కరోనా ఉద్ధృతిపై ఊపిరితిత్తుల ఉష్ణోగ్రత ప్రభావం
ఎగువ, దిగువ శ్వాసకోశ వ్యవస్థల్లోని సహజసిద్ధ ఉష్ణోగ్రత వైరుధ్యాలు కరోనా ఉద్ధృతిపై ప్రభావం చూపుతున్నాయని
కొత్త మందుల రూపకల్పనకు మార్గం సుగమం
లండన్: ఎగువ, దిగువ శ్వాసకోశ వ్యవస్థల్లోని సహజసిద్ధ ఉష్ణోగ్రత వైరుధ్యాలు కరోనా ఉద్ధృతిపై ప్రభావం చూపుతున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ వైరస్ పునరుత్పత్తి, అనంతరం మానవ రోగ నిరోధక వ్యవస్థను క్రియాశీలం చేయడంపైన వీటి ప్రభావం ఉంటోందని తెలిపారు. కొవిడ్-19కు కొత్త చికిత్స విధానాలు, నివారణ ప్రక్రియలను రూపొందించడానికి ఈ పరిశోధన ఫలితాలు దోహదపడతాయని పేర్కొంది. స్విట్జర్లాండ్లోని బెర్న్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ ఆవిష్కారం చేశారు. పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు.. తాజా కొవిడ్-19 కారక సార్స్-కోవ్-2, 2002-03లో వచ్చిన సార్స్-కోవ్ వైరస్ల ఇన్ఫెక్షన్ తీరుతెన్నులను పోల్చి చూశారు. ఈ రెండు రకాల వైరస్ల మధ్య జన్యుపరంగా చాలా సారూప్యతలు ఉన్నప్పటికీ వాటి తీరులో కొన్ని ముఖ్యమైన వైరుధ్యాలూ ఉన్నాయని వారు చెప్పారు.
* 2002-03లో వచ్చిన వైరస్.. తీవ్రస్థాయి వ్యాధిని కలిగించింది. దిగువ శ్వాసకోశ వ్యవస్థలో ఇన్ఫ్లమేషన్కు ఇది కారణమైంది.
* ప్రస్తుత కొవిడ్ కారక సార్స్-కోవ్-2 మాత్రం చాలా వరకూ నాసిక కుహరం, శ్వాసనాళం సహా ఎగువ శ్వాస మార్గంలో ఇన్ఫెక్షన్ను కలిగిస్తోంది.
* సార్స్ వైరస్తో ఇన్ఫెక్షన్ సోకినవారిలో లక్షణాలు బయటపడిన తర్వాతే వారి ద్వారా వ్యాధి వ్యాప్తి జరిగింది. ఫలితంగా ఇన్ఫెక్షన్ వ్యాప్తిని అడ్డుకోవడం సులువైంది.
* సార్స్-కోవ్-2 మాత్రం.. లక్షణాలు కనిపించడానికి ముందే సదరు వ్యక్తి నుంచి ఇతరులకు వ్యాపిస్తోంది.
ఉష్ణోగ్రత వైరుధ్యాలే కారణం..
ఎగువ శ్వాస మార్గాల్లో 33 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుందని, అక్కడ కొవిడ్ వైరస్ పునరుత్పత్తి చెందడానికి ఈ ఉష్ణోగ్రత దోహదపడుతోందని శాస్త్రవేత్తలు తేల్చారు. దిగువ ఊపిరితిత్తుల్లోని 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో పోలిస్తే ఇక్కడే వైరస్ ఎక్కువగా తన సంఖ్యను పెంచుకుందని తెలిపారు. కొవిడ్ వైరస్కు భిన్నంగా.. సార్స్-కోవ్ మాత్రం ఉష్ణోగ్రతల్లోని వైరుధ్యాల ప్రభావానికి లోను కాలేదని తేల్చారు.
దిగువ శ్వాసకోశ వ్యవస్థతో పోల్చినప్పుడు.. ఎగువ శ్వాసనాళాల్లో సార్స్-కోవ్-2 వైరస్ ఇన్ఫెక్షన్ను అడ్డుకోవడానికి అక్కడి కణాల్లోని సహజసిద్ధ రోగనిరోధక వ్యవస్థ అంత బలంగా స్పందించలేదని వెల్లడైంది. ఈ ప్రతిస్పందన వ్యవస్థ బలాన్ని బట్టి.. వైరస్ పునరుత్పత్తి ఆధారపడి ఉంటుంది. ‘‘ఈ నేపథ్యంలో సార్స్-కోవ్-2 పునరుత్పత్తి, మానవ రోగనిరోధక యంత్రాంగంపై ఉష్ణోగ్రత ఆధారంగా జరిగే మార్పులను పరిశీలిస్తే.. ఎగువ శ్వాసకోశ వ్యవస్థలోనే ఆ వైరస్ ఎక్కువగా పునరుత్పత్తి చెందుతున్నట్లు వెల్లడవుతోంది. ఈ వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉండటానికి కూడా ఇదే కారణం’’ అని శాస్త్రవేత్తలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. 62.37% పోలింగ్ నమోదు
First phase of LS polls: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. -
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే బలమైన, స్థిర ప్రభుత్వం అవసరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
తనకు జైల్లో ఇన్సులిన్ అందించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) దిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. -
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
ఉత్తరప్రదేశ్లోని ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు ఫేషియల్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే.. -
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
UPSC: ఏళ్లపాటు కష్టపడి తృటిలో అవకాశం కోల్పోయిన యూపీఎస్సీ అభ్యర్థుల కోసం డిట్టో ఇన్సూరెన్స్ ఉద్యోగ అవకాశం ఇచ్చేందుకు ముందుకువచ్చింది. -
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు.
తాజా వార్తలు (Latest News)
-
అర్ధశతకాలతో చెలరేగిన రాహుల్, డికాక్.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?