China: సరిహద్దు ఒప్పందాలకు కొత్త చట్టం విఘాతం కాదు
కొత్తగా తాము తెచ్చిన సరిహద్దు చట్టం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండబోదని చైనా స్పష్టం చేసింది. ఇతర దేశాలతో
ఊహాగానాలు తగవంటూ చైనా వివరణ
బీజింగ్: కొత్తగా తాము తెచ్చిన సరిహద్దు చట్టం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండబోదని చైనా స్పష్టం చేసింది. ఇతర దేశాలతో ఇప్పటికే కుదిరిన సరిహద్దు ఒప్పందాల అమలుకు అది అవరోధం కాబోదని గురువారం తెలిపింది. దీనిపై ఆయా దేశాలు ‘ఉద్దేశపూర్వక ఊహాగానాలు’ చేయడం తగదని పేర్కొంది.
సరిహద్దుల రక్షణతో పాటు అక్కడి ప్రాంతాలను సద్వినియోగం చేసుకోవడానికి ఈ నెల 23న చైనా పార్లమెంటు ‘నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్’ (ఎన్పీసీ) ఒక చట్టాన్ని ఆమోదించింది. తూర్పు లద్దాఖ్లో దీర్ఘకాలంగా సైనిక ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో డ్రాగన్ చేపట్టిన ఈ చర్యపై భారత్ బుధవారం తీవ్రంగా స్పందించింది. చట్టాన్ని సాకుగా చూపిస్తూ సరిహద్దుల్లో పరిస్థితిని ఏకపక్షంగా మార్చే చర్యలను చైనా చేపట్టబోదని ఆశిస్తున్నట్లు స్పష్టంచేసింది. ప్రస్తుతమున్న ద్వైపాక్షిక ఒప్పందాలపై దీని ప్రభావం పడుతుందేమోనని ఆందోళన వ్యక్తంచేసింది. ఈ అంశంపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ స్పందించారు. ‘‘ఇది సాధారణ, అంతర్గత చట్టం. అది మా వాస్తవిక అవసరాలను నెరవేరుస్తుంది. అంతర్జాతీయ విధానాలకు అనుగుణంగానే అది ఉంది’’ అని పేర్కొన్నారు. పొరుగు దేశాలతో సహకారం అంశాన్ని కూడా ఆ చట్టంలో స్పష్టంగా పొందుపరిచామన్నారు. ప్రస్తుతమున్న సరిహద్దు ఒప్పందాల అమలుకు అది విఘాతం కాదంటూ.. పరోక్షంగా భారత్ లేవనెత్తిన ఆందోళనలను ప్రస్తావించారు. పొరుగు దేశాలతో సహకారం విషయంలో తమ వైఖరి మారబోదన్నారు. కొత్త చట్టంపై అధ్యక్షుడు జిన్పింగ్ సంతకం చేశారని, అది వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని వాంగ్ చెప్పారు. ‘‘జాతీయ భూ సరిహద్దు చట్టాన్ని తీసుకురావడం వెనుక మాకున్న ఉద్దేశాల గురించి ఇప్పుడు వివరించా. దీనిపై సంబంధిత దేశాలు అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడతాయని, ఈ చట్టంపై ఉద్దేశపూర్వక ఊహాగానాలకు స్వస్తి పలుకుతాయని ఆశిస్తున్నా’’ అని చెప్పారు.
మాపై పెరిగిన అమెరికా నిఘా
అమెరికా తమపై నిఘాను బాగా పెంచిందని చైనా సైనిక పరిశోధన విభాగం అధికారి ఒకరు తెలిపారు. ఈ ఏడాది అమెరికాకు చెందిన యుద్ధనౌకలు, విమానాలు 2వేలు సార్లు చాలా దగ్గరగా నిఘా వేసేందుకు వచ్చాయని చెప్పారు. ఇలాంటివి తమ దేశ సార్వభౌమాధికారాన్ని ప్రమాదంలో పడేస్తాయని తెలిపారు. కాల్పుల ముప్పును కూడా పెంచుతాయని హెచ్చరించారు. చైనా సైన్యం (పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ-పీఎల్ఏ)లో అకాడమీ ఆఫ్ మిలటరీ సైన్స్లో పరిశోధకుడిగా ఉన్న కావో యాంజాంగ్ తాజాగా ఒక వార్షిక సైనిక సదస్సులో ఈ విషయాలు తెలిపారు. అమెరికా ప్రధానంగా దక్షిణ చైనా సముద్రంపై నిఘా పెడుతున్నట్లు చెప్పారు. అక్కడ తమ అధీనంలో ఉన్న దీవులపై కన్నేసి ఉంచుతోందని వివరించారు. ‘‘తరచూ ఇంత దగ్గరగా వచ్చి నిఘా పెట్టడం వల్ల ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతాయి. ఇలాంటి చర్యలకు అనివార్యంగా చైనా నుంచి ప్రతిస్పందన తప్పదు. అవి కాల్పుల ముప్పును పెంచుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు’’ అని ఆయన పేర్కొన్నారు. వాణిజ్యం, సైన్స్, సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాల్లో తమను నిలువరించడానికి కూడా అమెరికా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇలాంటి ప్రయత్నాలకు అమెరికా తక్షణం స్వస్తి పలకాలని కోరారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య సంబంధాలు బాగా క్షీణించిన సంగతి తెలిసిందే. వాణిజ్యం, దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ దురుసు చర్యలు, హాంకాంగ్లో మానవహక్కుల ఉల్లంఘన వంటి అంశాలపై పరస్పరం విమర్శనాస్త్రాలను సంధించుకుంటున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. -
బాలిక 28 వారాల గర్భం తొలగింపుపై వైద్యుల సలహా కోరిన సుప్రీంకోర్టు
అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సర్వోన్నత న్యాయస్థానం వైద్యుల సలహా కోరింది. -
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
‘మా చిత్రాన్ని మరో ‘అన్బే శివం’ చేయొద్దు’: విజయ్ ఆంటోనీ వైరల్ పోస్ట్
-
నా భార్య ఆహారంలో టాయిలెట్ క్లీనర్ కలుపుతున్నారు: ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు
-
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా