Covid: ప్రజాస్వామ్యాన్ని హరిస్తున్న మహమ్మారి
కొవిడ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం పెను ముప్పును ఎదుర్కొంటోందని తాజా నివేదిక ఒకటి వెల్లడించింది.
కొవిడ్ వేళ అణచివేతకు పాల్పడుతున్న పలు దేశాలు
భారత్లో పరిస్థితిపైనా ఒకింత ఆందోళన
కోపెన్హాగెన్: కొవిడ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం పెను ముప్పును ఎదుర్కొంటోందని తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే క్రమంలో పలు దేశాల ప్రభుత్వాలు అప్రజాస్వామిక, అనవసర చర్యలకు ఉపక్రమిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. 34 దేశాలతో కూడిన ‘ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్ (అంతర్జాతీయ ఐడీఈఏ)’ సంస్థ ఈ మేరకు 80 పేజీల నివేదికను సోమవారం విడుదల చేసింది. భారత్లో పరిస్థితిపైనా అందులో కొంత ఆందోళన వ్యక్తం చేసింది.
తాజా నివేదికలోని ముఖ్యాంశాలివీ..
- కొవిడ్ వ్యాప్తిని నియంత్రించే క్రమంలో.. 2021 ఆగస్టు నాటికి ప్రపంచవ్యాప్తంగా 64% దేశాలు అనవసర, అనుచిత, అక్రమ చర్యలకు పూనుకున్నాయి.
- ప్రజాస్వామ్యానికి ఆదరణ తగ్గుతున్న దేశాల సంఖ్య గత దశాబ్ద కాలంలో రెట్టింపయింది. అమెరికా, హం గేరీ, పోలండ్, స్లొవేనియా ఈ జాబితాలో ఉన్నాయి.
- నిరంకుశ మార్గంలో పయనిస్తున్న దేశాల సంఖ్య.. గత ఏడాది ప్రజాస్వామ్య మార్గంలోని దేశాల సంఖ్యను దాటేసింది. మహమ్మారి వేళ 80 దేశాల్లో నిరసనలు కనిపించాయి. బెలారస్, క్యూబా, ఎస్వాతిని (స్వాజిలాండ్),మయన్మార్, సూడాన్లలో ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమాలు అణచివేతకు గురయ్యాయి.
- ఆసియాలోని అఫ్గాన్, హాంకాంగ్, మయన్మార్లలో నిరంకుశత్వం పెరిగింది. భారత్, ఫిలిప్పీన్స్, శ్రీలంకల్లో ప్రజాస్వామ్యాన్ని కొంత హరించడం కనిపించింది. చైనా ప్రాబల్యం ప్రజాస్వామ్యానికి మరింత ముప్పుగా మారుతోంది.
- ఆఫ్రికాలో ప్రజాస్వామ్యానికి సంబంధించి గత మూడు దశాబ్దాల్లో సాధించిన ప్రగతి మహమ్మారి వేళ దాదాపుగా అంతరించిపోయింది.
- బొలీవియా, బ్రెజిల్, కొలంబియా, ఎల్ సాల్వడార్లో ప్రజాస్వామ్యం నిరాదరణకు గురవుతోంది.
- ఐరోపాలో ప్రజాస్వామ్యం ఇప్పటికే బలహీనంగా ఉన్న కొన్ని దేశాలు కొవిడ్ను సాకుగా చూపుతూ అణచివేతను మరింత పెంచాయి. అజర్బైజాన్, బెలారస్, రష్యా, టర్కీ ఇందుకు ఉదాహరణలు.
ఆస్ట్రియాలో మళ్లీ లాక్డౌన్
పది రోజుల పాటు అమలు కరోనా నాలుగో దశ ఉద్ధృతే కారణం
వియెన్నా, బ్రసెల్స్: కొవిడ్ నాలుగో దశ ఉద్ధృతితో చివురుటాకులా వణుకుతున్న ఆస్ట్రియా... మళ్లీ దేశ వ్యాప్తంగా పూర్తిస్థాయిలో లాక్డౌన్ విధించింది! సోమవారం నుంచి పది రోజులపాటు ఇది అమలవుతుంది. వైరస్ విజృంభణ ఇలాగే కొనసాగితే, లాక్డౌన్ను మరిన్ని రోజులు పొడిగిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావద్దని హెచ్చరించింది. కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానాలు తప్పవని హెచ్చరించింది. దేశంలోని చాలా ఆసుపత్రులు కొవిడ్ బాధితులతో కిటకిటలాడుతున్నాయి.
*ఆస్ట్రియాలో ఇప్పటివరకూ 66% మంది టీకాలు తీసుకున్నారు. లాక్డౌన్ విధిస్తున్న క్రమంలో వీరందరికి ఛాన్సలర్ అలెగ్జాండర్ షాలెన్బర్గ్ క్షమాపణలు చెప్పారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకే లాక్డౌన్ విధించాల్సి వచ్చిందన్నారు.
ఫ్రాన్స్లో హింసాత్మకం.. నగరం లూటీ!
కొవిడ్ ఆంక్షలకు వ్యతిరేకంగా ఫ్రాన్స్లోని గ్వాడెలోప్ ద్వీపంలో జరుగుతున్న నిరసనలు సోమవారం హింసాత్మకంగా మారాయి. పాయింట్-ఏ-పిట్రేలో చోటుచేసుకున్న ఘర్షణల్లో 80 ఏళ్ల వృద్ధురాలు సహా ముగ్గురు గాయపడ్డారు. అల్లరిమూకలు అనేక ఇళ్లను లూటీ చేశాయి. 38 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బ్రసెల్స్లో వేలమంది...
కొవిడ్ ఆంక్షలను వ్యతిరేకిస్తూ బ్రసెల్స్లో భారీ ఆందోళనలు జరుగుతున్నాయి. ఆదివారం నిర్వహించిన ర్యాలీలో సుమారు 35 వేల మంది పాల్గొన్నారు. వీరిలో కొందరు పోలీసులపైకి రాళ్లు రువ్వారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తోటి పిటిషనర్గా హనుమాన్ పేరు.. కక్షిదారుకు రూ.లక్ష జరిమానా
దేవాలయం ఉన్న ఓ ప్రైవేటు భూమిని సొంతం చేసుకునేందుకు ఓ వ్యక్తి ఏకంగా హనుమంతుడినే తోటి పిటిషనర్గా పేర్కొన్నారు. -
దేశంలో తొలి ప్రైవేట్ రైలు జూన్ 4 నుంచి చుక్ చుక్
దేశంలోనే తొలి ప్రైవేట్ రైలు సర్వీసు జూన్ 4 నుంచి కేరళలోని తిరువనంతపురం టు గోవా మార్గంలో రాకపోకలు ప్రారంభించనుంది. -
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వహించకూడదు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో ఇంకా ఊరట లభించలేదు. -
కుటుంబపోషణ కోసం కల్లు గీస్తున్న షీజా
కేరళలోని కన్నూర్కు చెందిన సి.షీజా (38) భర్తకు రోడ్డుప్రమాదం జరగడంతో కుటుంబపోషణ కోసం కల్లుగీతను వృత్తిగా ఎంచుకొంది. చకాచకా చెట్లను ఎక్కుతూ కల్లును గీసి ఔరా అనిపించుకుంటోంది. -
పశ్చిమ బెంగాల్లో ఉపాధ్యాయ నియామకాల రద్దు నిలిపివేత
సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ ఛైర్పర్సన్ మమతా బెనర్జీకి భారీ ఉపశమనం లభించింది. -
సంజీవ్ లాల్ అరెస్ట్
ఝార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగీర్ ఆలం ప్రైవేటు కార్యదర్శి(పీఎస్) సంజీవ్ కుమార్ లాల్ (52), లాల్ పనిమనిషి జహంగీల్ ఆలం(42)లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం అరెస్టు చేసింది. -
మోసపూరిత ప్రకటనలకు ఉత్పత్తుల ప్రచార తారలూ బాధ్యులే
ఉత్పత్తుల విక్రయాలను పెంచుకోవడానికి కంపెనీలు మోసపూరిత ప్రకటనలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన సర్వోన్నత న్యాయస్థానం వాటిని నివారించే చర్యలకు సంబంధించి కీలక సూచనలు చేసింది. -
మోసాలకు వాడే నంబర్లను స్తంభింపజేస్తున్న టెలికాం శాఖ
మొబైల్ వినియోగదారులకు ఎస్ఎంఎస్లు పంపించి ఆర్థికంగా మోసం చేస్తున్నవారి మొబైల్ హ్యాండ్సెట్లను బ్లాక్ చేసి, వారి నంబర్లను స్తంభింపజేసే పనికి టెలికాం శాఖ (డీవోటీ) శ్రీకారం చుట్టింది. -
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం
కేరళకు మరో వైరల్ ఫీవర్ పట్టుకుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. -
ఏ నాగరిక సమాజంలోనూ హింసను కీర్తించరు
కెనాడాలోని ఒంటారియోలో నిర్వహించిన ఊరేగింపులో ఖలిస్థానీ అనుకూల ప్రదర్శనలపై భారత్ తీవ్ర నిరసన తెలిపింది. హింసను కీర్తించడం ఏ నాగరిక సమాజంలోనూ భాగం కాదని పేర్కొంది. -
మంచి, చెడు స్పర్శల గురించే కాదు.. చిన్నారులకు వర్చువల్ టచ్పై కూడా అవగాహన అవసరం: దిల్లీ హైకోర్టు
నేటి సమాజంలో పిల్లలకు మంచి, చెడు స్పర్శల గురించి మాత్రమే బోధిస్తే సరిపోదని, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతతో పాటు ‘వర్చువల్ టచ్’ అనే అంశంపై కూడా అవగాహన కల్పించాలని దిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. -
జమ్మూకశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ముష్కరులు హతమైనట్లు అధికారులు తెలిపారు. -
అయోధ్య మందిరం వాస్తు ప్రకారం లేదు
అయోధ్య రామమందిరంపై సమాజ్వాదీ పార్టీ నాయకుడు రాంగోపాల్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఆలయాన్ని సరిగా నిర్మించలేదని, అది ఉపయోగం లేనిదని ఆయన అన్నారు. -
800 కేజీల బంగారు నగలను తీసుకెళుతున్న కంటెయినర్ బోల్తా
డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో 800 కేజీల బంగారు ఆభరణాలను తీసుకెళుతున్న కంటెయినర్ బోల్తా కొట్టింది. -
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)ని హైదరాబాద్లో మంగళవారం కలిశారు. ఇటీవల పీవీకి కేంద్రం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇచ్చినందుకు గాను ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. -
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
కేరళలోని పలు జిల్లాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ (West Nile fever) వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.