వైరస్ కట్టడికి సరికొత్త ఎయిర్ఫిల్టర్
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ కలవరపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి ధాటికి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు....
రూపొందించిన హ్యూస్టన్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు
హ్యూస్టన్: ప్రపంచ దేశాలను కరోనా వైరస్ కలవరపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి ధాటికి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. దీని కట్టడికి శాస్త్రవేత్తలు సైతం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే పలు ఔషధ సంస్థలు ఈ వైరస్కు వ్యాక్సిన్ అభివృద్ధి చేసి క్లినికల్ ట్రయల్స్ కూడా ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ‘‘క్యాచ్ అండ కిల్’’ అనే ఎయిర్ ఫిల్టర్ను హ్యూస్టన్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది వైరస్ను గుర్తించిన వెంటనే నాశనం చేస్తుందని మెటీరియల్స్ టుడే ఫిజిక్స్ అనే జర్నల్ తన కథనంలో పేర్కొంది.
ఈ సరికొత్త పరికరం సాయంతో విద్యాసంస్థలు, ఆస్పత్రులు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, విమానాశ్రయాలుతో పాటు ఇతర ప్రజా రవాణా ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తిని నివారించవచ్చని తెలిపారు. ఒక్క సారి ఫిల్టర్ చేయడంతో దాదాపు 99.8 శాతం కరోనా వైరస్ను నాశనం అవుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వాణిజ్య అవసరాలకు లభించే నికెల్ నురుగు సహాయంతో ఈ పరికరాన్ని రూపొందించినట్లు తెలిపారు. అలానే దీని సహాయంతో ఆంత్రాక్స్ వ్యాధికి కారణమయ్యే బాసిల్లస్ ఆంత్రాక్స్ అనే బాక్టీరియా 99.9 శాతం నాశనం అయినట్లు కథనంలో వెల్లడించారు.
‘‘కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు విమానాశ్రయాలు, కార్యాలయాలు, పాఠశాలలు, క్రూయిజ్ షిప్లలో ఈ ఫిల్టర్ను ఏర్పాటు చేయవచ్చు. ఇది సమాజానికి ఎంతో ఉపయోగకరమైంది’’ అని పరిశోధకుల్లో ఒకరైన, హ్యూస్టన్ విశ్వవిద్యాలయం అధ్యాపకుడు జిఫెంగ్ రెన్ అన్నారు. కార్యాలయాల్లో ఉద్యోగులు విడిచే గాలిని తక్షణం శుభ్రపరిచేందుకు డెస్క్ టాప్ మోడల్ను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
శాస్త్రవేత్తల అంచనా ప్రకారం వైరస్ సుమారు మూడు గంటల పాటు గాలిలో ఉండగలదు. అలానే ఇది 70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను తట్టుకోలేదని, ఫిల్టర్ ఉష్ణోగ్రతను 200 డిగ్రీల సెల్సియస్కు పెంచడం ద్వారా వైరస్ను వెంటనే నాశనం చేయవచ్చని పరిశోధకులు కథనంలో పేర్కొన్నారు. వ్యాపార సముదాయాలు, ఇతర పని ప్రదేశాల్లో వైరస్ వెంటనే తొలగించకపోతే సాధారణ కార్యకలాపాలు పునఃప్రారంభించడం సాధ్యం కాదని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే తొలి దశలో భాగంగా ఈ ఫిల్టర్లను విద్యాసంస్థలు, ఆస్పత్రులు, విమానాలు, కార్యాలయాలు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, ఇతర ప్రయాణ ప్రదేశాలు వంటి చోట్ల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం