Acid Attack: యాసిడ్‌ దాడి బాధితురాలికి  రూ.10 లక్షలు ఇవ్వండి

యాసిడ్‌ దాడి బాధితులు రైట్స్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ డిసబులిటీస్‌ చట్టం ప్రకారం..

Published : 08 Oct 2021 14:32 IST

మహారాష్ట్ర సర్కారుకు బాంబే హైకోర్టు సూచన

ముంబయి: యాసిడ్‌ దాడి బాధితులు రైట్స్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ డిసబులిటీస్‌ చట్టం ప్రకారం.. పరిహారానికి, పునరావాసానికి అర్హులని పేర్కొన్న బాంబే హైకోర్టు నగరానికి చెందిన ఓ బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం మూడు నెలల్లోపు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్, జస్టిస్‌ మాధవ్‌ జమదార్‌ల ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేస్తూ.. పరిహారం చెల్లించడంతోపాటు మళ్లీ ఆమె ముఖం మునుపటిలా మారేందుకు చేయించకునే శస్త్రచికిత్స ఖర్చులు, ఇతర వైద్యపరమైన అవసరాలు భరించాలని పేర్కొంది. 2010లో భర్త చేతిలో దాడికి గురైన ఇద్దరు పిల్లల తల్లి అయిన ఓ మహిళ దరఖాస్తు విచారణ సందర్భంగా హైకోర్టు పై ఆదేశాలు జారీ చేసింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని