France: అవును.. ఆ రాక్షసుణ్ని కాల్చి చంపా
‘అవును.. నేను అతణ్ని చంపాను. ఒకవేళ నేను ఆ పని చేయకపోతే నా పిల్లలే చేసేవాళ్లు’
గృహహింసపై గర్జించిన ఫ్రాన్స్ వనిత
వెల్లువలా ప్రజాబలం.. విడుదల చేసిన కోర్టు
ప్యారిస్: ‘అవును.. నేను అతణ్ని చంపాను. ఒకవేళ నేను ఆ పని చేయకపోతే నా పిల్లలే చేసేవాళ్లు’ అంటూ వలేరీ బాకోట్(40) కోర్టులో గర్జించింది. ఆ గళంలో ధిక్కారం కంటే అంతులేని విషాదం నుంచి బయటపడ్డ అబల ఆక్రందన ఉంది. అది విన్న న్యాయస్థానం సానుభూతితో ఆమె దీనగాధను అర్థం చేసుకుంది. నాలుగేళ్ల జైలుశిక్షను ఏడాదికి కుదిస్తూ.. ఆ శిక్షాకాలం కూడా అప్పటికే పూర్తయినందున ‘నువ్విక స్వేచ్ఛాజీవి’ అంటూ శుక్రవారం జూన్ 25న బాకోట్ను విడుదల చేసింది. వేలాది ప్రజాగొంతుకలు హర్షం వ్యక్తం చేశాయి. ఓ నరరూప రాక్షసుణ్ని చంపిన ఆమెను విడుదల చేయాలంటూ 7,10,000 సంతకాలతో ప్రజలు కోర్టుకు పెట్టుకున్న పిటిషన్ గురించి విన్న అంతర్జాతీయ సమాజం కూడా ఆమెకథ వినేందుకు ఇపుడు ఆసక్తి చూపుతోంది.
నలుగురు పిల్లల తల్లి ఫ్రెంచి వనిత వలేరీ బాకోట్. ఆ పిల్లల తండ్రి ఆమె మారుతండ్రే. 1992 ప్రాంతంలో.. మగదిక్కు లేని బాకోట్ తల్లికి దగ్గరైన డేనియల్ పొలెట్ట్ అప్పటికి పన్నెండేళ్ల వయసులో ఉన్న ఈమెపై కన్నేశాడు. అన్నెం పున్నెం ఎరుగని ఆ కౌమారదశ నుంచి మొదలుపెట్టి దాదాపు పాతికేళ్లు బాకోట్పై అత్యాచారాలు జరుపుతూ శారీరకంగా ఆమెను తీవ్రంగా హింసించాడు. ఈ క్రమంలో ఆమెకు నలుగురు పిల్లలు పుట్టారు. ఎట్టిపరిస్థితుల్లోనూ బాకోట్ తన చేయి దాటిపోకుండా పూర్తిగా నిఘా పెట్టాడు. తిరగబడితే తుపాకితో బెదిరించాడు. చివరకు ఆమెను వేశ్యగా కూడా మార్చాడు. తనకంటే పాతికేళ్లు వయసులో పెద్దవాడైన డేనియల్ పొలెట్ట్ అకృత్యాలన్నీ ఏళ్లతరబడి సహించిన బాకోట్ 14 ఏళ్ల వయసున్న ఆమె కుమార్తెను కూడా వేశ్యగా మార్చేందుకు చేసిన ప్రయత్నాన్ని మాత్రం సహించలేకపోయింది. భర్త రూపంలో ఉన్న ఆ రాక్షసుణ్ని తుపాకితో కాల్చి చంపింది. పిల్లలు ఆమెకు మద్దతుగా నిలిచారు. చివరకు డేనియల్ పొలెట్ట్ తోబుట్టువులు కూడా ఆమెకే మద్దతు పలికారు. 2016లో ఈ సంఘటన జరిగింది. తన నేరం అంగీకరించిన బాకోట్కు సెంట్రల్ ఫ్రాన్స్లోని చలోన్ సర్ సావన్ కోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష విధించింది. విచారణ అనంతరం ఆమె పెరోల్పై విడుదలైంది. ఈ సందర్భంగా ‘టాట్ లే మోండే సవాయిట్’ (ఎవరీవన్ న్యూ ఇట్) పేరిట బాకోట్ రాసిన తన ఆత్మకథ ఫ్రాన్స్ సమాజాన్ని ఓ ఊపు ఊపింది. వెల్లువలా తోడైన ప్రజాబలం న్యాయస్థానం ఆమెను విడుదల చేసేందుకు దోహదపడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
-
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM