Konijeti Rosaiah: ముగ్గురు ముఖ్యమంత్రులకు ఆయనే నం.2
రాజకీయ దురంధరుడు కొణిజేటి రోశయ్యకు ప్రకాశం జిల్లా చీరాలతో విడదీయలేని అనుబంధం ఉంది.
చీరాల దత్త పుత్రుడు
రోశయ్య రాజకీయ జీవితానికి అక్కడే పునాది
చీరాల, న్యూస్టుడే: రాజకీయ దురంధరుడు కొణిజేటి రోశయ్యకు ప్రకాశం జిల్లా చీరాలతో విడదీయలేని అనుబంధం ఉంది. ఆయన రాజకీయ జీవితానికి ఈ ప్రాంతం ఎంతో తోడ్పాటునిచ్చింది. ఆయన స్వస్థలం కాకపోయినా దత్తపుత్రుడిగా ఆదరించి, రాజకీయంగా పునర్జన్మనిచ్చింది. ఆచార్య ఎన్జీ రంగా శిష్యునిగా రాజకీయాల్లోకి వచ్చిన రోశయ్య... తొలిసారి 1967లో చీరాల నుంచి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీచేసి స్వల్పతేడాతో ఓడారు. తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రిమండలిలో కీలకంగా వ్యవహరించారు. 1983లో తెదేపా అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మండలిని రద్దుచేశారు. దీంతో రాజకీయంగా నిలబడాలంటే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో 1989లో చీరాల నుంచి పోటీచేసిన ఆయనకు ప్రజలు ఘనవిజయం అందించి అసెంబ్లీకి పంపారు. కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది. మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి... ఇలా ముగ్గురు ముఖ్యమంత్రులు మారినా రెండోస్థానంలో మాత్రం రోశయ్యే కొనసాగారు. 1994 ఎన్నికల్లో ఓడినా, మళ్లీ 2004లో గెలిచి, మంత్రి అయ్యారు. ‘నేను ఈ స్థాయిలో ఉన్నానంటే చీరాల ప్రజలు ఇచ్చిన అవకాశమే’ అని అనేక సందర్భాల్లో ప్రస్తావించారు.
> 2009లో ఎమ్మెల్సీగా సీఎం అయినా, తన ఎమ్మెల్సీ నిధులను చీరాలకే కేటాయించారు. సీఎం, గవర్నర్ హోదాలో పలుమార్లు చీరాలలో పర్యటించారు.
ఆయన పేరిట కాలనీలు
చీరాలలో పలు ప్రాంతాలకు రోశయ్య పేరే ఉంది. దండుబాట, కొత్తపేటలో మరోప్రాంతానికి రోశయ్య కాలనీలుగా నామకరణం చేశారు. వేటపాలెం మండలంలో కొణిజేటి చేనేత పురి, కొణిజేటి హరివిల్లు వెలిశాయి.
అధికారులకు స్వేచ్ఛ ఇచ్చేవారు..!
మంత్రిగా, ముఖ్యమంత్రిగా రోశయ్య అధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చేవారు. నిబంధనలకు విరుద్ధంగా పనిచేయాల్సిందిగా ఆయన అధికారులపై ఒత్తిడి తెచ్చేవారు కాదు. గౌరవప్రదమైన, స్వేచ్ఛాయుతమైన వాతావరణాన్ని కల్పించేవారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చే ఒత్తిళ్లను తట్టుకోవడంలోను ఆయన అధికారులకు అండగా నిలిచేవారు. ‘‘2004లో రోశయ్య ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టేనాటికి నేను ఆర్థిక శాఖలో కార్యదర్శిగా ఉన్నాను. 2009 వరకు కలసి పనిచేశాం. ఆయనే నియమ నిబంధనలకు అనుగుణంగా నడిచే వ్యక్తి కాబట్టి ఇంకొకర్ని దానికి వ్యతిరేకంగా వెళ్లమని ఒత్తిడి చేసేవారు కాదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు... నేను తితిదే కార్యనిర్వహణాధికారిగా ఉన్నాను. ఆనంద నిలయం అనంత స్వర్ణమయం ప్రాజెక్టుని అడ్డుకుని కూడా అక్కడే కొనసాగగలిగానంటే అది వారికి నాపై ఉన్న నమ్మకం మాత్రమే. ఆయనకు సన్నిహితుడైన ఆదికేశవులుని కూడా కాదని నాకు అండగా నిలిచారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా బలమైన కులాలకే పరిమితమైన ముఖ్యమంత్రి పదవి ఆయనకు రావటం కేవలం ఆయన ప్రతిభకు గుర్తింపు మాత్రమే’’ అని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు పేర్కొన్నారు.
దైవభక్తి మెండు
కొణిజేటికి అపారమైన దైవభక్తి ఉండేదని సన్నిహితులు చెప్తారు. స్వగ్రామంలో వినాయక గుడి నుంచి శివాలయం, రామాలయం, వేణుకేశవస్వామి, అయ్యప్పస్వామి ఆలయాల నిర్మాణం, అభివృద్ధికి తన వంతు సహకారమందించారు. వేమూరుకు వెళ్లినప్పుడల్లా వినాయకాలయంలో పూజలు చేయించేవారు.
సీఎం అయినా ఆర్థిక మంత్రి ఛాంబర్లోనే!
వైఎస్ మరణం తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన రోశయ్య కొంతకాలం ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేల నుంచి ఆయనకు సహకారం లభించలేదు. సీఎంగా రోశయ్యను కలవడానికి ఆసక్తి చూపేవారు కాదు. ముఖ్యమంత్రి అయినప్పటికీ మంత్రుల సహకారం లభించడం లేదన్న కారణంతో రోశయ్య సీఎం ఛాంబర్కు వెళ్లకుండా ఆర్థికశాఖ మంత్రి ఛాంబర్ నుంచే బాధ్యతలు నిర్వహించారు. నాలుగో రోజు అప్పటి ఇరిగేషన్ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇరిగేషన్ ఫైల్తో రోశయ్య వద్దకు వెళ్లి సంతకం చేయించుకున్నారు. ఆ తర్వాత ఒక్కొక్కరు ఆయన వద్దకు వెళ్లడం ప్రారంభించారు.
రంగా నన్ను తీర్చిదిద్దారు
‘‘న్యాయశాస్త్రం చదివి న్యాయవాది అవుదామని అనుకున్నా.. ఆ కోరిక నెరవేరలేదు. బీకాంతోనే చదువు ముగించాల్సి వచ్చింది. హిందూ కాలేజీ ఎన్నికల్లో గెలవడం, అప్పుడే మొదలైన ప్రత్యేకాంధ్ర ఉద్యమం నన్ను.. రాజకీయాలకు అతికించేశాయని’’ తన జీవిత విశేషాలతో వెలువరించిన ‘నిలువెత్తు సంతకం’ పుస్తకంలో రోశయ్య వివరించారు. ‘‘ఆచార్య ఎన్జీ రంగాతో నా బంధం అందరికీ తెలిసిందే. ఆయనే నన్ను తీర్చిదిద్దారు. ప్రకాశం పంతులు ప్రభావమూ నాపై ఉంది. నేను గాంధీ కాలం నాటి వాణ్ణి కాదు.. కానీ ఆయన్ను చూసే అదృష్టం కలిగింది...’’ అని రోశయ్య పేర్కొన్నారు.
తమిళనాడు గవర్నర్గానూ..
పార్టీకి, ప్రజలకు చేసిన నిరుపమాన సేవలకు గుర్తింపుగా అప్పటి కేంద్ర ప్రభుత్వం రోశయ్యను 2011 ఆగస్టు 26న తమిళనాడు గవర్నర్గా నియమించింది. సాధారణంగా కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో మరో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు... కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఆశీస్సులతో గవర్నర్గా నియమితులైన వారికి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి మధ్య కొంత ఇబ్బందికర వాతావరణం నెలకొనే అవకాశం ఉంటుంది. కానీ తమిళనాడు గవర్నర్గాను రోశయ్య తనదైన శైలిలో, ఎలాంటి పొరపొచ్చాలకు తావులేకుండా హుందాగా వ్యవహరించి అందరి మన్ననలు పొందారు. 2014 ఎన్నికల తర్వాత ఆయన కొంత కాలం కర్ణాటకకూ గవర్నర్గా పనిచేశారు.
రైస్మిల్లర్గా..
రోశయ్య రాజకీయాల్లోకి రాక ముందు కొన్నాళ్లు బియ్యం వ్యాపారం చేశారు. గుంటూరు జిల్లా రైస్మిల్లర్ల సంఘం కార్యదర్శిగా పనిచేశారు. గుంటూరు నగరంలో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నిర్మాణానికి రైస్మిల్లర్ల సంఘం నుంచి ఆర్థికసహకారం అందించటంలో క్రియాశీలకంగా వ్యవహరించారు.
వేమూరులో భారీ పౌర సన్మానం
తమిళనాడు గవర్నర్గా రోశయ్య పదవీ విరమణ చేసిన తర్వాత... స్వస్థలం వేమూరులో ఆయనకు భారీ పౌర సన్మానం జరిగింది. అప్పట్లో స్థానిక తెదేపా ఎమ్మెల్యే నక్కా ఆనంద్బాబు ఆధ్వర్యంలో రోశయ్యకు పౌర సన్మానం జరపడంతో పాటు, కమ్యూనిటీ హాల్కి, భట్టిప్రోలులో పంచాయతీ భవనానికి ఆయనతో ప్రారంభోత్సవం చేయించారు. రోశయ్య అజాత శత్రువని, ఆయనకు అన్ని పార్టీలవారూ గౌరవం ఇచ్చేవారని చెప్పడానికి ఇదో మెచ్చు తునక.
పురస్కారాలు... సత్కారాలు..!
> 2007లో ఆంధ్ర విశ్వవిద్యాలయం రోశయ్యకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.
> 2018 ఫిబ్రవరి 11న టి.సుబ్బిరామిరెడ్డి లలిత కళాపరిషత్ ఆధ్వర్యంలో రోశయ్యను జీవన సాఫల్య పురస్కారంతో గౌరవించింది.
తమిళనాడు గవర్నర్, సీఎం సంతాపం
చెన్నై: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మరణం పట్ల తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి, ముఖ్యమంత్రి స్టాలిన్లు సంతాపం తెలిపారు. రోశయ్య మరణం తనను దిగ్భ్రాంతికి గురిచేసినట్లు ఆర్.ఎన్. రవి పేర్కొన్నారు. అపార అనుభవం కలిగిన రాజనీతిజ్ఞుడైన రోశయ్య మరణం తనను కలచివేసిందని సీఎం స్టాలిన్ ట్వీట్ చేశారు.
రాజకీయాల్లో అజాత శత్రువు- కేటీఆర్, మంత్రి
వివిధ హోదాల్లో పనిచేసిన రోశయ్య రాజకీయాల్లో అజాతశత్రువు, సౌమ్యుడు. తెలుగు రాష్ట్రాల్లోని అన్నివర్గాల ప్రజలకు పెద్ద దిక్కు, ఆప్తుడు. మంత్రిగా, ముఖ్యమంత్రిగా వాడివేడిగా జరిగే సమావేశాల్లోనూ హాస్యోక్తులతో నవ్వులు కురిపించేవారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయనతో నాకు, తెరాస మిత్రులకు వ్యక్తిగతమైన అనుబంధం ఉంది.
కాంగ్రెస్ సిద్ధాంతాలే శ్వాసగా పనిచేశారు- రేవంత్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
రోశయ్య జీవించినంత కాలం కాంగ్రెస్ సిద్ధాంతాలే శ్వాసగా, ధ్యాసగా పనిచేశారు. ఆయన మరణం తీవ్రంగా కలచివేసింది. రాజకీయాలలో విలువలు, నిబద్ధతకు ఆయన నిదర్శనం. శాసనసభలో ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత ఆయనదే.
గొప్ప రాజకీయవేత్త- బండారు దత్తాత్రేయ, హరియాణా గవర్నర్
రోశయ్య మృతితో ఒక సన్నిహితుణ్ని కోల్పోయినట్లుగా ఉంది. ఆయన సీఎంగా ఉన్నప్పుడు కర్నూలు జలమయమై భీకర పరిస్థితులు తలెత్తగా, తెల్లవారుజాము 3.30 వరకు సచివాలయంలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
Fake Calls: టెలికాం శాఖ పేరుతో మీకు కాల్స్ వస్తున్నాయా?ఫోన్ నంబరు డిస్కనెక్ట్ చేస్తామని బెదిరిస్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది కేంద్ర ప్రభుత్వం. -
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
ఆదాయ పన్ను విభాగం నుంచి నోటీసు రావడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. లోక్సభ ఎన్నికలకు ముందు తమను ఆర్థికంగా కుంగదీసేందుకు భాజపా పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతోందని ఆరోపించింది. -
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
Sunita Kejriwal: ఈడీ కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్కు మద్దతుగా ఆయన సతీమణి సునీత వాట్సప్ ప్రచారాన్ని ప్రారంభించారు. -
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
Arvind Kejriwal: కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్ ఫోన్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహాలను తెలుసుకునేందుకు ఈడీ ప్రయత్నిస్తోందని ఆప్ మంత్రి ఆతిశీ ఆరోపించారు. -
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
Mukhtar Ansari: గ్యాంగ్స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ మృతితో యూపీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు కుటుంబ సభ్యులు మాత్రం ఆయన గుండెపోటుతో మరణించలేదని ఆరోపిస్తున్నారు. -
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1800 కోట్ల పన్ను నోటీసులు
Congress: కాంగ్రెస్కు ఆదాయపు పన్ను విభాగం రూ.1800 కోట్లకు నోటీసులిచ్చింది. ఈ వ్యవహారంపై పార్టీ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. -
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
Modi-Bill Gates: ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ ‘చాయ్ పే చర్చ’లో పాల్గొన్నారు. డిజిటల్ విప్లవం, ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
‘కాలివేళ్లతో’ విధిరాత లిఖించుకున్న అపరబ్రహ్మ
సంకల్పబలం ఉంటే లక్ష్య సాధనకు ఏ వైకల్యమూ అడ్డుకాదని నిరూపిస్తున్నారు ఉత్తరాఖండ్కు చెందిన 58 ఏళ్ల దేవ్కీనందన్ శర్మ. -
ఎలాంటి తప్పూ జరగలేదు
నేషనల్ ఏవియేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఏసీఐఎల్) విమానాల లీజు అంశంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సీబీఐ పేర్కొంది. -
ఈస్టర్ రోజున పనిదినం.. వెనక్కు తగ్గిన మణిపుర్ ప్రభుత్వం
ఈస్టర్ రోజును పనిదినంగా ప్రకటిస్తూ మణిపుర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గురువారం వెనక్కు తీసుకుంది. -
కేజ్రీవాల్ పాస్వర్డులు చెప్పలేదు
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 4 డిజిటల్ పరికరాల పాస్వర్డులను చెప్పలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
మరోసారి తండ్రైన పంజాబ్ సీఎం మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(50) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు. -
మేం జోక్యం చేసుకోలేం
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. -
ఐరాస శాంతి పరిరక్షకుల నేరాలపై డేటాబేస్ ప్రారంభించిన భారత్
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులపై నమోదైన నేరాల నిక్షిప్తానికి, సదరు నిందితుల విచారణలో పురోగతిని పర్యవేక్షించడానికి భారతదేశం కొత్త డేటాబేస్ను రూపొందించిందని ఐరాస భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్ గురువారం తెలిపారు. -
నెట్ మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు: యూజీసీ
వచ్చే విద్యా సంవత్సరం నుంచీ జాతీయ అర్హత పరీక్ష (ఎన్ఈటీ) మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు కల్పించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. -
అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగుకు యోచన!
మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల తరహాలో సీయూఈటీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్) మార్కుల ఆధారంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగు నిర్వహించాలని యూజీసీ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు (Latest News)
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ