ట్రంప్ పార్టీలో విచిత్రం
ఎవరైనా చట్టసభ అభ్యర్థిగా ఎంపికైతే కుటుంబంతా కలిసి తమ వంతుగా వారిని గెలిపించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తారు. ఒకే కుటుంబంలో వేర్వేరు పార్టీల్లో ఉన్నా.. ఎవరికి వారు ప్రచారం చేసుకుంటారే తప్ప.. ఎదుటివారికి ఓటు వేయకండని చెప్పరు. కానీ అమెరికాలో ఓ కూతురు
ఇంటర్నెట్ డెస్క్: ఎవరైనా చట్టసభ అభ్యర్థిగా ఎంపికైతే కుటుంబ సభ్యులంతా కలిసి వారిని గెలిపించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తారు. ఒకే కుటుంబంలో వేర్వేరు పార్టీల్లో ఉన్నా.. ఎవరికి వారు ప్రచారం చేసుకుంటారే తప్ప.. ఎదుటివారికి ఓటు వేయకండని చెప్పరు. కానీ అమెరికాలో ఓ కూతురు.. చట్టసభ అభ్యర్థిగా ఎంపికైన తన తండ్రికి ఓటు వేయొద్దని ప్రచారం చేస్తోంది. అది కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పార్టీ అయిన రిపబ్లికన్లో ఈ ఘటన చోటు చేసుకోవడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదవీకాలం మరికొన్ని నెలల్లో పూర్తవుతుంది. దీంతో ఎన్నికల నగారా మోగనుంది. అయితే కరోనా నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికలు ఏ విధంగా జరగబోతున్నాయో తెలియదు. కానీ రాష్ట్రాల వారీగా చట్టసభలకు అభ్యర్థుల ఎంపిక.. ప్రచారాలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో మిచిగాన్ చట్టసభకు 73వ డిస్ట్రిక్ట్ నుంచి రిపబ్లికన్ పార్టీ తరఫు అభ్యర్థిగా రాబర్ట్ రెగన్ ఎంపికయ్యారు. దీంతో ఆయన తన ప్రచారం మొదలుపెట్టారు. అయితే తన తండ్రికి ఓటు వేయొద్దంటూ ఆయన కూతురు స్టెఫనీ రెగన్ ట్విటర్ వేదికగా స్థానిక ప్రజలను అభ్యర్థిస్తోంది. ఇటీవల ట్విటర్లో ‘‘మీరు మిచిగాన్లో ఉండి 18 ఏళ్లు నిండిన వారైతే.. దేవుడి ప్రేమను కోరుకుంటే.. మా తండ్రికి ఓటు వేయకండి. ఈ విషయం అందరికి చెప్పండి’’అని ట్వీట్ చేసింది. దీంతో ఆ ట్వీట్ కాస్త వైరల్గా మారింది. లక్షా 90వేల మంది ట్వీట్ను లైక్ చేయగా.. 47వేలకు పైగా నెటిజన్లు రీట్వీట్ చేశారు. అయితే ఎందుకు తండ్రికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని మీడియా ఆమెను వివరణ కోరగా.. ఇంతకు మించి తానేమీ చెప్పలేనని, చెబితే తనకు హానీ జరగొచ్చని తెలిపింది.
స్టెఫనీ రెగన్ ట్వీట్ వైరల్ కావడంతో ఆమె తండ్రి రాబర్ట్ రెగన్ ఫేస్బుక్ వేదికగా స్పందించాడు. ‘‘తండ్రీకూతుళ్లమైనా.. నాకు వ్యతిరేకంగా తన అభిప్రాయాలను బహిరంగంగా చెబుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’అని పేర్కొన్నారు. తనే కాదు.. ఎవరైనా తమ అభిప్రాయాలను చెప్పవచ్చన్నారు. అలాగే ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాబర్ట్ మాట్లాడుతూ ‘‘నా కూతురు మాటలు నన్ను ఆశ్చర్యపర్చలేదు. జాత్యంహకారం, శ్వేతజాతీయుల హక్కులు, నల్లజాతీయుల జీవితాలపై మా మధ్య బేధాభిప్రాయాలు ఉన్నాయి. జాత్యంహకారం దేశమంతా ఉందని తను భావిస్తోంది. నా దృష్టిలో అలా కాదు. దేశ అధ్యక్షుడు ట్రంప్ నల్ల జాతీయుల కోసం చాలా చేశారు’’అని చెప్పుకొచ్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనారోగ్య సమస్యలతో కేజ్రీవాల్ మరణించేలా కుట్ర: దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్
తిహాడ్ జైల్లో అరవింద్ కేజ్రీవాల్పై కుట్ర జరుగుతోందని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ శనివారం ఆరోపించారు. -
ఈ పోలింగ్ ‘బ్యూటీ’ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?
Isha Arora: యూపీలో విధులు నిర్వహించిన పోలింగ్ ఏజెంట్ ఈశా అరోడా ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్గా మరారు. ఇంతకీ ఎవరామె..? -
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్
Doordarshan: ‘డీడీ న్యూస్’ లోగోను కాషాయ రంగులోకి మార్చడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది ‘ప్రసార భారతి’ కాదని ‘ప్రచార భారతి’గా మారిందని పలువురు మండిపడుతున్నారు. -
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
‘నా తమ్ముడికి ఓట్లేస్తే మీకు నీళ్లు’.. డీకే శివకుమార్ వ్యాఖ్యలపై కేసు నమోదు
-
‘చోటా కె గారు.. మీ గౌరవాన్ని కాపాడుకోండి’.. కాదు.. కూడదంటే I AM Waiting: హరీశ్
-
హెచ్డీఎఫ్సీ ఫలితాలు.. నికర లాభం రూ.17,622 కోట్లు
-
అనారోగ్య సమస్యలతో కేజ్రీవాల్ మరణించేలా కుట్ర: దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్
-
‘ఇంకెవరూ మీ భార్యే..’: కోహ్లీ ఆన్సర్కు షాకైన దినేశ్ కార్తిక్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM