Corona: వాటిని బట్టే కొవిడ్‌ తీవ్రత అంచనా

కొవిడ్‌ బారినపడి ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నప్పుడు నిరంతరం మనసులో ఆందోళన తొలుస్తూనే ఉంటుంది. జబ్బు తగ్గుతోందా, ముదురుతోందా.. తెలుసుకోవటమెలా? ఆసుపత్రికి ఎప్పుడు వెళ్లాలి? ఇలాంటి సందేహాలు

Updated : 05 Jul 2021 07:47 IST

వాషింగ్టన్‌: కొవిడ్‌ బారినపడి ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నప్పుడు నిరంతరం మనసులో ఆందోళన తొలుస్తూనే ఉంటుంది. జబ్బు తగ్గుతోందా, ముదురుతోందా.. తెలుసుకోవటమెలా? ఆసుపత్రికి ఎప్పుడు వెళ్లాలి? ఇలాంటి సందేహాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. అయితే శ్వాస త్వరత్వరగా తీసుకోవటం, ఆక్సిజన్‌ 91 శాతం కన్నా తక్కువకు పడిపోవటం అనే రెండు అంశాలు చాలా కీలకమని అమెరికా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇవి ప్రాణాపాయ స్థితిని అంచనా వేయటానికి తోడ్పడే సూచికలన్నారు. వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన నీల్‌ ఛటర్జీ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. కొవిడ్‌ తొలిదశలో ఆయాసమేమీ ఉండకపోవచ్చు. ఆక్సిజన్‌శాతం తగ్గిపోయినా లక్షణాలేవీ కనిపించకపోవచ్చు.  ఆయాసం, ఛాతీలో నొప్పి అనిపించటం వంటి తీవ్ర లక్షణాలేవీ లేకపోయినా శ్వాస వేగం పెరగటం, రక్తంలో ఆక్సిజన్‌ ప్రమాదకర స్థాయికి చేరుకునే అవకాశం ఉంటాయని నీల్‌ ఛటర్జీ తెలిపారు.  ‘‘అత్యవసరంగా ఆసుపత్రికి వస్తున్న చాలామందిలో ఆక్సిజన్‌ సగటున 91 శాతంగా ఉంటోంది. వీరిలో ఎంతోమందికి అప్పటికే ప్రాణరక్షణ చికిత్స ఆరంభించాల్సిన తరుణం మించిపోతోంది. కాబట్టి ఇంట్లో ఉండి కొవిడ్‌ చికిత్స తీసుకునేవారు.. ముఖ్యంగా ఊబకాయులు, అనారోగ్య సమస్య ఉన్నవారు ఆక్సిమీటరుతో ఆక్సిజన్‌ స్థాయిని పరీక్షించుకోవటం ముఖ్యం’’ అని నీల్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని