Poonch Encounter: ‘ఆపరేషన్ సర్ప్వినాశ్’ను తలపించేలా పూంచ్ ఎన్కౌంటర్..
కశ్మీర్లో కనివినీ ఎరుగని స్థాయిలో భారీ ఎన్కౌంటర్ జరుగుతోంది. గత 2003 తర్వాత ఈ స్థాయి ఎన్కౌంటర్ను కశ్మీర్ ప్రజలు చూడలేదు. పూంఛ్లోని మెందహార్, సురాన్ కోటె రాజౌరీలోని థాన్మండీ అడవుల్లో
* 12 రోజులుగా ఆగని పోరు..
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
కశ్మీర్లో కనీవినీ ఎరుగని స్థాయిలో భారీ ఎన్కౌంటర్ జరుగుతోంది. 2003 తర్వాత ఈ స్థాయి ఎన్కౌంటర్ను కశ్మీర్ ప్రజలు చూడలేదు. పూంచ్లోని మెందహార్, సురాన్ కోటె రాజౌరీలోని థాన్మండీ అడవుల్లో నిన్న ఇరు పక్షాల నుంచి కాల్పులు నెమ్మదించినా.. నేడు మళ్లీ హోరాహోరీ పోరు మొదలైంది. నేటి తెల్లవారుజామున భారీగా కాల్పులు మొదలయ్యాయి. దీంతోపాటు ఐఈడీ పేలుళ్ల శబ్దాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. సైన్యం సర్వశక్తులు ఒడ్డి ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు పోరాడుతోంది.
అత్యంత అప్రమత్తంగా బలగాలు..
అక్టోబర్ 11వ తేదీన సురాన్కోటె వద్ద గస్తీ బృందాలపై ఉగ్రవాదులు దాడి చేసి ఐదుగురిని హత్యచేశారు. 14వ తేదీన మెందహార్ వద్ద మరోసారి దాడి చేశారు. ఈ ఘటనలో మరోనలుగురు భద్రతా సిబ్బంది మృతి చెందారు. ఈఎన్కౌంటర్లో ఇప్పటికే ఇద్దరు జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లతో సహా.. తొమ్మిది మంది సిబ్బందిని కోల్పోవాల్సి వచ్చింది. దీంతో మరోసారి ప్రాణనష్టం జరగకుండా దళాలు ఇక్కడ ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తూ ముందుకు వెళుతున్నాయి. ఈ ఆపరేషన్లో కనీసం 3000 మంది సైనికులు పాల్గొన్నట్లు వార్తలొస్తున్నాయి. సైన్యం దీనిని ధ్రువీకరించలేదు.
ఎన్కౌంటర్ జరుగుతున్న ప్రదేశం పూంచ్-రాజౌరీ జాతీయ రహదారికి కొన్ని కిలోమీటర్ల దూరంలోని భాటా దురియాన్ అడవిలో ఉంది. ఈ చిక్కటి అడవిలో ఉగ్రవాదులు నక్కి భద్రతా దళాలపై దాడులు చేస్తున్నారు. దీంతో భద్రతా దళాలు జమ్ము-రాజౌరీ జాతీయ రహదారిని మూసివేశాయి. వివిధ రకాల ఆయుధాలను దళాలు ఈ ఎన్కౌంటర్లో వినియోగిస్తున్నాయి. దళాల భద్రత దృష్ట్యా ఈ ఆపరేషన్కు సంబంధించిన ఎటువంటి సమాచారాన్ని సైన్యం బయటకు పొక్కనీయడంలేదు. పలు ఉగ్రస్థావరాలను సైన్యం పేల్చివేసింది. ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే కూడా మంగళవారం కశ్మీర్కు వెళ్లి క్షేత్రస్థాయి పరిస్థితిని తెలుసుకున్నారంటే దీని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
ఐఈడీ ఉచ్చు..
పూంచ్ సబ్డివిజన్లోని సురాన్కోటె అడవిలో కూంబింగ్ చేస్తున్న భద్రతా దళాలు పెను ప్రమాదాన్ని తప్పించుకొన్నాయి. ఓ చెట్టుకొమ్మకు వేలాడదీసిన ఐఈడీని గుర్తించాయి. వెంటనే బాంబ్ స్క్వాడ్ను పిలిపించి దానిని సురక్షితంగా పేల్చివేశాయి. ఈ అటవీ ప్రాంతంలో మొత్తం 8 మంది ఉగ్రవాదులు ఉండొచ్చని అంచనావేస్తున్నారు. ఇప్పటికే ఉగ్రవాదులకు సరుకులు, సమాచారం చేరవేస్తున్నారనే అనుమానంతో పలువురిని అదుపులోకి తీసుకొన్నారు.
నాడు పాక్ ఆధీనంలోకి వెళ్లిన బకర్వాల్ గ్రామం..
ప్రస్తుతం ఈ ఎన్కౌంటర్ను చూస్తే 2003లో జరిగిన ‘ఆపరేషన్ సర్ప్వినాశ్’ గుర్తొస్తుంది. ఆ ఆపరేషన్ కూడా సురేన్కోటె వద్దనే జరిగింది. 1999లో సురాన్కోటె ప్రాంతంలోని హల్కాక అనే బకర్వాల్(గొర్రెలకాపర్ల) గ్రామాన్ని ఉగ్రవాదులు తమ ఆధీనంలోకి తీసుకొన్నారు. ఇది చిక్కటి అడవిలో ఎల్వోసీకి 10-12 కిలోమీటర్ల లోపల ఉంటుంది. పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, అల్ బదర్ సహా పలు గ్రూపులకు చెందిన ఉగ్రమూకలు ఇక్కడ తిష్ఠవేశాయి. పర్వత వాలు ప్రదేశాల్లో బకర్వాల్స్ వినియోగించే షెడ్లను తమ బంకర్లుగా మార్చుకొన్నాయి. అక్కడ కాంక్రీట్ కట్టడాలను నిర్మించాయి. ఉగ్రవాదులు ఇక్కడ ఏకంగా ఒక ఆసుపత్రినే నిర్మించారు. దీంతోపాటు 500 మందికి రెండు నెలలకు సరిపడా ఆహార పదార్థాలను నిల్వ చేసుకొన్నారు. పాకిస్థాన్ అక్కడ ఏకంగా సమాంతర పాలన సాగించింది. ఇక్కడి పరిస్థితిని గమనించిన సైన్యం పలుమార్లు దాడులు నిర్వహించింది. కానీ, పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రాలేదు. దీంతో ‘ఆపరేషన్ సర్ప్ వినాశ్’ చేపట్టాలని నిశ్చయించింది.
అప్పటికే కార్గిల్ యుద్ధాన్ని భారత్-పాక్లు పూర్తిగా మర్చిపోలేదు. దీనికి తోడు 2001లో పార్లమెంట్ దాడి తర్వాత ‘ఆపరేషన్ పరాక్రమ్’ కూడా భారత్ చేపట్టింది. దీంతో ‘ఆపరేషన్ సర్ప్ వినాశ్’లో ఏమాత్రం తేడా వచ్చినా అది ఇరుదేశాల మధ్య పూర్తి స్థాయి యుద్ధంగా మారే ప్రమాదం ఉంది. దీంతో సైన్యం అన్ని ఏర్పాట్లు చేసుకొన్న తర్వాతే తుది దాడిని మొదలుపెట్టింది.
అప్పట్లో 64 మంది ఉగ్రవాదుల హతం..
2003 జనవరిలో పీర్పంజాల్ పర్వత శ్రేణుల్లోని మూడు శిఖరాల మధ్య 150 చదరపు కిలోమీటర్లలో సైన్యం తుది ఆపరేషన్ ఏర్పాట్లు మొదలుపెట్టింది. మొత్తం మూడు బ్రిగేడ్లకు సరిపడా 15,000 మంది సైనికులు దీనిలో పాల్గొన్నారు. అదే ఏడాది ఏప్రిల్-మే నెలల మధ్య భద్రతా దళాలకు ఉగ్రవాదులకు మధ్య ఒక చిన్నసైజు యుద్ధమే జరిగింది. ఎంఐ17 హెలికాప్టర్లతో దళాలను ఎన్కౌంటర్ ప్రదేశంలో జారవిడిచారు. లాన్సర్ హెలికాప్టర్తో దాడులు చేశారు. మొత్తం 64 మంది ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. ఏకే 47, పీకా గన్స్, గ్రనేడ్ లాంఛర్లు, సెల్ఫ్లోడెడ్ రైఫిల్స్, పేలుడు పదర్థాలు, భారీ సంఖ్యలో రేడియో సెట్లు దొరికాయి. ఆపరేషన్ తర్వాత అక్కడి బకర్వాల్ వాసులకు ప్రభుత్వం రూ.7.5 కోట్ల పరిహారం అందజేసి.. ఆ ప్రాంతాన్ని మూసి వేయాలని ఆదేశించింది. ఆ తర్వాత ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని రోడ్లతో అనుసంధానించింది. అక్కడి గుజ్జర్-బకర్వాల్ తెగలోని వారికి ఆర్మీ పోర్టర్లు ఉద్యోగాలు ఇచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్
Doordarshan: ‘డీడీ న్యూస్’ లోగోను కాషాయ రంగులోకి మార్చడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది ‘ప్రసార భారతి’ కాదని ‘ప్రచార భారతి’గా మారిందని పలువురు మండిపడుతున్నారు. -
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. -
బాలిక 28 వారాల గర్భం తొలగింపుపై వైద్యుల సలహా కోరిన సుప్రీంకోర్టు
అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సర్వోన్నత న్యాయస్థానం వైద్యుల సలహా కోరింది. -
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్
-
ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్
-
దుర్గారావును చూపించాలంటూ ఆందోళన.. సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
-
‘మా చిత్రాన్ని మరో ‘అన్బే శివం’ చేయొద్దు’: విజయ్ ఆంటోనీ వైరల్ పోస్ట్
-
నా భార్య ఆహారంలో టాయిలెట్ క్లీనర్ కలుపుతున్నారు: ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు
-
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా