పాక్‌ మహిళ వలపు వలలో

పాకిస్థాన్‌కు చెందిన ఓ మహిళా ఏజెంటు వలపు వలలో పడి.. భారత సైన్యానికి చెందిన రహస్య సమాచారాన్ని చేరవేస్తున్న ఆరోపణలతో ఓ సైనికుడిని పోలీసులు అరెస్టు చేశారు.

Published : 22 May 2022 05:47 IST

రహస్య సమాచారాన్ని చేరవేస్తున్న సైనికుడు
నిందితుడి అరెస్టు

జైపుర్‌: పాకిస్థాన్‌కు చెందిన ఓ మహిళా ఏజెంటు వలపు వలలో పడి.. భారత సైన్యానికి చెందిన రహస్య సమాచారాన్ని చేరవేస్తున్న ఆరోపణలతో ఓ సైనికుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈమేరకు జోధ్‌పుర్‌లో విధులు నిర్వర్తిస్తున్న ప్రదీప్‌ కుమార్‌ కదలికలను చాలా రోజులుగా గమనించిన అనంతరం అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు నిఘా విభాగం ఉన్నతాధికారి ఒకరు శనివారం తెలిపారు. పాకిస్థాన్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీకి చెందిన ఆ మహిళతో ప్రదీప్‌ తరచూ ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లలో సంప్రదింపులు జరుపుతున్నట్లు తేలిందని చెప్పారు. ఆమెకు రహస్య సమాచారాన్ని షేర్‌ చేసినట్లు గుర్తించామన్నారు. నిందితుడిని ఈ నెల 18న కస్టడీలోకి తీసుకుని విచారించిన అనంతరం అరెస్టు చేసినట్లు ఆ అధికారి వెల్లడించారు. ఉత్తరాఖండ్‌కు చెందిన ప్రదీప్‌ మూడేళ్ల క్రితమే సైన్యంలో చేరినట్లు చెప్పారు. అధికారిక రహస్యాల చట్టం-1923 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అధికారుల సమాచారం ప్రకారం.. దాదాపు ఆరు నెలల క్రితం ఆ మహిళ నుంచి నిందితుడికి ఫోన్‌ వచ్చింది. తాను బెంగళూరులోని ఆర్మీ నర్సింగ్‌ సర్వీస్‌ ఉద్యోగినని ఆమె పరిచయం చేసుకుంది. అనంతరం పెళ్లి చేసుకుందామని, అంతకుముందు దిల్లీలో కలుద్దామని ప్రదీప్‌ను నమ్మించింది. అతను తన వలపు వలలో చిక్కుకున్నట్లు నిర్ధరించుకున్న తర్వాత రహస్య సమాచారాన్ని సేకరించడం ప్రారంభించినట్లు అధికారులు గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని