Govt Eases Drone Rules: 5దరఖాస్తులు.. 4రకాల రుసుములు
దేశంలో డ్రోన్ కార్యకలాపాలకు సంబంధించిన నిబంధనలను కేంద్ర పౌర విమానయాన శాఖ సడలించింది. ఈ లోహ విహంగాలను నిర్వహించడానికి నింపాల్సిన దరఖాస్తుల సంఖ్యను 25 నుంచి ఐదుకు కుదించింది.
దేశంలో డ్రోన్ల నిర్వహణ ఇక సులువు
ఇది కీలక మైలురాయి: ప్రధాని
దిల్లీ: దేశంలో డ్రోన్ కార్యకలాపాలకు సంబంధించిన నిబంధనలను కేంద్ర పౌర విమానయాన శాఖ సడలించింది. ఈ లోహ విహంగాలను నిర్వహించడానికి నింపాల్సిన దరఖాస్తుల సంఖ్యను 25 నుంచి ఐదుకు కుదించింది. అలాగే ఒక్కో ఆపరేటర్ నాలుగు రకాల రుసుములు చెల్లిస్తే సరిపోతుంది. ప్రస్తుతం 72 రకాల ఛార్జీలను వసూలు చేస్తున్నారు. కొత్త నిబంధనలు ఈ రంగంలో మైలురాయిలా నిలిచిపోతాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్విటర్లో పేర్కొన్నారు. ‘‘నమ్మకం, స్వీయ ధ్రువీకరణ ప్రాతిపదికన వీటిని తెచ్చాం. ఆమోదాలు, కట్టుబడాల్సిన నిబంధనలు, ప్రవేశ అవరోధాలను గణనీయంగా తగ్గించాం’’ అని తెలిపారు. అంకుర పరిశ్రమలకు, ఈ రంగంలో పనిచేసే యువతకు ఇవి బాగా ఉపయోగపడతాయని చెప్పారు. ఈ నిబంధనలు సరకు బట్వాడాలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడతాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. వ్యవసాయం, ఆరోగ్యపరిరక్షణ, మైనింగ్ వంటి రంగాలకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ఎయిర్ ట్యాక్సీలకూ ఇది మార్గం సుగమం చేస్తుందన్నారు. ‘‘మనం రోడ్లపై చూస్తున్న ఉబర్ వంటి ట్యాక్సీలు గగనతలంలోనూ వచ్చే రోజు ఎంతో దూరంలో లేదు’’ అని పేర్కొన్నారు.
డ్రోన్ నిబంధనలు-2021 పేరిట పౌర విమానయాన శాఖ వీటిని జారీ చేసింది. ఈ ఏడాది మార్చి నుంచి అమల్లోకి వచ్చిన మానవ రహిత విమాన వ్యవస్థల నిబంధనలు-2021 స్థానంలో వీటిని తెచ్చింది. వీటి ప్రకారం..
♦ డ్రోన్ నిర్వాహకులు చెల్లించాల్సిన రుసుములు ఇక నామమాత్రంగానే ఉంటాయి. ఈ ఛార్జీలకు లోహ విహంగాల పరిమాణంతో ఇక సంబంధం ఉండదు. ఉదాహరణకు.. రిమోట్ పైలట్ లైసెన్సు కోసం రుసుమును రూ.3వేల (భారీ డ్రోన్కు) నుంచి రూ.100కు (అన్ని విభాగాల డ్రోన్లకు) తగ్గించారు.
♦ కనఫార్మెన్స్, నిర్వహణ, దిగుమతి క్లియరెన్స్ ధ్రువీకరణ పత్రాలు, ఆపరేటర్ పర్మిట్, ఆర్ అండ్ డీ సంస్థ ధ్రువీకరణ, విద్యార్థి రిమోట్ పైలట్ లైసెన్సు, విశిష్ట అథీకృత సంఖ్య, విశిష్ట ప్రొటోటైప్ గుర్తింపు సంఖ్య, గగనయాన సామర్థ్య సర్టిఫికెట్ వంటివి అవసరం లేదు.
♦ ‘గ్రీన్ జోన్’లలో 400 అడుగుల ఎత్తు వరకూ ఎలాంటి అనుమతి అవసరం లేకుండానే డ్రోన్లను నడుపుకోవచ్చు. విమానాశ్రయ ప్రహరీగోడ నుంచి 8-12 కిలోమీటర్ల మధ్య ఉన్న ప్రాంతంలో 200 అడుగుల ఎత్తు వరకూ వీటిని నిర్వహించుకోవచ్చు. గగనతల మ్యాప్లో రెడ్, యెల్లో జోన్లకు వెలుపలి ప్రదేశాల్లో 400 అడుగుల ఎత్తు వరకూ ఉండే ప్రాంతాన్ని గ్రీన్ జోన్గా పేర్కొంటారు.
♦ డ్రోన్ల బదిలీ, రిజిస్ట్రేషన్లను సరళీకరించారు.
♦ మైక్రో డ్రోన్ల (వాణిజ్యేతర అవసరాలకు), నానో డ్రోన్ల ఆపరేటర్లకు పైలట్ లైసెన్సు అవసరం లేదు. ఉల్లంఘనలకు పాల్పడేవారికి విధించే గరిష్ఠ జరిమానాలను రూ.లక్షకు తగ్గించారు.
♦ డ్రోన్ను భారత్లో నడపాలనుకున్న సందర్భంలోనే అది ఏ రకానికి చెందింది, దాని విశిష్ట గుర్తింపు సంఖ్య వంటి వివరాలు అవసరమవుతాయి.
♦ సరకుల బట్వాడాకు ప్రత్యేక డ్రోన్ నడవాలను అభివృద్ధి చేస్తారు. దేశంలో డ్రోన్ అనుకూల నియంత్రణ వ్యవస్థను తెచ్చేందుకు ప్రత్యేక ప్రోత్సాహక మండలిని ఏర్పాటు చేస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె