Amit shah: మన సరిహద్దుల్ని, సైనికుల్ని ఎవరూ తాకలేరు
దేశ భద్రత విషయంలో మోదీ ప్రభుత్వం దృఢంగా ఉందని కేంద్రం హోంమంత్రి అమిత్ షా చెప్పారు. పుల్వామా,
బీఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా
ఈనాడు- జైపుర్, జైసల్మేర్: దేశ భద్రత విషయంలో మోదీ ప్రభుత్వం దృఢంగా ఉందని కేంద్రం హోంమంత్రి అమిత్ షా చెప్పారు. పుల్వామా, ఉరి ఉగ్రవాదుల దాడుల అనంతరం కఠిన నిర్ణయాలు తీసుకుని దేశ సరిహద్దుల్ని, సైనికుల్ని ఎవరూ తేలికగా తీసుకోలేని పరిస్థితి తీసుకొచ్చిందన్నారు. సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్) 57 ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం జైసల్మేర్లోని షహీద్ పూనమ్ సింగ్ స్టేడియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వానికి సరిహద్దు భద్రత అనేది జాతీయ భద్రతతో సమానమన్నారు. ఎక్కడైనా మన సరిహద్దుల్ని అతిక్రమించినా, జవాన్లపై దాడులకు పాల్పడినా.. దీటుగా స్పందిస్తున్నామన్నారు. శత్రువుల పీచమణిచేందుకు మన సైనికులు సరిహద్దులు దాటి జరిపిన మెరుపు దాడులు, సర్జికల్ స్ట్రైక్లను ప్రపంచమే మెచ్చుకుందని షా అన్నారు. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే సరిహద్దులు సురక్షితంగా ఉండాలని, ఈ విధుల్లో ఉన్న బీఎస్ఎఫ్, ఇతర భద్రత దళాల సేవలు నిరుపమానమని కొనియాడారు. ఇటీవల తలెత్తిన డ్రోన్ దాడుల ముప్పుపై స్పందిస్తూ.. సైనికులు, సరిహద్దుల రక్షణకు ప్రపంచంలోని అత్యుత్తమ సాంకేతితకను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బీఎస్ఎఫ్, ఎన్ఎస్జీ, డీఆర్డీవోలు సంయుక్తంగా దేశీయ పరిజ్ఞానంతో కౌంటర్ డ్రోన్ సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నాయని, త్వరలోనే ఇది అందుబాటులోకి వస్తుందని చెప్పారు. సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందేలా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని, వారు సంతోషంగా ఉంటేనే భద్రతా సిబ్బందికి సహకారం బాగుంటుందని చెప్పారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, వారి కుటుంబసభ్యుల కోసం ఇటీవల తీసుకొచ్చిన ‘ఆయుష్మాన్ సీఏపీఎఫ్’ ఆరోగ్య పథకంలో 21 వేల ఆస్పత్రుల్లో చికిత్స అందుతోందని తెలిపారు. 1965లో బీఎస్ఎఫ్ ఏర్పాటైనప్పటినుంచి వ్యవస్థాపక దినోత్సవాన్ని తొలిసారిగా దిల్లీ వెలుపల నిర్వహించడం, అదీ పాక్ సరిహద్దులోని ఎడారి పట్టణంలో జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రభుత్వాలను మేం పడగొట్టం
అధికారంలో ఉన్న ప్రభుత్వాలను భాజపా ఎప్పుడూ పడగొట్టదని అమిత్ షా అన్నారు. రాజస్థాన్లోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు గతేడాది భాజపా ప్రయత్నించిందంటూ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ చేస్తున్న ఆరోపణలపై షా ఆదివారం స్పందించారు. జైపుర్లో భాజపా ఎంపీలు, ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందోనన్న భయంతోనే వారి పాలన సాగుతోందని ఎద్దేవా చేశారు. భాజపా ఎప్పుడూ అలాంటి పనులు చేయదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బాగా పనిచేస్తోందని వారు భావిస్తున్నట్టయితే ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావొచ్చన్నారు. 2023 ఎన్నికల్లో రాజస్థాన్లో 2/3 మెజారిటీతో భాజపా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..