వైరస్ నివారణ.. ఆరడుగుల దూరం సరిపోదా?
కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు మనుషుల మధ్య వ్యక్తిదూరం ఎంతో ముఖ్యం. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం కనీసం 6 అడుగుల దూరం ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
వాషింగ్టన్: కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు వ్యక్తుల మధ్య భౌతికదూరం ఎంతో ముఖ్యం. ప్రస్తుతం అంతర్జాతీయ మార్గదర్శకాల ప్రకారం కనీసం 6అడుగుల దూరం ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకకుండా ఉండేందుకు ఆరడుగుల దూరం సరిపోదని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. సాధారణంగా గంటకు 4-15కి.మీ వేగంతో గాలి వీస్తున్న సమయంలో దగ్గు వల్ల వచ్చే తుంపరులు కనీసం 18అడుగుల దూరం ప్రయాణిస్తున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. దీంతో కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత దూరం మరింత ఎక్కువే ఉండాల్సిన అవసరాన్ని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
వ్యక్తులు దగ్గినప్పుడు వైరస్ కణాలు గాలిలో ఏవిధంగా ప్రయాణిస్తాయి అనే అంశంలో సైప్రస్ దేశానికి చెందిన యూనివర్సిటీ ఆఫ్ నికోసియా అధ్యాపకులు పరిశోధనలు చేపట్టారు. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో గాలిలో వైరస్ వ్యాప్తి గురించి పరిశోధనలు చేశారు. దీనికి సంబంధించిన తాజా నివేదిక ఫిజిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్లో ప్రచురితమైంది.
దాదాపు స్వల్ప వేగంతో(గంటకు 4కి.మీ) వీచే గాలుల వల్లకూడా నోటి తుంపరులు 5సెకండ్లలోనే దాదాపు 18 అడుగుల దూరం ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. ఇలాంటి తుంపరులు భిన్న శారీరక ఎత్తు కలిగిన చిన్నారులతోపాటు పెద్దవారిపై కూడా ప్రభావం చూపిస్తాయని పరిశోధనలో పాల్గొన్న డిమిట్రిస్ డ్రికాకిస్ పేర్కొన్నారు. ముఖ్యంగా లాలాజల తుంపరులు పయణించే మార్గంలో లేదా ఆ సమీపంలో ఉండే తక్కువ శారీరక ఎత్తు ఉన్నవారిపై ఎక్కువ ప్రభావం ఉంటుందని స్పష్టం చేశారు.
వ్యక్తి దగ్గినప్పుడు వచ్చే లాలాజల తుంపరులు గాలిలో కొంతదూరం ప్రయాణిస్తాయి. అయితే దీనిపై అక్కడి గాలి వేగం, వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రత, గాలిలో తేమ వంటి అంశాలు ప్రభావితం చేస్తాయనే విషయం తెలిసిందే. ఈ సమయంలో వైరస్ కణాల వ్యాప్తి దూరాన్ని తెలుసుకునేందుకు దగ్గతున్న వ్యక్తి సమీపంలో కంప్యూటర్ తరహా పరికరాన్ని అమర్చి పరిశోధన చేశారు. ఆ సమయంలో వ్యక్తి దగ్గడం వల్ల వచ్చే లాలాజలం కణాలపై తేమ ప్రభావం, అవి ప్రయాణించే మార్గంలో అవి ఆవిరయ్యే తీరు, అవి ప్రయాణించే దూరం వంటి అంశాల సమాచారాన్ని సేకరించారు. ఇలా సేకరించిన 1008 అనుకరణలను విశ్లేషించి నివేదిక రూపొందించామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
అయితే గాలిలో నోటి తుంపరుల ప్రయాణంపై ఉపరితల ఉష్ణోగ్రత ప్రభావం ఎంతమేరకు ఉంటుందనే దానిపై మరింత పరిశోధన అవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా ఏసీ గదుల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. వ్యక్తిగత దూరంపై ప్రస్తుతమున్న మార్గదర్శకాల నేపథ్యంలో ఇలాంటి ప్రయోగాలు ఎంతో ముఖ్యమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా గాలి ద్వారా సోకే వ్యాధుల గురించి మరింత అవగాహన కోసం ఇవి ఎంతో ఉపయోగపడుతాయని అంటున్నారు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ పోలింగ్ ‘బ్యూటీ’ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?
Isha Arora: యూపీలో విధులు నిర్వహించిన పోలింగ్ ఏజెంట్ ఈశా అరోడా ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్గా మరారు. ఇంతకీ ఎవరామె..? -
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్
Doordarshan: ‘డీడీ న్యూస్’ లోగోను కాషాయ రంగులోకి మార్చడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది ‘ప్రసార భారతి’ కాదని ‘ప్రచార భారతి’గా మారిందని పలువురు మండిపడుతున్నారు. -
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. -
బాలిక 28 వారాల గర్భం తొలగింపుపై వైద్యుల సలహా కోరిన సుప్రీంకోర్టు
అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సర్వోన్నత న్యాయస్థానం వైద్యుల సలహా కోరింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత విద్యార్థి మృతి.. మరోసారి చర్చలోకి బ్లూవేల్ ఛాలెంజ్..!
-
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్
-
ఈ పోలింగ్ ‘బ్యూటీ’ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?
-
ఆ సినిమా నుంచి గుణపాఠం నేర్చుకున్నా: సోనాలి బింద్రే
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడు కొనసాగేనా?
-
కేంద్ర ఎన్నికల సంఘానికి కనకమేడల మరో లేఖ