Covid: కరోనా మందులపై ముందుచూపు లేదు
కొవిడ్-19 చికిత్స కోసం అనేక ఔషధాలు అందుబాటులోకి వస్తున్నాయి. వచ్చే ఏడాది మరికొన్ని రాబోతున్నాయి.
కొవిడ్ ఔషధాల గుర్తింపులో కొరవడిన వ్యూహం
ఇది గుణపాఠం కావాలి : శాస్త్రవేత్తలు
అడిలైడ్: కొవిడ్-19 చికిత్స కోసం అనేక ఔషధాలు అందుబాటులోకి వస్తున్నాయి. వచ్చే ఏడాది మరికొన్ని రాబోతున్నాయి. అందులో కొన్నింటిని రోగులు ఇళ్లలోనే తీసుకోవచ్చు. మిగతావాటిని ఆసుపత్రుల్లోనే ఇవ్వాల్సి ఉంటుంది. మహమ్మారి ప్రజ్వరిల్లిన రెండేళ్ల తర్వాత ఈ స్థితికి చేరుకోగలిగాం. అయితే ఈ విషయంలో చాలా ఆలస్యం జరిగిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఔషధ ప్రయోగాల్లో విస్తృత భాగస్వామ్యాలు, ఇతర రుగ్మతల కోసం ప్రస్తుతం వాడుకలో ఉన్న మందుల్లో కొవిడ్పై ఫలితాన్ని ఇచ్చే వాటిని గుర్తించడం వంటివి సమర్థంగా చేయాల్సిందని అభిప్రాయపడుతున్నారు. దానివల్ల చాలా ముందుగానే కరోనాకు పెద్ద సంఖ్యలో సమర్థ మందులు వచ్చేవన్నారు. దీనిపై ఆస్ట్రేలియాలోని న్యూకాజిల్కు చెందిన జెన్నిఫర్ మార్టిన్, దక్షిణ ఆస్ట్రేలియా వర్సిటీకి పరిశోధకుడు రిచర్డ్ జాన్ హెడ్లు ఒక పరిశోధన పత్రం వెలువరించారు. వీరి విశ్లేషణ ప్రకారం..
మానసిక కుంగుబాటుకు ఉపయోగించే ఫ్లువోక్సామైన్ ఔషధం కొవిడ్ బాధితులపై పనిచేస్తుందని ఇటీవలి అధ్యయనంలో తేలింది. ప్రస్తుత ఔషధాల్లో కొవిడ్పై పనిచేసే వీలున్న ఇలాంటివాటిని గుర్తించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. దీన్ని ఎంత డోసులో తీసుకోవాలన్నదానిపైనా ఇప్పటికే నిపుణులకు ఒక అవగాహన ఉంటుంది. అలాగే దుష్ప్రభావాలపైనా పూర్తిస్థాయి సమాచారం ఉంటుంది. కుంగుబాటు కోసం ఈ ఔషధాన్ని తీసుకుంటున్నవారు కొవిడ్ను బాగా ఎదుర్కొన్నారని వెల్లడైంది. దీని ఆధారంగానే ఈ మందును తదుపరి పరీక్షల కోసం ఎంచుకున్నారు. భారీ స్థాయిలో జనాభాపై పరీక్షించారు. దీనివల్ల అర్థవంతమైన ఫలితాలు వచ్చాయి.
తొలినాళ్లలోనే అవకాశాన్ని కోల్పోయాం
కొవిడ్ను రెండు రకాల వ్యూహాలతో చికిత్స చేయవచ్చు. ఒకటి.. వైరస్ను లక్ష్యంగా చేసుకోవడం లేదా వైరస్ను నిర్వీర్యం చేయడం. రెండోది.. రోగికి చికిత్స చేయడం. ఈ విధానంలో.. వైరస్కు స్పందనగా శరీరంలో వెలువడే తీవ్రస్థాయి పరిణామాలకు చికిత్స చేస్తారు. ఫ్లువోక్సామైన్ కూడా ఈ కోవలోకే చెందుతుంది. అయితే మహమ్మారి ఆరంభంలో దీనిపై పెద్దగా దృష్టిసారించలేదు. దశాబ్దాల నాటి డెక్సామిథాసోన్, బుడెసోనైడ్ వంటి కార్టికోస్టెరాయిడ్లతో చికిత్స మినహా పెద్దగా చేసిందేమీ లేదు. మొదట్లోనే దీనిపై దృష్టిపెట్టి ఉంటే టీకాలు, యాంటీవైరల్ ఔషధాల అభివృద్ధికి మరింత సమయం లభించేది.
పెద్ద సంఖ్యలో చిన్న ప్రయోగాలు
మహమ్మారి సమయంలో కొవిడ్ ఔషధాల కోసం 2800 క్లినికల్ ప్రయోగాలు జరిగాయి. అనేక ప్రయోగాల్లో వంద కన్నా తక్కువ మందినే వాలంటీర్లుగా ఎంచుకున్నారు. ఇలాంటివాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఒక ఔషధం సురక్షితంగా, సమర్థంగా పనిచేస్తుందా అన్నది తెలియాలంటే భాగస్వామ్యంతో కూడిన భారీ క్లినికల్ ట్రయల్స్ జరగాలి. ఉదాహరణకు.. ‘రికవరీ’ అనే ప్రయోగంలో 180 ప్రదేశాల్లో 45వేల మందిని చేర్చుకున్నారు. ఇందులో డెక్సామెథాసోన్ వల్ల మరణాలు తగ్గుతాయని వెల్లడైంది. ఫలితంగా ప్రామాణిక చికిత్స విధానంలో మార్పు వచ్చింది.
భవిష్యత్తులో ఎలా..?
ప్రస్తుత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని.. భవిష్యత్తులో మహమ్మారులు ఉత్పన్నమైనప్పుడు ఆరంభ దశలోనే ఔషధాలను అభివృద్ధి చేసే మార్గాలను గుర్తించాలి. అంతర్జాతీయ భాగస్వామ్యాలతో భారీ స్థాయి క్లినికల్ ప్రయోగాల ప్రాముఖ్యతను గుర్తించాలి. అలాగే జాతీయంగానూ పరిశోధన ప్రయోగాలను సమన్వయం చేసుకోవాలి.
తప్పుడు నిర్ణయాలు
ప్రస్తుతమున్న అనేక ఔషధాలతో సాంక్రమిక వ్యాధులకు ఏళ్లుగా చికిత్స చేస్తున్నారు. ఈ అనుభవం ఆధారంగా.. ప్రస్తుత ఔషధాల్లో కొన్ని కొవిడ్కు పనికిరావని అవగాహన ఉన్నప్పటికీ వాటిపై ప్రయోగాలు చేశారు. స్పానిష్ ఫ్లూను క్వినైన్, దానికి సంబంధించిన ఔషధాలతో చికిత్స చేసేందుకు గతంలో విఫలయత్నం చేశారు. అయినా దానితో ముడిపడిన హైడ్రాక్సీక్లోరోక్విన్ మందుతో కొవిడ్కు చికిత్స కోసం భారీగా ప్రయోగాలు చేయడం గమనార్హం. ఇలాంటి ప్రాథమిక విధానాలను అనుసరించి ఉంటే.. ఐవర్మెక్టిన్, హైడ్రాక్సిక్లోరోక్విన్లు కరోనాపై పనిచేయవని మొదటే అర్థమై ఉండేది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం