రెండు వారాల్లో 65లక్షల టెస్టులు..ఫలితమెంత?
కరోనా వైరస్కు పుట్టినిళ్లైన వుహాన్లో ఈ వైరస్ రెండోదఫా విజృంభిస్తుందనే ఆందోళన నెలకొంది. లక్షణాలు కనిపించకుండానే పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు బయటపడుతుండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో దాదాపు కోటి మంది జనాభా కలిగిన వుహాన్ నగరంలో ప్రతి వ్యక్తికి కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు చేయాలని ఈ నెల 14న నిర్ణయించింది.
ఇంటర్నెట్ డెస్క్: కరోనా వైరస్కు పుట్టినిల్లు వుహాన్లో ఈ వైరస్ రెండోదఫా విజృంభిస్తుందనే ఆందోళన నెలకొంది. లక్షణాలు కనిపించకుండానే పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు బయటపడుతుండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో దాదాపు కోటి మంది జనాభా కలిగిన వుహాన్ నగరంలో ప్రతి వ్యక్తికి కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు చేయాలని ఈ నెల 14న నిర్ణయించింది. దీనికోసం రెండు వారాల టార్గెట్ విధించుకొని ఈనెల 15న ప్రారంభించగా.. ప్రస్తుతం అది 90శాతం పూర్తయ్యింది. అయితే, వైరస్ తీవ్రత స్వల్పంగానే ఉన్న సమయంలో భారీ స్థాయిలో చేపట్టిన ఈ కార్యక్రమం వల్ల ఫలితమేంటనే చర్చ కూడా నడుస్తోంది.
కోటి మందికి కొవిడ్ పరీక్షలు..
ప్రభుత్వ నిర్ణయంతో రంగంలోకి దిగిన వుహాన్ అధికారులు నగరంలోని ప్రతి వ్యక్తి కొవిడ్ నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని ఆదేశించారు. దీనిలో భాగంగా వ్యక్తుల నుంచి స్వాబ్ శాంపిళ్లను సేకరించారు. ఈ ఆదివారం నాటికి నగరంలోని దాదాపు 90లక్షల మంది శాంపిళ్లను తీసుకున్నారు. వీరిలో ఇప్పటివరకు 65లక్షల కొవిడ్ నిర్ధారణ పరీక్షలు పూర్తి చేశారు. మరో రెండు మూడు రోజుల్లోనే దాదాపు ఈ ప్రక్రియ మొత్తం పూర్తికానుందని అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే ఈ భారీ ప్రక్రియను చేపట్టడానికి వుహాన్ అధికారులు చాలా కృషి చేశారు. చాలా చోట్ల వీధుల్లోనే బహిరంగ ప్రదేశాల్లో వీటిని చేపట్టారు. స్వాబ్ టెస్టు కిట్లను వెంటబెట్టుకుని భవన నిర్మాణ ప్రాంతాలకు, మార్కెట్లకు వెళ్లి పరీక్షించారు. అంతేకాకుండా అంగవైకల్యంతో ఉన్నవారిని గుర్తించి వారి ఇంటికే వెళ్లి పరీక్షలు నిర్వహించారు. ప్రజల సంక్షేమం కోసమే వుహాన్ వాసులు ఈ పరీక్షలకు ముందుకు రావాలని మైకుల ద్వారా వీధుల్లో, నివాస ప్రాంతాల్లో ప్రచారం చేశారు. దీనికోసం విస్తృతంగా వైద్య, ఇతర సిబ్బందిని వినియోగించి భారీ ఖర్చుతో చేపట్టిన ఈ కార్యక్రమం దాదాపు విజయవంతమైనట్లు అక్కడి అధికారులు పేర్కొంటున్నారు. వీటి ఫలితాలను కూడా రెండు నుంచి నాలుగు రోజుల్లోనే తెలుపుతున్నట్లు వెల్లడించారు.
భారీగా పరీక్షా కిట్ల వినియోగం..
దాదాపు కోటి మందిని పరీక్షించాలని చేపట్టిన ఈ కార్యక్రమానికి భారీగా టెస్టింగ్ కిట్లను వినియోగించింది అక్కడి ప్రభుత్వం. వైరస్ బయటపడ్డ తొలినాళ్లతో పోలిస్తే అత్యధిక కిట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాకుండా కేవలం ప్రతిరోజు 46వేల పరీక్షలు చేసే సామర్థ్యం ఉండగా..ప్రస్తుతం అది ప్రతిరోజు దాదాపు 10లక్షల టెస్టులు చేసే స్థాయికి వెళ్లిపోయింది.
పరీక్షలకు నిరాకరిస్తే చర్యలు..
ఇంత భారీ స్థాయిలో చేపట్టిన కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు ప్రతిఇంటికి వెళ్లి ప్రజలను వైద్యపరీక్ష కేంద్రాలకు తరలిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా కొవిడ్ పరీక్షకు నిరాకరిస్తే వారిపై చర్యలకు కూడా పూనుకున్నారు. వారికి ప్రభుత్వం ఇచ్చే ఆరోగ్య కోడ్ను తగ్గించడంతోపాటు, వారి ఉద్యోగం, ప్రయాణ పరిమితులపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సూపర్ మార్కెట్లు, బ్యాంకుల్లోకి కూడా అనుమతించమని పేర్కొన్నారు. అంతేకాకుండా వారికి ఉండే గ్రీన్ కోడ్, యెల్లో కోడ్గా మారుతుందని హెచ్చరించారు.
నిపుణుల నుంచి వ్యతిరేకత..
వైరస్ ధాటికి అతలాకుతలమైన వుహాన్లో సాధారణ పరిస్థితులు ఏర్పడి ప్రజలు స్వేచ్ఛగా వారి పనులు చేసుకునేలా వారిలో విశ్వాసం కలిగించేందుకే ఈ భారీ కార్యక్రమాన్ని చేపట్టిన్నట్లు అక్కడి ప్రభుత్వం పేర్కొంది. అందుకే ఈ కొవిడ్ పరీక్షలను కూడా ఉచితంగానే చేస్తున్నట్లు తెలిపింది. అయితే ప్రభుత్వ చర్యను మాత్రం కొందరు నిపుణులు వ్యతిరేకిస్తున్నారు. భారీ శ్రమ, ఖర్చుతో కూడుకున్న ఈ పనిని వైరస్ తీవ్రత తక్కువగా ఉన్న సమయంలో చేయడం అనవసరమని అంటున్నారు. ప్రస్తుతం కేవలం 200వరకు మాత్రమే పాజిటివ్ కేసులు బయటపడ్డట్లు వెల్లడించారు. ఇంత తక్కువ సమయంలో లక్షల సంఖ్యలో చేసే పరీక్షలతో కచ్చితమైన ఫలితాలు రాబట్టడం చాలా కష్టమని హాంగ్కాంగ్ యూనివర్సిటీకి చెందిన వైరాలజిస్ట్ జిన్ డోంగ్యాన్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి సమయంలో చాలా ఫలితాలు తప్పుగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండాయని జిన్ వెల్లడించారు. దాదాపు కోటి జనాభా ఉన్న వుహాన్ ప్రస్తుతం వైరస్ తీవ్రత తక్కువగానే ఉన్నందున లక్ష శాంపిల్స్ సేకరిస్తే సరిపోయేదని అన్నారు. చైనా సీడీసీ కి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త డా.వూ జున్యూ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. నగరంలోని ప్రతిఒక్కరికి కొవిడ్ పరీక్షలు చేయాల్సిన అవసరం లేదన్నారు. తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తొలుత పరీక్ష చేయించుకున్న వ్యక్తికి తరువాతైనా వైరస్ సోకే అవకాశం ఉంటుందని తేల్చిచెప్పారు.
ఇలా భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్న తరుణంలో.. దీనివల్ల వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు నగరంలో వైరస్ తీవ్రతపై ఓ స్పష్టమైన అవగాహన వస్తుందని అక్కడి ప్రభుత్వం సమర్ధించుకుంటోంది.
ఇవీ చదవండి..
పుట్టి ముంచిన వుహాన్ విందు..!
వైరస్ వుహాన్ ల్యాబ్ నుంచే వచ్చింది: ట్రంప్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
First phase of LS polls: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. -
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
PM Modi: ప్రచార సభలో తన తల్లి ఫొటోను చూసి ప్రధాని మోదీ ఉద్వేగానికి లోనయ్యారు. ఆ చిత్రాన్ని గీసిన యువకుడిని అభినందించారు. -
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే బలమైన, స్థిర ప్రభుత్వం అవసరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
తనకు జైల్లో ఇన్సులిన్ అందించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) దిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. -
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
ఉత్తరప్రదేశ్లోని ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు ఫేషియల్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే.. -
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
UPSC: ఏళ్లపాటు కష్టపడి తృటిలో అవకాశం కోల్పోయిన యూపీఎస్సీ అభ్యర్థుల కోసం డిట్టో ఇన్సూరెన్స్ ఉద్యోగ అవకాశం ఇచ్చేందుకు ముందుకువచ్చింది. -
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు.
తాజా వార్తలు (Latest News)
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె