కిమ్కు కోపం తెప్పించిన గాలిబుడగలు..
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇకపై దక్షిణ కొరియాతో ఎలాంటి సమాచార మార్పిడి ఉండబోదని ప్రకటించారు. ఇరు దేశాల మధ్య భవిష్యత్తులో......
సియోల్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇకపై దక్షిణ కొరియాతో ఎలాంటి సమాచార మార్పిడి ఉండబోదని ప్రకటించారు. ఇరు దేశాల మధ్య భవిష్యత్తులో ఎలాంటి సీమాంతర సంబంధాలు ఉండబోవని చెప్పే దిశగా ఇది తొలి అడుగు అని ఉత్తర కొరియా అధికారిక ఛానల్ కేసీఎన్ఏ వెల్లడించింది.
అమెరికా, ఉత్తర కొరియా మధ్య జరుగుతున్న అణు సంబంధిత చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్న తరుణంలో ఈ నిర్ణయం వెలువడడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉత్తర కొరియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సరిహద్దు మీదుగా వస్తున్న గాలిబుడగల కరపత్రాలను నిలువరించడంలో దక్షిణ కొరియా ప్రభుత్వం విఫలమైనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్యాంగ్యాంగ్లోని అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం వెలువడడం వెనుక కిమ్ సోదరి కిమ్ యో జోంగ్దే ప్రధాన పాత్ర అని కేసీఎన్ఏ తెలిపింది.
ఏంటీ గాలిబుడగల కథ..?
సరిహద్దు మీదుగా దక్షిణ కొరియా నుంచి ఉత్తర కొరియాలోకి కొంతమంది గత కొన్నేళ్లుగా భారీ స్థాయిలో గాలిబుడగలు వదులుతున్నారు. కిమ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న కరపత్రాలను వీటికి జతచేస్తుంటారు. ఉత్తర కొరియాలోని కన్జర్వేటివ్ కార్యకర్తలు, ఉత్తరం నుంచి దక్షిణంలోకి ప్రవేశించి ఆశ్రయం పొందుతున్న వారు వీటిని పంపుతుంటారని సమాచారం. ఈ అంశంపై ఇరు దేశాల మధ్య గత కొన్నిరోజులుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ గాలిబుడగల రాక ఎక్కువైనట్లు ఉత్తర కొరియా ప్రభుత్వం తెలిపింది. దీనిపై కిమ్ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిలువరించకపోతే.. సరిహద్దులో ఇరు దేశాలకు చెందిన కార్యాలయాలను పూర్తిగా మూసివేస్తామని హెచ్చరించారు. 2018 నాటి ‘ఇంటర్-కొరియన్’ సైనిక ఒప్పందాన్ని రద్దు చేస్తామని తేల్చి చెప్పారు. దీనిపై స్పందించిన దక్షిణ కొరియా ఈ బుడగలపై నిషేధం విధిస్తామని ప్రకటించింది. అయినా, ఎలాంటి మార్పు లేకపోవడంతో కిమ్ తాజా నిర్ణయం తీసుకున్నారు. 2014లో తమ దేశంవైపు వస్తున్న ఈ గాలిబుడగలపై ఉత్తర కొరియా కాల్పులు జరిపింది. దీంతో ఇరు దేశాల మధ్య అప్పట్లో పరస్పరం కాల్పులు చోటుచేసుకున్నాయి.
2019లో అమెరికా, ఉత్తరకొరియా మధ్య జరిగిన అణు సంబంధిత చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. నాటి నుంచి ఉత్తరకొరియాకు దక్షిణ కొరియా ఎలాంటి సహాయ సహకారాలు అందించడం లేదు. మరోవైపు అమెరికాతో సంబంధాల్ని తెగతెంపులు చేసుకొనేందుకు దక్షిణ కొరియా నిరాకరించడంపై ఉత్తరకొరియా అనేక విమర్శలు చేసింది. అలాగే, ఇరు దేశాల మధ్య కుదిరిన ఉమ్మడి ప్రాజెక్టుల కొనసాగింపునకు ముందుకు రాకపోవడంపైనా అసంతృప్తి వ్యక్తం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం