దేశం దాటాలంటే పరీక్షలెన్నో!.. ఆంక్షల కఠినతరంతో అయోమయం
యూఏఈ కరోనా ఆంక్షలు సడలించిందని తెలిసి ఓ ఉద్యోగి దుబాయి మీదుగా అమెరికా
ఈనాడు - హైదరాబాద్
యూఏఈ కరోనా ఆంక్షలు సడలించిందని తెలిసి ఓ ఉద్యోగి దుబాయి మీదుగా అమెరికా వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకున్నారు. ఎయిర్పోర్టుకు చేరాక ఆ ఎయిర్లైన్స్ నుంచి వెళ్లే వారికి వీసా ఆన్ అరైవల్ సదుపాయం లేదని ప్రయాణానికి అనుమతించబోమని చెప్పారు. దీంతో ఆ టికెట్ రద్దు చేసుకుని రూ. 1.3 లక్షలు పెట్టి ఎమిరేట్స్ టికెట్ కొనుక్కోవలసి వచ్చింది.
* ఖతార్ వెళ్లేందుకు మరో ప్రయాణికుడు విమానం బయలుదేరే సమయానికి 3 గంటల ముందుగా ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్పోర్టులో సిబ్బంది విమానం బయలుదేరే సమయానికి 5-6 గంటల ముందుగానే వచ్చి కొవిడ్ పరీక్ష చేయించుకోవాలని, ఇప్పుడు సమయం లేనందున అనుమతించబోమని చెప్పారు. సమయం మార్చిన విషయం తెలియకపోవడంతో టికెట్ రద్దు చేసుకున్నారు.
వివిధ దేశాల్లో కరోనా ఆంక్షలు, నిబంధనలు ఎప్పటికప్పుడు మారుతుండటంతో అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారికి ఇబ్బందులు తప్పడం లేదు. అత్యవసర పనులపై స్వదేశానికి వస్తున్నవారికి తిరిగి వెళ్లే సమయంలో సవాలక్ష సమస్యలు ఎదురవుతున్నాయి. తిరుగు ప్రయాణానికి ముందుగానే టికెట్ బుక్ చేసుకున్నా ఎయిర్లైన్స్ సంస్థల నుంచి కనీస సమాచారం అందకపోవడం, మారుతున్న నిబంధనల్ని ప్రయాణికులు తెలుసుకోకపోవడంతో ఇక్కట్లు తప్పడం లేదు. కరోనా పరీక్ష ప్రమాణాలు, ఎయిర్లైన్స్, ఎయిర్పోర్టు నిబంధనలు తెలియక పలువురు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
భారీగా రుసుం..
ఎయిర్పోర్టులో కరోనా పరీక్ష రుసుంలు భారీగా ఉంటున్నాయి. విమాన ప్రయాణానికి 6 గంటల ముందుగా చేసే ఆర్టీపీసీఆర్ పరీక్షకు రూ.4,500 చెల్లించాల్సి వస్తోంది.
ఇలా చేస్తే మేలు..
- అంతర్జాతీయ ప్రయాణాలకు సంబంధించి వివిధ దేశాలు అమలు చేస్తున్న కరోనా ఆంక్షలు, వీసా వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి.
- ‘వీసా ఆన్ అరైవల్’ సదుపాయం అన్ని ఎయిర్లైన్స్ సంస్థలకు లేదు. అది ముందే తెలుసుకుని టికెట్లు బుక్ చేసుకోవాలి.
- ప్రయాణానికి ముందురోజు విమానయాన సంస్థ కాల్సెంటర్లో సంప్రదించి, నిబంధనల్లో మార్పులేమైనా ఉన్నాయేమో తెలుసుకోవాలి
- గతంలోలా ఎయిర్లైన్స్ సంస్థలు ప్రయాణికులకు ఎస్ఎంఎస్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వనందున అప్రమత్తంగా ఉండాలి.
- కరోనా నిబంధనలు, ఆంక్షల కారణంగా కొన్ని విమానయాన సంస్థలు టికెట్ల రద్దు, తేదీ మార్పులపై చేస్తున్న సవరణలు గమనించడం అవసరం.
ఆంక్షల కఠినతరంతో అయోమయం
అంతర్జాతీయ ప్రయాణికులు రెండుసార్లు కొవిడ్ పరీక్ష చేయించుకోవలసి వస్తోంది. ప్రస్తుతం అన్ని విమానయాన సంస్థలు గమ్యస్థానం చేరుకునే సమయానికి (విమాన ప్రయాణ సమయాన్ని కలుపుకొని) 48 గంటల ముందుగా కొవిడ్ పరీక్ష రిపోర్టుతో రావాలని చెబుతున్నాయి. గతంలో ఇది 48-72 గంటలుగా ఉండేది. ఈ వివరాలు విమానయాన సంస్థల వెబ్సైట్లో అప్డేట్ కావడం లేదు. నిబంధనలు తరచూ మారుతుండడం, వివిధ దేశాలు ఆంక్షలను కఠినం చేస్తుండటంతో ప్రయాణికులు అయోమయానికి గురవుతున్నారు. కాల్సెంటర్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవాలని విమానయాన సంస్థలు చెబుతున్నాయి.
6 గంటల ముందు మరోసారి
అంతర్జాతీయ ప్రయాణికులు విమానం బయలుదేరే సమయానికి 6 గంటల ముందు ఎయిర్పోర్టుకు చేరుకోవలసి వస్తోంది. గతంలో గంట ముందు వరకు చెక్-ఇన్కు అనుమతి ఇచ్చేవారు. ఇప్పుడు 3 గంటల ముం దుగానే చెక్-ఇన్ అయిపోవాలని నిబంధన మార్చారు. అలాగే సరైన వీసా ఉంటే చాలు అంతర్జాతీయ ప్రయాణానికి అనుమతి ఉన్నట్లేనని భావించే పరిస్థితి లేదు. ఎయిర్పోర్టుకు చేరుకున్నాక అక్కడి సిబ్బంది ప్రయాణ పత్రాలన్నీ చూసి సత్వర ఆర్టీపీసీఆర్ పరీక్షకు అనుమతి ఇస్తారు. పత్రాల పరిశీలన పూర్తయ్యే వరకు కరోనా పరీక్షకు అనుమతి ఇవ్వరు. ఈ పరీక్ష చేయించుకున్న 45-60 నిమిషాల్లో ఫలితం వస్తుంది. అది అనుకూలంగా ఉంటే చెక్ఇన్కు అనుమతి ఇస్తారు. వ్యతిరేకంగా ఉంటే ప్రయాణ రద్దవుతుంది. ప్రయాణ సమయానికి కనీసం 5 గంటల ముందుగా పరీక్షకు నమూనా ఇవ్వాలని ఎయిర్లైన్స్ సిబ్బంది చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
Sunetra Pawar: బారామతి స్థానం నుంచి పోటీ చేస్తున్న ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు రూ.25 వేల కోట్ల బ్యాంకు స్కామ్ కేసులో క్లీన్ చిట్ లభించింది. -
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
Viral video: ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. -
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
ఎన్నికల వేళ.. రాజస్థాన్లోని బన్స్వారా నియోజకవర్గంలోని పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. తమ అభ్యర్థికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేపట్టింది. -
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
Nitin Gadkari: లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సభలో మాట్లాడుతూ స్పృహతప్పి పడిపోయారు. -
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
స్క్రాప్ మెటీరియల్ మాఫియా ద్వారా రూ.కోట్లు ఆర్జించిన గ్యాంగ్స్టర్ రవికానా, అతడి ప్రియురాలిని థాయ్లాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
Supreme Court: ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈవీఎంలలోని ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలన్న పిటిషన్లపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. -
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
Rahul Gandhi: ఎన్నికల మేనిఫెస్టోలో తాము ప్రతిపాదించిన ‘సామాజిక - ఆర్థిక సర్వే’ కేవలం అన్యాయాన్ని అంచనా వేయడానికి మాత్రమేనని రాహుల్ గాంధీ అన్నారు. చర్యలు తీసుకోవడానికి కాదంటూ క్లారిటీ ఇచ్చారు. -
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
వారసత్వ పన్ను గురించి శామ్ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ప్రధాని మోదీ (Modi) చేసిన ప్రసంగంతో కాంగ్రెస్ మరింత ఇరకాటంలో పడింది. -
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
మన దేశ ఎన్నికలపై విదేశీ మీడియా స్పందించడానికి గల కారణాన్ని కేంద్రమంత్రి జై శంకర్ (S Jaishankar) వెల్లడించారు. -
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం