వైరస్‌ విజృంభణ: చైనాలో మళ్లీ లాక్‌డౌన్‌

చైనాలో మరోసారి కరోనా వైరస్‌ విజృంభించింది. రాజధాని బీజింగ్‌ సమీప ప్రాంతాల్లో కొవిడ్‌-19 కేసులు ఒక్కసారిగా పెరగడంతో ఆదివారం లాక్‌డౌన్‌ విధించారు.....

Published : 29 Jun 2020 01:41 IST

ఇంటర్నెట్ ‌డెస్క్‌: చైనాలో మరోసారి కరోనా వైరస్‌ విజృంభించింది. రాజధాని బీజింగ్‌ సమీప ప్రాంతాల్లో కొవిడ్‌-19 కేసులు ఒక్కసారిగా పెరగడంతో ఆదివారం లాక్‌డౌన్‌ విధించారు. దాదాపు ఐదు లక్షల మందిపై తాజా ఆంక్షల ప్రభావం పడింది.

వైరస్‌ను చైనా కట్టడి చేసినప్పటికీ బీజింగ్‌లో వందల కేసులు నమోదవ్వడం గమనార్హం. అంతేకాకుండా పక్కనే ఉండే హెబెయ్‌ ప్రావిన్స్‌లో కేసుల సంఖ్య పెరగడం మొదలైంది. ఈ నేపథ్యంలో ఆన్‌షిన్‌ కౌంటీలో బీజింగ్‌ నుంచి 150 కిలోమీటర్ల వరకు ఉన్న ప్రాంతాలను పూర్తిగా మూసేసి నియంత్రణలోకి తీసుకుంటున్నామని వైద్యాధికారులు ప్రకటించారు. కరోనా ఆవిర్భావ ప్రాంతం వుహాన్‌ మాదిరిగానే ఇక్కడా కఠిన ఆంక్షలు అమలు చేయనున్నామని వెల్లడించారు.

నిత్యావసరాలు, ఆహారం, ఔషధాల కొనుగోలుకు ఒక కుటుంబం నుంచి రోజుకు ఒక్కరికి మాత్రమే అనుమతి ఇస్తున్నామని అధికారులు తెలిపారు. ఇంతకు ముందు ఈ కౌంటీలో రవాణా, ప్రయాణంపై పరిమిత ఆంక్షలే ఉండగా ఇప్పుడు మరింత కఠినతరం చేశారు. వైద్యం చేయించుకొనేందుకు వ్యక్తిగత ప్రయాణాలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. మొదట బీజింగ్‌లోని షిన్‌ఫడి టోకు ధరల ఆహార మార్కెట్లో వైరస్‌ ఔట్‌బ్రేక్‌ అయింది. ఇక్కడికి ఆన్‌షిన్‌ నుంచి మంచినీటి చేపలను సరఫరా చేస్తారు. తొలుత ఇక్కడ వైరస్‌ను కట్టడి చేశామని ప్రకటించడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని