Modi Govt: మోదీ సర్కారు పట్టువిడుపులు
దేశ రాజధానిలో ఏడాది కాలంగా రైతులు పట్టువిడవకుండా జరిపిన పోరాటానికి తలొగ్గి మోదీ సర్కారు మూడు
దేశ రాజధానిలో ఏడాది కాలంగా రైతులు పట్టువిడవకుండా జరిపిన పోరాటానికి తలొగ్గి మోదీ సర్కారు మూడు వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేసింది. అయితే మోదీ ప్రభుత్వం చట్టాలకు సంబంధించి తన నిర్ణయాలను ఉపసంహరించుకోవడం ఇదే తొలిసారి కాదు. ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతతో గతంలోనూ కొన్ని చట్టాలు, బిల్లులపై వెనక్కి తగ్గింది. వాటిలో మచ్చుకు కొన్ని..
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం
ఈ చట్టాన్ని సవరించి 200 వెనుకబడిన జిల్లాలకే పరిమితం చేయాలని 2014లో మోదీ సర్కారు నిర్ణయించింది. పనివారు, సామగ్రి నిష్పత్తినీ తగ్గించింది. దీనివల్ల చట్టం పరమార్థం దెబ్బతింటుందని 29 మంది ప్రఖ్యాత ఆర్థికవేత్తలు అభ్యంతరపెట్టారు. అవినీతిని తగ్గించి, స్త్రీలు, దళితులు, ఆదివాసీలకు మేలు చేసి, ఉత్పాదక ఆస్తులను సృష్టించిన ఈ చట్టాన్ని నీరుగార్చరాదని ఒత్తిడి తెచ్చారు. సర్కారు సవరణను పార్లమెంటులో ప్రవేశపెట్టకుండానే విరమించింది.
ఎల్.ఏ.ఆర్.ఆర్(లార్) చట్టం
భూసేకరణ, పునరావాస (లార్) చట్టం సవరణ బిల్లును 2015లో ప్రవేశపెట్టింది. దీన్ని అన్నా హజారే, రైతులు, పౌర హక్కుల సంఘాలు, ప్రతిపక్షాలే కాకుండా శివసేన, అకాలీ దళ్ వంటి మిత్ర పక్షాలూ వ్యతిరేకించాయి. బిహార్ ఎన్నికలకు ముందు సంబంధిత ఆర్డినెన్స్కు కాలం తీరిపోయినట్లు సర్కారు ప్రకటించింది.
పశువుల విక్రయంపై నిషేధం
పశువుల చోరీనీ, పశు అక్రమ వ్యాపారాన్నీ అరికట్టే పేరుతో 2017లో జంతువులపై క్రూరత్వ నిషేధ చట్టం కింద కొత్త నిబంధనలను తెచ్చింది. పశువులను కబేళాలకు తరలించకుండా ఇవి నిషేధిస్తాయి. ఈ నిబంధనలు రాష్ట్రాల అధికారాల్లో జోక్యం చేసుకునేలా ఉన్నాయంటూ పశ్చిమ బెంగాల్, కేరళ, మేఘాలయ నిరసించాయి. కేరళ, కర్ణాటకల్లో గొడ్డు మాంసం వేడుకలు నిర్వహించారు. కొత్త నిబంధనలపై మద్రాసు హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు దేశమంతటికీ విస్తరించింది. రాష్ట్రాలతో చర్చించిన మీదట కేంద్రం నిషేధాన్ని ఎత్తివేస్తూ 2018 ఏప్రిల్లో కొత్త నిబంధనలు రూపొందించింది.
ఎఫ్ఆర్డీఐ బిల్లు
బ్యాంకులు, బీమా కంపెనీలు, ఇతర ఫైనాన్స్ సంస్థల్లో దివాలా కేసుల పరిష్కారానికి 2017 ఆగస్టులో కేంద్రం లోక్సభలో ఎఫ్ఆర్డీఐ బిల్లు ప్రవేశపెట్టింది. దివాలా కేసులు పరిష్కారం కాకపోతే డిపాజిట్ దారులు కొంత భారాన్ని భరించాలన్నది బిల్లు ఉద్దేశం.దీన్ని ప్రతిపక్షాలతోపాటు బ్యాంకు ఉద్యోగుల సంఘం, అసోచామ్ వ్యతిరేకించాయి. బిల్లును సమగ్రంగా సమీక్షించాల్సి ఉందంటూ కేంద్రం దాన్ని ఉపసంహరించింది.
సామాజిక మాధ్యమ కమ్యూనికేషన్ హబ్
ఆన్లైన్, సామాజిక మాధ్యమాల్లో సమాచారంపై నిఘాకు సామాజిక మాధ్యమ కమ్యూనికేషన్ హబ్ ఏర్పాటుకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ 2018 ఏప్రిల్లో అనుమతి కోరింది. దీనివల్ల పౌరుల ఆన్లైన్ సంభాషణలను ఆలకించి, ఈ-మెయిల్స్నూ చూసే అవకాశం ప్రభుత్వానికి లభిస్తుంది. హబ్ టెండరును ఉపసంహరించుకోవాలంటూ కేంద్ర సమాచార శాఖకు ఇంటర్నెట్ ఫ్రీడం అసోసియేషన్ లీగల్ నోటీసు పంపింది. ఈ హబ్ను సృష్టించడం నిఘా రాజ్యానికి దారితీస్తుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. హబ్ యోచనను కేంద్రం పక్కన పెట్టింది. (సహకారం: రామోజీ విజ్ఞాన కేంద్రం)
ఈపీఎఫ్ చట్టం, పీఎఫ్ విత్డ్రాయల్ నిబంధనల సవరణ
రెండు నెలలకు మించి నిరుద్యోగులుగా ఉన్న భవిష్యనిధి (పీఎఫ్) సభ్యులు తమ ఖాతాలోని డబ్బునంతటినీ విత్డ్రా చేసుకోవడంపై ఆంక్షలు విధిస్తూ కేంద్రం 2016 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేసింది. దీన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా నిరసించాయి. సవరణ వల్ల తమ పీఎఫ్ ఖాతాలో యజమాని వాటా కోరే హక్కును పదవీ విరమణ వయసు (58 ఏళ్లు) పూర్తయ్యేవరకు ఉపయోగించుకునే వీలుండదని వారి ఆందోళన. ఒత్తిడికి తలొగ్గి కేంద్రం సంబంధిత నోటిఫికేషన్ను రద్దు చేసింది.
కొవిడ్ టీకాల సేకరణ విధానం
ఈ ఏడాది ఏప్రిల్లో ఒక వైపు కొవిడ్ కేసులు పెరుగుతుంటే, మరోవైపు దేశమంతటా వ్యాక్సిన్ కేంద్రాల్లో తీవ్ర డోసుల కొరత ఏర్పడింది. అలాంటి పరిస్థితుల్లో మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విమర్శలకు లోనైంది. 18-44 ఏళ్లవారికి టీకా వేయడానికి 25 శాతం డోసులను రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా వ్యాక్సిన్ తయారీదారుల నుంచి కొనాలని మే 1 నుంచి కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. కేంద్రమే టీకాలను కొని వ్యాక్సిన్ కేంద్రాలకు సరఫరా చేయాలని ప్రతిపక్షాలు తెచ్చిన ఒత్తిడి, ఆ మేరకు సుప్రీంకోర్టు జోక్యం సర్కారును ఇరుకున పెట్టాయి. మోదీ సర్కారు దిగివచ్చి, కేంద్రమే 75 శాతం డోసులను కొని రాష్ట్రాలకు ఉచితంగా సరఫరా చేస్తుందని ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైల్వే లైన్లు.. రోజుకు సరాసరి 7.41 కి.మీ.ల నిర్మాణం
గత పదేళ్ల కాలంలో దేశంలో రోజుకు సరాసరి 7.41 కి.మీ. మేర రైల్వే ట్రాకుల నిర్మాణం జరిగిందని భారతీయ రైల్వే (Indian Railways) ఇచ్చిన సమాచారంలో వెల్లడైంది. -
‘నన్ను క్షమించండి’.. క్షత్రియ వర్గాన్ని మరోసారి వేడుకున్న కేంద్ర మంత్రి
నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో అత్యంత క్లిష్ట దశను ఎదుర్కొంటున్నానని కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలా (Parshottam Rupala) పేర్కొన్నారు. -
పూంఛ్ దాడిలో పాక్ మాజీ కమాండో.. గుర్తించిన ఏజెన్సీలు..!
పూంఛ్ వద్ద వాయుసేన కాన్వాయ్పై జరిగిన దాడిలో పాక్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దేశానికి చెందిన మాజీ కమాండో ఈ ఘటనలో నేరుగా పాల్గొన్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి. -
ఐఎఫ్ఎస్ తుది ఫలితాలు వచ్చేశాయ్.. టాప్ 10 ర్యాంకర్లు వీరే..
UPSC IFS final Result| ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నిర్వహించిన మెయిన్ పరీక్షల తుది ఫలితాలు వెలువడ్డాయి. -
జస్ప్రీత్కు సెల్యూట్..అతడికి సాయం చేయాలనుంది: బాలీవుడ్ నటుడి పోస్ట్
విధి తల్లిదండ్రులను దూరం చేసినా ఆ బాలుడు అధైర్య పడలేదు. పదేళ్ల పసిప్రాయంలో కష్టాలను దిగమింగుతూ జీవితంలో ముందడుగు వేశాడు. అతడికి సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరలవ్వడంతో ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. సహాయం చేస్తామని పలువురు ముందుకువస్తున్నారు. -
కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్పై.. మే 10న తీర్పు
Arvind Kejriwal: మద్యం కేసులో కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్పై సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించనుంది. -
ఆ వీడియోల స్టోరీకి డైరెక్టర్, ప్రొడ్యూసర్ కుమారస్వామే: డీకే శివకుమార్
ప్రజ్వల్ రేవణ్ణ అభ్యంతరకర వీడియోల వ్యవహారం(Prajwal Revanna sex abuse case) కర్ణాటక రాజకీయాల్లో దుమారం రేపుతోంది. జేడీఎస్-కాంగ్రెస్ పార్టీలు ఒకదానిపై ఒకటి తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. -
‘ఆ 20 నిమిషాలు నా పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు’: పూంఛ్ ఉగ్రదాడిపై ప్రత్యక్షసాక్షి
ఇటీవల జరిగిన పూంఛ్ ఉగ్రదాడి (Poonch attack) లో ఒక సైనికుడు మృతి చెందారు. ఈ ఘటన గురించి ప్రత్యక్షసాక్షి మీడియాతో మాట్లాడారు. -
‘దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లలా కన్పిస్తారు..’: మరో వివాదంలో శామ్ పిట్రోడా
Sam Pitroda: భారత్లో భిన్నత్వంపై కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెరలేపాయి. దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లలా, తూర్పు భారతీయులు చైనీయుల మాదిరిగా కన్పిస్తారని ఆయన అన్నారు. -
₹2.5కోట్లు ఇస్తే ఈవీఎం మార్చేస్తా.. రాజకీయ నేతను డిమాండ్ చేసిన ఆర్మీ జవాన్
Maharashtra: డబ్బులిస్తే ఎక్కువ ఓట్ల పడేలా ఈవీఎంను మార్చేస్తానంటూ రాజకీయ నేతను మోసగించేందుకు యత్నించాడో జవాను. చివరకు కటకటాలపాలయ్యాడు. -
దౌత్య విభేదాల వేళ భారత పర్యటనకు మాల్దీవుల విదేశాంగ మంత్రి
Maldives: భారత్-మాల్దీవుల మధ్య దౌత్య విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఆ దేశ విదేశాంగ మంత్రి భారత్లో పర్యటించనున్నారు. -
తోటి పిటిషనర్గా హనుమాన్ పేరు.. కక్షిదారుకు రూ.లక్ష జరిమానా
దేవాలయం ఉన్న ఓ ప్రైవేటు భూమిని సొంతం చేసుకునేందుకు ఓ వ్యక్తి ఏకంగా హనుమంతుడినే తోటి పిటిషనర్గా పేర్కొన్నారు. -
దేశంలో తొలి ప్రైవేట్ రైలు జూన్ 4 నుంచి చుక్ చుక్
దేశంలోనే తొలి ప్రైవేట్ రైలు సర్వీసు జూన్ 4 నుంచి కేరళలోని తిరువనంతపురం టు గోవా మార్గంలో రాకపోకలు ప్రారంభించనుంది. -
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వహించకూడదు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో ఇంకా ఊరట లభించలేదు. -
కుటుంబపోషణ కోసం కల్లు గీస్తున్న షీజా
కేరళలోని కన్నూర్కు చెందిన సి.షీజా (38) భర్తకు రోడ్డుప్రమాదం జరగడంతో కుటుంబపోషణ కోసం కల్లుగీతను వృత్తిగా ఎంచుకొంది. చకాచకా చెట్లను ఎక్కుతూ కల్లును గీసి ఔరా అనిపించుకుంటోంది. -
పశ్చిమ బెంగాల్లో ఉపాధ్యాయ నియామకాల రద్దు నిలిపివేత
సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ ఛైర్పర్సన్ మమతా బెనర్జీకి భారీ ఉపశమనం లభించింది. -
సంజీవ్ లాల్ అరెస్ట్
ఝార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగీర్ ఆలం ప్రైవేటు కార్యదర్శి(పీఎస్) సంజీవ్ కుమార్ లాల్ (52), లాల్ పనిమనిషి జహంగీల్ ఆలం(42)లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం అరెస్టు చేసింది. -
మోసపూరిత ప్రకటనలకు ఉత్పత్తుల ప్రచార తారలూ బాధ్యులే
ఉత్పత్తుల విక్రయాలను పెంచుకోవడానికి కంపెనీలు మోసపూరిత ప్రకటనలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన సర్వోన్నత న్యాయస్థానం వాటిని నివారించే చర్యలకు సంబంధించి కీలక సూచనలు చేసింది. -
మోసాలకు వాడే నంబర్లను స్తంభింపజేస్తున్న టెలికాం శాఖ
మొబైల్ వినియోగదారులకు ఎస్ఎంఎస్లు పంపించి ఆర్థికంగా మోసం చేస్తున్నవారి మొబైల్ హ్యాండ్సెట్లను బ్లాక్ చేసి, వారి నంబర్లను స్తంభింపజేసే పనికి టెలికాం శాఖ (డీవోటీ) శ్రీకారం చుట్టింది. -
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం
కేరళకు మరో వైరల్ ఫీవర్ పట్టుకుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. -
ఏ నాగరిక సమాజంలోనూ హింసను కీర్తించరు
కెనాడాలోని ఒంటారియోలో నిర్వహించిన ఊరేగింపులో ఖలిస్థానీ అనుకూల ప్రదర్శనలపై భారత్ తీవ్ర నిరసన తెలిపింది. హింసను కీర్తించడం ఏ నాగరిక సమాజంలోనూ భాగం కాదని పేర్కొంది.
తాజా వార్తలు (Latest News)
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
చెలరేగిన హెడ్, అభిషేక్.. హైదరాబాద్ అద్భుత విజయం
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్కుమార్ ఫన్నీ వీడియో
-
పులివెందుల సీఐపై ఎన్నికల సంఘానికి దస్తగిరి ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM