Afghanistan: అఫ్గాన్ మధ్యతరగతిలోనూ ఆకలి కేకలు
తాలిబన్ల వశమయ్యాక అఫ్గానిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. గతంలో ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకున్న
ఉపాధి కరవై రోడ్డున పడుతున్న ప్రజలు
కాబుల్: తాలిబన్ల వశమయ్యాక అఫ్గానిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. గతంలో ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకున్న మధ్యతరగతి ప్రజలు సైతం ప్రస్తుతం అకస్మాత్తుగా రోడ్డున పడ్డారు. తాలిబన్లకు తోడు కరోనా వైరస్ వచ్చి మీద పడటం, తీవ్ర అనావృష్టితో 3.8 కోట్ల అఫ్గాన్ జనాభాలో ఇప్పటికే 22 శాతం మంది ఆకలితో అలమటిస్తున్నారు. మరో 36 శాతం మంది తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు. నిజానికి 2020లోనే ఆ దేశ జనాభాలో సగం మంది పేదరికంలో మగ్గారు. ప్రస్తుతం పరిస్థితి మరింత విషమించింది. ఇంతకుముందు అమెరికా మద్దతుతో నడచిన ప్రభుత్వం కూడా తరచూ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోయేది. ఆగస్టులో తాలిబన్లు అధికారంలోకి వచ్చి మానవ హక్కులను కాలరాయడం, అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవించకపోవడంతో అంతర్జాతీయ సమాజం అఫ్గానిస్థాన్కు ఆర్థిక సహాయాన్ని దాదాపుగా నిలిపేసింది! ఆ దేశ బ్యాంకులను అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థ వెలివేసింది. ప్రపంచ దేశాలు తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించడానికి నిరాకరించాయి. దీంతో ప్రస్తుతం తాలిబన్ ప్రభుత్వం ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించలేకపోతోంది. విద్యావైద్యాల వంటి ప్రజా సేవలను నిర్వహించలేకపోతోంది. గతంలో విదేశీ సహాయంతో అఫ్గాన్లో చేపట్టిన వివిధ ప్రాజెక్టులు ఇప్పుడు స్తంభించిపోయాయి. దేశ ఆర్థిక వ్యవస్థ 40 శాతం మేర కుంచించుకుపోయింది. ఒకప్పుడు భద్రమైన ఉద్యోగాలు చేసుకున్నవారు కూడా నేడు పూట గడవని దుస్థితిలోకి జారిపోయారు.
మానవతా దృష్టితో సహాయం
అఫ్గాన్లను ఆదుకోవడానికి అమెరికా తదితర విదేశీ ప్రభుత్వాలు ఆర్థిక సహాయం చేస్తున్నా, ఆ నిధులను తాలిబన్ ప్రభుత్వానికి కాకుండా ఐక్యరాజ్య సమితి సంస్థలకు అందిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్లు అఫ్గాన్ వైద్యులు, నర్సులకు జీతాలు చెల్లిస్తూ, దేశ ఆరోగ్య రక్షణ యంత్రాంగం కుప్పకూలకుండా చూస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి ఆహార సంస్థ (డబ్ల్యూఎఫ్పీ) అఫ్గాన్ ప్రజలకు ఆహారం, నగదు అందిస్తూ వారిని ఆకలి చావుల బారి నుంచి కాపాడటానికి కృషి చేస్తోంది. నిరుడు 90 లక్షలమందికి నగదు, ఆహారం అందించిన డబ్ల్యూఎఫ్పీ ఈ ఏడాది 1.4 కోట్లమందిని ఆదుకుంది. వచ్చే ఏడాది 2.3 కోట్లమందికి సహాయాన్ని విస్తరించదలచింది. అది సాధ్యపడాలంటే నెలకు 22 కోట్ల డాలర్ల ఆర్థిక సహాయం అవసరమంటోంది. గ్రామీణ పేదలే కాదు, పట్టణ మధ్యతరగతి కూడా పస్తులు ఉండాల్సిన దుస్థితిలోకి జారిపోతోందని డబ్ల్యూఎఫ్పీ తెలిపింది. అఫ్గాన్లకు ఆహారంతోపాటు ముఖ్యమైన ఖర్చుల కోసం నగదు సహాయమూ ఇవ్వడానికి ఐరాస నడుం కట్టింది. గతవారం కాబుల్లో ఒక వ్యాయామశాలలో 38 డాలర్ల నెలసరి నగదు సహాయం పొందడానికి వందలాది అఫ్గాన్ ప్రజలు బారులు తీరి కనిపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ న్యాయస్థానం నిర్ణయించింది. -
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు న్యాయస్థానంలో ఊరట లభించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. -
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
Varun Gandhi: ఈ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన భాజపా ఎంపీ వరుణ్గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ఎంపీగా లేకపోయినా.. ఓ కుమారుడిలా ప్రజలకు సేవ చేస్తానన్నారు. -
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
Lawyers letter to CJI: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. కొందరు స్వార్థమూకలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. -
ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో ప్రవర్తన మారకూడదు
ప్రజల ప్రవర్తనలో మార్పు ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో రాకూడదని, అది మనసులో నుంచి వివేకంతో రావాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
మనీలాండరింగ్ పరిధిలోకి రాని నేరానికి ఆ చట్టాన్ని వర్తింపజేయలేం
ఒక వ్యక్తిపై మోపిన నేరపూరిత కుట్ర అభియోగాలు మనీలాండరింగ్ చట్టం పరిధిలోకి రానట్లయితే...సదరు నిందితుడిపై ‘ఐపీసీ సెక్షన్ 120బి’ని మోపి పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేయరాదని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. -
ఆసుపత్రి నుంచి సద్గురు డిశ్ఛార్జ్
ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్ఛార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఈశా ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. -
డ్రగ్స్ జప్తు కేసులో మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను దోషిగా తేల్చిన కోర్టు
కస్టడీ మరణం కేసులో ఇప్పటికే జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను న్యాయస్థానం మరో నేరంలో దోషిగా నిర్ధారించింది. -
నేపాల్ మేయర్ కుమార్తె ఆచూకీ లభ్యం
గోవాలో రెండ్రోజుల క్రితం అదృశ్యమైన నేపాల్లోని ధన్గఢీ నగర మేయర్ కుమార్తె ఆర్తీ హమాల్(36) ఆచూకీ బుధవారం లభ్యమైంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే