బీజింగ్లో పరిస్థితి తీవ్రరూపం!
కరోనా వైరస్ మహమ్మారి పుట్టిన చైనాలో తాజాగా మరోసారి వైరస్ విజృంభణ కొనసాగుతోంది. తొలుత వుహాన్ను వణికించిన ఈ మహమ్మారి...
కరోనా తీవ్రరూపం దాల్చిందని అధికారుల హెచ్చరిక
నగరం నుంచి బయటకు వెళ్లడంపై నిషేధం
బీజింగ్: కరోనా మహమ్మారి పుట్టిన చైనాలో తాజాగా మరోసారి వైరస్ విజృంభణ కొనసాగుతోంది. తొలుత వుహాన్ను వణికించిన ఈ మహమ్మారి తాజాగా దేశ రాజధాని బీజింగ్పై పడగవిప్పింది. నగరంలో ఉన్న అతిపెద్ద హోల్సేల్ మార్కెట్ షిన్ఫడి తాజాగా వైరస్కు కేంద్ర బిందువైంది. నిత్యం పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు బయటపడుతుండటంతో బీజింగ్లో పరిస్థితులు తీవ్రరూపం దాల్చినట్లు నగర అధికారులు హెచ్చరిస్తున్నారు.
రాజధాని నగరంలో కేవలం మంగళవారం ఉదయమే కొత్తగా 27కేసులు బయటపడ్డాయి. నగరంలో గడిచిన ఐదు రోజుల్లోనే పాజిటివ్ కేసుల సంఖ్య 106కి చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు నగరంలోని 30ప్రాంతాల్లో ఇప్పటికే లాక్డౌన్ ప్రకటించారు. నిత్యం వేల మంది సందర్శించే ఈ మార్కెట్ తాజాగా వైరస్ వ్యాప్తికి కేంద్రబిందువుగా మారింది. దీంతో లక్షల సంఖ్యలో నిర్ధారణ పరీక్షలు చేయాలని నిర్ణయించిన అధికారులు, ఇప్పటికే పరీక్షలను ముమ్మరం చేశారు. రాజధానిలో పరిస్థితి తీవ్రరూపం దాల్చడంతో అన్ని ఆహార కేంద్రాలు, రెస్టారెంట్లు, ప్రభుత్వ క్యాంటీన్లలో పనిచేసే వారితోపాటు వాటి నిర్వాహకులకు వైద్యపరీక్షలు చేస్తున్నట్లు బీజింగ్ నగర అధికార ప్రతినిధి ఝూ హెజియన్ వెల్లడించారు. రానున్న రోజుల్లో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు పెంచే కొద్దీ పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇతర నగరాలకు రాకపోకలు నిషేధం..
తాజాగా ఈ మహమ్మారి వ్యాప్తికి బీజింగ్ కేంద్రబిందువుగా మారడంతో నగరం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లడంపై నిషేధం విధించారు. వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో భాగంగా టాక్సీలు, ఇతర వాహన సర్వీసులను నగరం బయటకు వెళ్లకుండా నిషేధించినట్లు అక్కడి రవాణాశాఖ అధికారులు పేర్కొన్నారు. అంతేకాకుండా, గత కొన్నిరోజులుగా బీజింగ్ను పర్యటించిన ఇతర నగరవాసులు హోం క్వారంటైన్లోనే ఉండాలని చైనా మొత్తం ప్రకటించారు. వీటికితోడు నగరంలోని క్రీడా మైదానాలు, వినోద ప్రాంతాలు మూసివేయాలని ఆదేశించారు.
మరిన్ని వైరస్ క్లస్టర్ల గుర్తింపు..
బీజింగ్ అతిపెద్ద హోల్సేల్ మార్కెట్కు రోజుకు వేల సంఖ్యలో వివిధ నగరాల నుంచి వస్తుంటారు. గడచిన 15రోజుల్లో దాదాపు 2లక్షల మంది ఈ మార్కెట్ను సందర్శించినట్లు అంచనా వేస్తున్నారు. దీంతో నగరంలోని 11 మార్కెట్లను కూడా ఇప్పటికే మూసివేసిన అధికారులు, దాదాపు 276 వ్యవసాయ మార్కెట్లను శుద్ధిచేసే కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికే ఆయా మార్కెట్లో పనిచేస్తోన్న పదివేల మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు చేపట్టారు. తాజాగా ఈ మార్కెట్కు సంబంధం ఉన్న సమీప ప్రావిన్సుల్లో కూడా వైరస్ వ్యాప్తి మొదలైనట్లు చైనా నేషనల్ హెల్త్ కమిషన్ గుర్తించింది.
రోజుకు 90వేల పరీక్షల సామర్థ్యం..
దేశ రాజధానిలో తాజాగా బయటపడుతున్న కేసులతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే వుహాన్లో దాదాపు కోటి మందికి పరీక్షలు చేపట్టిన అధికారులు, బీజింగ్లో కూడా ఇదే తరహా పరీక్షలు చేపట్టాలని నిర్ణయించారు. దీంతో రోజుకు 90వేల మందిని పరీక్షించే సామర్థ్యంతో సిద్ధంగా ఉన్నట్లు చైనా అధికార వార్తా ఏజెన్సీ వెల్లడించింది.
హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
తాజాగా బీజింగ్ పరిస్థితులు ఆందోళనకరంగా మారడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆవేదన వ్యక్తం చేసింది. అత్యధిక జనాభా, అధిక రాకపోకలు సాగించే నగరంలో తాజాగా క్లస్టర్లు ఏర్పడడంతో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇదిలా ఉంటే, గతరెండు నెలల్లో ఒక్కకేసు కూడా నమోదుకాని నగరంలో ఒక్కసారిగా వైరస్ విజృంభణకు కారణాలను విశ్లేషించే పనిలో చైనా అధికారులు నిమగ్నమ్యయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.