Mehbooba Mufti: ‘భాజపాను వదిలించుకోవడం దేశ స్వాతంత్ర్యం కంటే పెద్దది’
జమ్మూ-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ తాజాగా మరోసారి భాజపాపై విరుచుకుపడ్డారు. ఆ పార్టీ వివిధ వర్గాల మధ్య విద్వేష బీజాలు నాటుతోందని ఆరోపించారు. బ్రిటిష్ పాలననుంచి విముక్తి కంటే కాషాయ పార్టీని వదిలించుకోవడమే...
శ్రీనగర్: జమ్మూ-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ తాజాగా మరోసారి భాజపాపై విరుచుకుపడ్డారు. ఆ పార్టీ వివిధ వర్గాల మధ్య విద్వేష బీజాలు నాటుతోందని ఆరోపించారు. బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కంటే కాషాయ పార్టీని వదిలించుకోవడమే పెద్దదని వ్యాఖ్యానించారు. భాజపా హయాంలో జమ్మూ-కశ్మీర్ అస్తిత్వం ప్రమాదంలో పడిందని వాపోయారు. అయితే, యువత మాత్రం అధికార పార్టీ బెదిరింపులకు వెనకడుగేయకుండా.. అహింసాయుతంగా, ప్రేమ, స్నేహా సందేశాలను చాటుతూ దేశ సవాళ్లకు దీటుగా నిలబడాలని కోరారు. పీడీపీ ఆధ్వర్యంలో సోమవారం స్థానికంగా నిర్వహించిన గిరిజన యువజన సదస్సులో ముఫ్తీ పాల్గొని ఈ మేరకు ప్రసంగించారు.
‘భాజపా నేతలు దేశాన్ని నాశనం చేశారు. ప్రతిపక్ష నేతలపై ఈడీ, ఇతర ప్రభుత్వ సంస్థల దాడులు, అరెస్టులు నిత్యకృత్యంగా మారాయి. కశ్మీర్ పరిస్థితి దేశంలోని మిగతా ప్రాంతాల కంటే దారుణంగా మారింది. కానీ, గుర్తుంచుకోండి.. చరిత్ర అందరికీ ఓ అవకాశాన్ని ఇస్తుంది. బ్రిటీషర్ల నుంచి విముక్తి కోసం దేశ ప్రజలు గతంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఇప్పుడు భాజపాను వదిలించుకునేందుకు అవకాశం ఉంది. ఇది స్వాతంత్ర్యం కంటే పెద్దది.. ఎందుకంటే ఈ పార్టీ దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు యత్నిస్తోంది’ అని అన్నారు.
జమ్మూ-కశ్మీర్ అనేది మహాత్మా గాంధీ భారత్లో చేరిందని.. ఈ దేశాన్ని గాడ్సే దేశంగా మార్చేందుకు అనుమతించదని ముఫ్తీ చెప్పారు. ఎన్నికలు జరగనున్న యూపీలో బాబర్, ఔరంగజేబు వంటి మొఘల్ పాలకుల పేర్లను భాజపా ప్రచారం చేస్తోందని.. పాలనలో విఫలమైనందునే గుళ్లు, మసీదుల పేరిట ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమైన వారు.. కశ్మీర్ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. భాజపా హయాంలో దేశంలో పేదలు మరింత పేదలుగా మారారని, సంపన్నుల జాబితా పెరిగిపోయిందని తెలిపారు. ఇటీవల కశ్మీర్ లోయలో ప్రజా భద్రతా చట్టం(పీఎస్ఏ) కింద ఓ జర్నలిస్టును అరెస్టు చేయడంపై ముఫ్తీ ఆందోళన వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...