ట్రంప్ నిజంగా ఒక ఫూల్: జో బైడెన్
అమెరికా అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై విరుచుకుపడ్డారు. కొవిడ్ మహమ్మారి విలయతాండవం చేస్తున్న సమయంలోనూ మాస్కు ధరించకపోవడంతో ట్రంప్ను ఒక ఫూల్గా అభివర్ణించారు.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్ డొనాల్డ్ ట్రంప్పై విరుచుకుపడ్డారు. కొవిడ్ మహమ్మారి విలయతాండవం చేస్తున్న సమయంలోనూ మాస్కు ధరించకపోవడంతో ట్రంప్ను నిజమైన ఫూల్గా అభివర్ణించారు. అంతేకాకుండా ట్రంప్ నాయకత్వలోపమే అమెరికాలో లక్షకుపైగా ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమని విమర్శించారు. ‘బహిరంగా ప్రదేశాల్లో, సమూహాల్లో ఉన్నప్పుడు తప్పకుండా మాస్కు ధరించాలని ప్రపంచవ్యాప్తంగా వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ట్రంప్ అలా మాట్లాడటం నిజంగా అతని మూర్ఖత్వానికి నిదర్శనం’ అని ఓ వార్తా ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జో బైడెన్ ట్రంప్పై విమర్శలు గుప్పించారు. ఆయన అహంకారపూరిత ప్రవర్తన, తప్పుడు చర్యల ఫలితమే దేశంలో భారీ స్థాయిలో మరణాలకు కారణమని జో బైడెన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో మాస్క్ ధరించడం అక్కడ రాజకీయ అంశంగా మారింది. దీనిలో భాగంగా డెమోక్రటిక్, రిపబ్లికన్ అభ్యర్థులు భిన్న మార్గాలను ఎంచుకున్నారు. కరోనా వైరస్ విజృంభణ కారణంగా గత కొంతకాలంగా ఇంటికే పరిమితమైన జో బైడెన్ తాజాగా అమెరికా మెమోరియల్ రోజున అక్కడి కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ సమయంలో బైడెన్ మాస్కుతో ఉన్న ఫోటోను కొందరు షేర్ చేస్తూ.. బహిరంగ ప్రదేశాల్లో డొనాల్డ్ ట్రంప్ ఎందుకు మాస్కు ధరించరో ఇది చూస్తే తెలుస్తుందని ట్విటర్లో పేర్కొన్నారు. దీనిపై అమెరికాలో ఇరు పార్టీ అభ్యర్థులు, విశ్లేషకుల మధ్య బహిరంగ చర్చకు దారితీసింది.
ఇదిలా ఉంటే, ట్రంప్ మాత్రం బహిరంగ కార్యక్రమాల్లో కూడా మాస్కు ధరించనని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. మిచిగాన్లోని ఫోర్డ్ కార్ల ప్లాంటును సందర్శించే సమయంలో మాత్రమే స్వల్ప సమయం మాస్కు ధరించినప్పటికీ.. మీడియా నన్ను ఇలా చూసే అవకాశం కల్పించనని పేర్కొనడం గమనార్హం. మెమోరియల్ రోజు కూడా మాస్కు లేకుండానే అక్కడి అధికారిక కార్యక్రమంలో ట్రంప్ పాల్గొన్నారు. ఈ సమయంలో భౌతిక దూరం సాధ్యంకాని ప్రాంతాల్లో, బహిరంగ సమూహాల్లో ముఖానికి తప్పకుండా మాస్కు ధరించాలని అమెరికా వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం(సీడీసీపీ) సిఫార్సు చేయడం గమనార్హం. కేవలం ఇంట్లో ఉన్న సమయంలోనే మాస్కు ధరించనవసరం లేదని సీడీసీపీ స్పష్టం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
5 శతాబ్దాల నిరీక్షణ భాగ్యం.. దేశ ప్రజలకు ప్రధాని శ్రీరామనవమి శుభాకాంక్షలు
Shri Ram Navami: శ్రీరామ నవమి సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ తర్వాత జరుగుతున్న తొలి ఉత్సవమని గుర్తుచేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. -
అయోధ్య రాముడికి నేడు సూర్యతిలకం
శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా బుధవారం అయోధ్య రాముడి నుదుటన సూర్య కిరణాలు ప్రసరించనున్నాయి. ఆలయ మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోకి అద్దాలు, కటకాలతో కూడిన సాంకేతిక యంత్రాంగం సాయంతో ఈ ‘సూర్య’తిలకం ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. -
70 ఏళ్లలో తొలిసారి.. తుంగభద్ర క్రస్ట్ గేట్ల పటిష్ఠత పనులు
తుంగభద్ర జలాశయం క్రస్ట్ గేట్లను మరింత దృఢంగా మార్చే పనులు చురుగ్గా సాగుతున్నాయి. -
ధూమపానంతో లోపాల పిల్లలు!
అనారోగ్యకర జీవనశైలితోపాటు ధూమపానం, మద్యపానం, ప్రాసెస్డ్ ఆహార వినియోగం, సెల్ఫోన్ విపరీతంగా వాడటం వంటి అలవాట్లతో శుక్రకణాల (స్పెర్మ్) డీఎన్ఏ దెబ్బతినే ప్రమాదం ఉందని దిల్లీలోని ఎయిమ్స్ వైద్య నిపుణులు పేర్కొన్నారు. -
మన ఓటింగ్ వ్యవస్థను తక్కువ చేయొద్దు
జనాభా తక్కువగా ఉన్న దేశాలతో మన ఎన్నికల ప్రక్రియను పోల్చడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. బ్యాలెట్ ఓటింగ్ పద్ధతి వల్ల ఎదురయ్యే సమస్యలను ప్రస్తావిస్తూ గతంలో రిగ్గింగ్ వంటి అక్రమాలు జరిగిన విషయం తెలుసునని పేర్కొంది. -
భారత ఎన్నికలను ఆసక్తిగా గమనిస్తున్నాం: జర్మనీ
భారత సార్వత్రిక ఎన్నికలను తాము ఆసక్తిగా గమనిస్తున్నట్లు జర్మనీ తెలిపింది. ప్రపంచంలోని ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య పండగ ప్రక్రియను గౌరవిస్తున్నట్లు పేర్కొంది. -
నేను అరవింద్ కేజ్రీవాల్ను.. ఉగ్రవాదిని కాదు
తిహాడ్ జైలులో అధికారులు, భాజపా తనతో ప్రవర్తిస్తున్న తీరును నిరసిస్తూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దేశ ప్రజలను ఉద్దేశించి మంగళవారం ఓ సందేశాన్ని పంపారు. -
మంచుగడ్డలపై యోగా
చైనాలో భారతీయుడి యోగాసనాలు విస్తృత ప్రాచుర్యం పొందుతున్నాయి. ఐక్యరాజ్య సమితి చైనా విభాగానికి నేతృత్వం వహిస్తున్న సిద్దార్థ ఛటర్జీ.. సున్నా డిగ్రీల ఉష్ణోగ్రతలో దట్టమైన మంచులో వేస్తున్న కఠినమైన యోగాసనాలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. -
పారిశ్రామిక మద్యంపై నియంత్రణ కేంద్రానిదే
పారిశ్రామిక మద్యంపై నియంత్రణాధికారం కేంద్ర ప్రభుత్వానిదేనని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మంగళవారం స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాల రీత్యా సంపూర్ణ అధికారం అంశాన్ని పారిశ్రామిక (అభివృద్ధి, నియంత్రణ) చట్టం-1951 ద్వారా పొందుపరిచారని వివరించారు. -
సల్మాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటనలో ఇద్దరు నిందితుల అరెస్ట్
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వద్ద కాల్పుల ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం రాత్రి వారిని గుజరాత్లోని కుచ్ జిల్లా మాతా నో మద్ గ్రామంలో అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. -
కోర్టు వెలుపలి నేర అంగీకారాలు బలహీన సాక్ష్యాధారాలే
న్యాయస్థానం వెలుపల నిందితులు చేసే నేర అంగీకారాలు స్వభావ రీత్యా బలహీనమైన సాక్ష్యాలే అవుతాయని సుప్రీంకోర్టు తెలిపింది. బలమైన సాక్ష్యాలను సమర్థించేవిగా మాత్రమే అవి ఉంటాయని పేర్కొంది. -
12వ తరగతి తర్వాత మూడేళ్ల ఎల్ఎల్బీ కోర్సుకు అనుమతివ్వాలి
ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి తర్వాత నేరుగా మూడేళ్ల లా కోర్సు (ఎల్ఎల్బీ) చదివేందుకు అవకాశం ఉండాలని అభ్యర్థిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రస్తుతం... డిగ్రీ పూర్తి చేసిన వారు మూడేళ్ల లా కోర్సులో, ఇంటర్ లేదా 12వ తరగతి ఉత్తీర్ణులైన వారు అయిదేళ్ల లా కోర్సులో చేరడానికి అర్హులు. -
సంక్షిప్త వార్తలు(6)
అరేబియా సముద్రం పశ్చిమ ప్రాంతంలో 940 కిలోల నిషేధిత మాదకద్రవ్యాలను భారత నౌకాదళం స్వాధీనం చేసుకుంది. భారత నౌకాదళంలో మెరికల్లాంటి మార్కో కమాండోలు ‘క్రిమ్సన్ బరాకుడా’ ఆపరేషన్లో భాగంగా ఓ పడవ నుంచి గత శనివారం మాదకద్రవ్యాలను పట్టుకున్నారని నౌకాదళ ప్రతినిధి ఒకరు వివరించారు. -
నేను ఏ పార్టీకీ ప్రచారం చేయలేదు.. అది నకిలీ వీడియో: ఆమిర్ ఖాన్
ఓ రాజకీయ పార్టీ తరఫున తాను ఎన్నికల ప్రచారం చేసినట్లు నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో నకిలీదని బాలీవుడు నటుడు ఆమిర్ ఖాన్ తెలిపారు. -
బస్తర్కు హెలికాప్టర్లలో పోలింగ్ సిబ్బంది
లోక్సభ ఎన్నికల్లో ఈ నెల 19న తొలివిడత పోలింగు జరగనున్న రాష్ట్రాల్లో నక్సలైట్ల ప్రభావం ఎక్కువగా ప్రాంతాలకు కట్టుదిట్టమైన భద్రత నడుమ పోలింగ్ సిబ్బందిని హెలికాప్టర్లలో తరలించే ప్రక్రియ మంగళవారం మొదలైంది. -
అల్లోపతి వైద్యాన్ని కించపరిచారో జాగ్రత్త
ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనల కేసులో యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఆయుర్వేద సంస్థ ఎండీ బాలకృష్ణపై మరోసారి సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘కోర్టు ఉత్తర్వులను గతంలో మీరెలా అవహేళన చేశారో మాకు తెలుసు. -
న్యాయప్రక్రియకు ఆటంకం కలిగించే చర్యలు తీసుకోలేం
న్యాయ ప్రక్రియలో, న్యాయస్థానాలకు సంబంధించిన అంశాల్లో జోక్యం చేసుకొనే చర్యలను తాము తీసుకోలేమని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. -
మావోయిస్టుల సమాచారం ఇస్తే రూ.5 లక్షల బహుమతి
ఛత్తీస్గఢ్లోని కబీర్ధామ్ జిల్లాలో మావోయిస్టులకు సంబంధించిన సమాచారం ఇస్తే.. రూ.5 లక్షల నగదుతో పాటు, ఉద్యోగం కల్పిస్తామని అక్కడి పోలీసులు మంగళవారం ప్రకటించారు. -
హేమామాలినిపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. సుర్జేవాలాపై ఈసీ చర్యలు
హేమామాలినిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత రణ్దీప్ సింగ్ సుర్జేవాలాపై 48 గంటలపాటు ప్రచారంలో పాల్గొనకుండా ఎన్నికల సంఘం (Election Commission) నిషేధం విధించింది. -
ఇంటర్వ్యూ వేళ తల్లి మృతి.. బాధను దిగమింగి.. ‘సివిల్స్’లో రెండో ర్యాంకు
ఇంటర్వ్యూ సమయంలో తల్లిని కోల్పోయిన బాధను దిగమింగి.. సివిల్స్లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచాడు. అదీ తొలి ప్రయత్నంలోనే. అతడే ఒడిశాకు చెందిన అనిమేశ్ ప్రధాన్ (24).
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో రామరాజ్యం లాంటి పాలన రావాలి: చంద్రబాబు
-
ఆ విషయంలో.. ధోనీ, కోహ్లీని అనుసరించా: జోస్ బట్లర్
-
ఉగ్రవాదుల్ని వెంటాడి మట్టుబెడతామంటూ మోదీ హెచ్చరిక..అమెరికా ఏమందంటే..?
-
శంకర్ కుమార్తె వివాహ విందు.. డ్యాన్స్తో అలరించిన రణ్వీర్ సింగ్
-
ఏడాదిన్నర వాన గంటల్లోనే.. ఎడారి దేశాన్ని వణికించిన మెరుపు వరద
-
జగన్ సభలో జనాలేరి?.. తంటాలు పడి తరలించినా వెళ్లిపోయారు