Khesari lalYadav: స్టార్‌ సింగర్‌ రాలేదని అభిమానుల రచ్చ

భోజ్‌పురి గాయకుడు ఖేసరి లాల్‌ యాదవ్‌.. ఓ లైవ్‌షోకు అనుకున్న

Updated : 20 Jan 2022 11:45 IST

వేదిక ధ్వంసం.. కుర్చీలు, వాహనాలకు నిప్పు

భోజ్‌పురి గాయకుడు ఖేసరి లాల్‌ యాదవ్‌.. ఓ లైవ్‌షోకు అనుకున్న సమయానికి రాలేదని అభిమానులు రచ్చ రచ్చ చేశారు. తీవ్ర ఆగ్రహంతో వందల కుర్చీలు, వాహనాలకు నిప్పంటించారు. వేదికను కూడా ధ్వంసం చేశారు. నేపాల్‌లోని సున్సారి జిల్లా బుర్జ్‌లోని విరాట్‌నగర్‌లో మంగళవారం ఈ ఘటన జరిగింది. బుర్జ్‌ మహోత్సవ్‌ సందర్భంగా విరాట్‌నగర్‌లో ఓ లైవ్‌ షోకు ప్లాన్‌ చేశారు గాయకుడు ఖేసరి లాల్‌ యాదవ్‌. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తన బృందంతో నేపాల్‌ వెళ్లాడు. మంగళవారం లైవ్‌ షో జరగాల్సి ఉంది.

ఆయన ప్రదర్శనను ప్రత్యక్షంగా తిలకించేందుకు అభిమానులు ఉదయం నుంచే వందల సంఖ్యలో భారీగా తరలివచ్చారు. ఈ షో ఎంట్రీ కోసం వీక్షకుల నుంచి నిర్వాహకులు రూ.300 వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. షో టైం అయినా ఖేసరి లాల్‌ వేదిక వద్దకు చేరుకోలేదు. దీంతో అభిమానుల ఓపిక నశించి విధ్వంసానికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తాను నేపాల్‌లోనే ఉన్నానని, షోకు వచ్చే ముందు కొవిడ్‌ వ్యాప్తి దృష్ట్యా అధికారులు అనుమతి నిరాకరించారని ఫేస్‌బుక్‌ లైవ్‌ వేదికగా ఖేసరి లాల్‌ వివరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని