అమెరికా.. నిరసనలతో మరింత ముప్పు!
అమెరికా పోలీసుల కస్టడీలో ఆఫ్రో-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మృతి అనంతరం వ్యక్తమైన ఆందోళనలు, నిరసనలు ఇప్పటికీ హోరెత్తుతూనే ఉన్నాయి. ..
వైరస్ వ్యాప్తి పెరుగుతుందని నిపుణుల హెచ్చరిక
కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని నిరసనకారులకు సూచన
న్యూయార్క్: అమెరికా పోలీసుల కస్టడీలో ఆఫ్రో-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మృతి అనంతరం వ్యక్తమైన ఆందోళనలు, నిరసనలు హోరెత్తుతూనే ఉన్నాయి. ఇప్పటికే కరోనా మహమ్మారి విజృంభణతో అతలాకుతలమౌతున్న అమెరికాకు ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలు మరింత ముప్పు కలిగించే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా మహమ్మారిని కట్టడిచేయడంలో తంటాలు పడుతున్న నగరాల్లో నిరసనల వల్ల వైరస్ వ్యాప్తి మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం(సీడీసీ) హెచ్చరించింది.
ముఖ్యంగా వాషింగ్టన్ డీసీ, మినియాపొలిస్, న్యూయార్క్తోపాటు నిరసనలు ఎక్కువగా జరుగుతున్న నగరాల్లో వైరస్ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సీడీసీ డైరెక్టర్ రాబర్ట్ రెడ్ఫీల్డ్ ప్రకటించారు. ఈ సమయంలో నిరసనకారులు కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అంతేకాకుండా ఇలాంటి నిరనసన ప్రదర్శనల్లో పాల్గొంటున్న వారు కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకునేలా తగు చర్యలు చేపట్టాలని అమెరికా ప్రభుత్వ నేతృత్వంలోని ఓ సబ్కమిటీకి సీడీసీ డైరెక్టర్ నివేదించారు.
‘ఫ్లాయిడ్కు మద్దతుగా జరుగుతున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా కేవలం న్యూయార్క్ రాష్ట్రంలోనే దాదాపు 30వేల మంది నిరసనకారులు పాల్గొన్నారు. వీరిలో ఎక్కువ మంది మాస్కులు ధరించినప్పటికీ, భౌతిక దూరాన్ని మాత్రం పాటించలేదు. దీంతో వైరస్ వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉంది. అందుచేత నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నవారు దయచేసి వైద్య పరీక్షలు చేయించుకోండి’ అని న్యూయార్క్ గవర్నర్ ఆండ్ర్యూ క్యూమో ప్రజలకు సూచించారు. రాష్ట్రంలోని బఫలో, అల్బనీ, రోచెస్టర్, సైరాక్యూజ్ పట్టణాల్లో నిరసనలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆండ్ర్యూ క్యూమో వెల్లడించారు. కరోనా వైరస్తో కుదేలైన న్యూయార్క్ నగరం సోమవారం నుంచి తిరిగి తెరుచుకునేందుకు సిద్ధమైంది. ఈ సమయంలో తాజాగా నెలకొంటున్న పరిస్థితులు మరింత ఆందోళనకు గురిచేస్తున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.
తాజాగా షికాగో అధికారులు కూడా వైరస్ వ్యాప్తిపై ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు. నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటున్నవారు 14రోజులు స్వతహాగా క్వారంటైన్లో ఉండాలని సూచించారు. ఇలా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వీధుల్లో నిరసనలు జరుగుతున్న సమయంలో వైరస్ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అమెరికా ప్రభుత్వంతోపాటు అక్కడి వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిరసన ప్రదర్శనలు అదుపులోకి రాకుంటే సైన్యాన్ని రంగంలోకి దింపుతామని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, అమెరికాలో ఇప్పటివరకు 19లక్షల మంది కరోనా వైరస్ బారినపడగా వీరిలో దాదాపు లక్షా 10వేల మంది మృత్యువాతపడ్డారు.
ఇవీ చదవండి..
అమెరికాలో.. గాంధీ విగ్రహం అపవిత్రం
భారత్లో.. ఒకేరోజు 9851కేసులు, 273మరణాలు!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
పశ్చిమ్ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి ఆరోపణలు గుప్పించారు. -
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ (Modi) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. వాటిపై అందిన ఫిర్యాదు ఈసీ పరిశీలనలో ఉందని సమాచారం. -
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. -
నూడుల్స్లో రూ.6 కోట్ల బంగారం, వజ్రాలు!
నూడుల్స్లో వజ్రాలు, బంగారం దాచి అక్రమ రవాణాకు పాల్పడిన నలుగురు ప్రయాణికులను ముంబయి కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. -
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సోమవారం రాత్రి జైల్లో ఇన్సులిన్ అందజేసినట్లు ఆప్ ప్రకటించింది. -
అంకుల్.. మా బడిని ఇలా చేశారేంటి?
పోలింగ్ విధులకు వచ్చి.. పాఠశాలను అపరిశుభ్రం చేసిన అధికారులను ఉద్దేశించి ప్రశ్నలు సంధించిన ఓ చిన్నారి వీడియో తమిళనాట వైరల్ అవుతోంది. -
మరో ఐదురోజులు భగభగలు.. ఐఎండీ వెల్లడి
దేశంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది. -
30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి
అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. బాలిక సంక్షేమం, భవిష్యత్తుకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని తొలగించేందుకు అనుమతించింది. -
సీయూఈటీ-యూజీ, నెట్ స్కోర్ల నార్మలైజేషన్ ఎత్తివేత : యూజీసీ
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ -యూజీ, నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్) స్కోర్ల నార్మలైజేషన్ (సాధారణీకరణ)ను ఈ ఏడాది నుంచి ఎత్తివేస్తున్నట్లు యూజీసీ చీఫ్ జగదీప్ కుమార్ తెలిపారు. -
అభిషేక్ బెనర్జీ ఇంటి ముందు రెక్కీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇంటిముందు రెక్కీ నిర్వహించాడన్న కారణంతో ఓ నిందితుడిని కోల్కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బెంగాల్ పాఠశాలల్లో 25 వేల నియామకాలు రద్దు
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్ఎల్ఎస్టీ)పై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. -
కేజ్రీవాల్కు ఇన్సులిన్పై మెడికల్ బోర్డు ఏర్పాటు చేయండి
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గల మధుమేహ వ్యాధికి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరముందా? లేదా? అని తేల్చేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఎయిమ్స్ డైరెక్టర్ను దిల్లీ కోర్టు సోమవారం ఆదేశించింది. -
2జీ స్పెక్ట్రమ్పై 2012 తీర్పును సవరించండి
వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బదిలీలు జరగాలంటూ 2012లో వెలువరించిన తీర్పును సవరించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. -
ఎన్నికలకు ఎండల దెబ్బపై ఆందోళన వద్దు
లోక్సభ రెండోదశ ఎన్నికలకు ఎండల దెబ్బపై పెద్దగా కలవరపడాల్సిందేమీ లేదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. -
‘దివ్యాంగుల హక్కుల చట్టం అమలు అత్యంత దారుణం’
దివ్యాంగుల హక్కుల చట్టం-2016ను అమలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. -
‘హైస్కూల్ తర్వాతే లా ప్రాక్టీస్ చేస్తే పోలే’
12వ తరగతి తర్వాత అయిదేళ్లు చదవాల్సిన ఎల్ఎల్బీ కోర్సును మూడేళ్లకు తగ్గించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఎన్కౌంటర్ మృతులపై రివార్డు రూ.1.85 కోట్లు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో సుమారు 29 మంది వివిధ క్యాడర్లకు చెందిన మావోయిస్టు నేతలు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అది బెయిల్ షరతుల ఉల్లంఘనే
లఖింపుర్ ఖేరి హింస ఘటనలో నిందితుడైన ఆశిష్ మిశ్ర రాజకీయ కార్యక్రమాలకు స్వయంగా హాజరైతే అది బెయిల్ నిబంధనల ఉల్లంఘనేనని సుప్రీం కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. -
మీది ఉక్కు సంకల్పం
భారత్కు సంబంధించి ధైర్యం, పట్టుదల, సంకల్పానికి సియాచిన్ రాజధానిగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. -
దిల్లీ డంపింగ్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం
దేశ రాజధాని దిల్లీలోని గాజీపుర్ డంపింగ్ యార్డులో భారీ మంటలు చెలరేగి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. -
అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీ
వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ప్రఖ్యాత అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) ఉప కులపతి (వీసీ)గా నయీమా ఖాతూన్ నియమితులయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు