రోజూ ఇల్లు ఊడుస్తున్నారు!

గృహ పరిశుభ్రత విషయంలో భారతీయులు ఇటీవలి కాలంలో బాగా మెరుగయ్యారని తాజా సర్వే ఒకటి తేల్చింది. ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఇద్దరు దాదాపుగా ప్రతిరోజూ తమ ఇంటిని శుభ్రం చేసుకుంటున్నట్లు తెలిపింది.

Published : 20 May 2022 05:57 IST

గృహ పరిశుభ్రత విషయంలో భారతీయులు భేష్‌ 

ఆసియా పసిఫిక్‌ దేశాల్లో  మనదే ముందంజ 

దిల్లీ: గృహ పరిశుభ్రత విషయంలో భారతీయులు ఇటీవలి కాలంలో బాగా మెరుగయ్యారని తాజా సర్వే ఒకటి తేల్చింది. ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఇద్దరు దాదాపుగా ప్రతిరోజూ తమ ఇంటిని శుభ్రం చేసుకుంటున్నట్లు తెలిపింది. ఈ విషయంలో ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలోని ఇతర దేశాల పౌరులతో పోలిస్తే భారతీయులదే ముందంజ అని వెల్లడించింది. డైసన్‌ అనే ఓ టెక్నాలజీ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 33 దేశాలకు చెందిన 32,282 మందిపై ఈ సర్వేను నిర్వహించింది. ఇందులో 1,019 మంది భారతీయులు పాల్గొన్నారు. 

సర్వేలో గుర్తించిన ముఖ్యాంశాలివీ.. 

* కరోనా మహమ్మారి భయంతో గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమ ఇళ్లను తరచుగా శుభ్రం చేసుకున్నారు. 95% మంది ఇప్పటికీ అదే తీరుతో సాగుతున్నారు. 

* భారత్‌లో 46% మంది గృహ పరిశుభ్రత విషయంలో మెరుగయ్యారు. ప్రతి ముగ్గురిలో ఇద్దరు వారానికి 5-7 సార్లు తమ ఇంటిని శుభ్రం చేసుకుంటున్నారు. 

* ప్రపంచవ్యాప్తంగా 40% మంది.. ఇంట్లో దుమ్ము కనిపించిన వెంటనే దాన్ని తొలగిస్తుండగా, భారత్‌లో అలాంటివారి శాతం దాదాపు 33%గా మాత్రమే ఉంది. 

* ఇళ్లలోని ధూళి వైరస్‌లను కూడా కలిగి ఉంటుందన్న సంగతి 22% మంది భారతీయులకు తెలియదు. 

* ఇంట్లోని దుమ్ము అంటే మట్టి, ఇసుక మాత్రమే అని భారత్‌లో 35% మంది భ్రమపడుతున్నారు. 

* భారతీయుల్లో 54% మంది తమ పరుపులను, 72% మంది కర్టెన్లను శుభ్రం చేసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని