యలో వలసలు వచ్చి జీవిస్తుంటారు. లాక్డౌన్ కారణంగా వారందరికీ ఉపాధి లేకపోవడంతో చేతిలో డబ్బులు కరవయ్యాయి. ఇక చేసేది లేక స్వగ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమవుతూ ప్రైవేటు వాహనాల్లో ప్రయాణిస్తున్నారు.
ఒక్కొక్కరి నుంచి రూ.1500 నుంచి 4500 వసూలు చేస్తున్నారు..
బస్సుల్లో వెళ్తే కేవలం ఆయా రాష్ట్రాల సరిహద్దుల వరకే వెళ్లాల్సి వస్తుందని. రైళ్లలో వెళ్లాలంటే తమ గమ్యస్థానాలకు దూరంగా ఉండే స్టేషన్లలో దిగాల్సి వస్తుందని అనేక మంది వాపోతున్నారు. ఈ క్రమంలో అక్కడి నుంచి మళ్లీ తమ స్వగ్రామాలకు చేరుకోవాలంటే ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేసుకోవాల్సి వస్తుందని చెప్పారు. అందుకు బదులు లారీల్లో, టెంపో వాహనాల్లో వెళితే తమకు అనుకూలంగా, స్వగ్రామాల దగ్గర్లో దిగి వెళ్లొచ్చని అభిప్రాయపడ్డారు. ఇలా ప్రయాణించడం కష్టమైనా ఇదే ఉత్తమ మార్గమని చెబుతున్నారు. మరోవైపు దొరికిందే అవకాశంగా.. లారీ డ్రైవర్లు, టెంపో వాహనాల యజమానులు వలసకార్మికుల నుంచి నిలువు దోపిడీ చేస్తున్నారు. ముంబయి నుంచి మధ్యప్రదేశ్, ఉత్తర్ప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్ లాంటి రాష్ట్రాలకు వెళ్లాలంటే ఒక్కో వ్యక్తి నుంచి సుమారు రూ.1500 నుంచి 4500 దాకా వసూలు చేస్తున్నారు. ఏదేమైనా తొందరగా స్వగ్రామాలకు వెళ్లాలని భావించి వారు కూడా అధికమొత్తంలో చెల్లించి ప్రయాణాలు సాగిస్తున్నారు.
ఇప్పుడు రహదార్ల వెంట నడిచే వారు తగ్గారు..
కాగా, ఆంక్షల సడలింపులకు ముందు అనేక మంది వలసదార్లు తట్టాబుట్టా సర్దుకొని జాతీయ రహదార్లపై నడుచుకుంటూ వెళ్లడం సాగించేవారు. ఇప్పుడు రవాణా సౌకర్యాలు కాస్త మెరుగవ్వడంతో అలా నడిచి వెళ్లే వారి సంఖ్య బాగా తగ్గిందని రహదార్ల వెంట నివసించే స్థానికులు చెబుతున్నారు. దేశంలో మహారాష్ట్రలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అక్కడి నుంచి పెద్ద సంఖ్యలో వలసదార్లు లారీల్లో, ఇతర వాహనాల్లో గుమిగూడి వెళ్తుండడంతో భౌతిక దూరం పాటించలేకపోతున్నారు. దీంతో కేసులు పెరిగే అవకాశం లేకపోలేదు. మరోవైపు కొందరు వలసదార్లు శ్రామిక్ రైళ్లలో వెళ్లేందుకు ఆన్లైన్లో బుక్చేసుకున్నా సరైన స్పందన రాలేదని వాపోయారు. అనుమతుల కోసం పోలీస్స్టేషన్ల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని ఉమేశ్ కుమార్ అనే ఓ కార్మికుడు వివరించారు. ఈ నేపథ్యంలోనే కష్టమైనా ఇలా వెళ్లేందుకే మొగ్గుచూపతున్నానని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా, వలసదార్లు ఇంటికి చేరుకునే క్రమంలో చాలా మంది రోడ్డు ప్రమాదాలకు గురౌతున్నారు. ముఖ్యంగా లారీల్లో వెళ్లేవారు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుండడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనారోగ్య సమస్యలతో కేజ్రీవాల్ మరణించేలా కుట్ర: దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్
తిహాడ్ జైల్లో అరవింద్ కేజ్రీవాల్పై కుట్ర జరుగుతోందని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ శనివారం ఆరోపించారు. -
ఈ పోలింగ్ ‘బ్యూటీ’ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?
Isha Arora: యూపీలో విధులు నిర్వహించిన పోలింగ్ ఏజెంట్ ఈశా అరోడా ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్గా మరారు. ఇంతకీ ఎవరామె..? -
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్
Doordarshan: ‘డీడీ న్యూస్’ లోగోను కాషాయ రంగులోకి మార్చడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది ‘ప్రసార భారతి’ కాదని ‘ప్రచార భారతి’గా మారిందని పలువురు మండిపడుతున్నారు. -
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
అనారోగ్య సమస్యలతో కేజ్రీవాల్ మరణించేలా కుట్ర: దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్
-
‘ఇంకెవరూ మీ భార్యే..’: కోహ్లీ ఆన్సర్కు షాకైన దినేశ్ కార్తిక్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘నానమ్మా.. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా చేయట్లేదా?’: ఉపాసన ఫన్నీ వీడియో
-
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?
-
పాకిస్థాన్కు ‘క్షిపణి’ సాయం.. చైనా సంస్థలపై అగ్రరాజ్యం ఆంక్షల కొరడా!