Ventilator: తక్కువ ఖర్చుతో పోర్టబుల్ వెంటిలేటర్
కరోనా కారణంగా ఆక్సిజన్ తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురై అనేక మంది ప్రాణాలు విడిచారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభించిన తరుణంలో వెంటిలేటర్ల కొరత తీవ్రంగా బాధించింది. వీటన్నింటికి పరిష్కారంగా కశ్మీర్ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు విద్యార్థులు ఒక పోర్టబుల్ వెంటిలేటర్ను తయారు చేశారు.
స్క్రాప్ నుంచి తయారు చేసిన కశ్మీర్ విద్యార్థులు
శ్రీనగర్: కరోనా కారణంగా ఆక్సిజన్ తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురై అనేక మంది ప్రాణాలు విడిచారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభించిన తరుణంలో వెంటిలేటర్ల కొరత తీవ్రంగా బాధించింది. వీటన్నింటికి పరిష్కారంగా కశ్మీర్ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు విద్యార్థులు ఒక పోర్టబుల్ వెంటిలేటర్ను తయారు చేశారు. వెంటిలేటర్ల కొరతను అధిగమించేందుకు ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ విద్యార్థులు సాజిద్ నూర్, జహంగిర్ తక్కువ ఖర్చుతో పోర్టబుల్ వెంటిలేటర్ను అందుబాటులోకి తెచ్చారు. లాక్డౌన్ కారణంగా వీరిద్దరి ఇళ్లలో ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నా.. వెంటిలేటర్ను తయారు చేయాలని స్క్రాప్ మెటీరియల్తో ప్రయోగాలు ప్రారంభించి చివరికి విజయవంతమయ్యారు.
సాధారణ వెంటిలేటర్లలా కాకుండా ఈ పోర్టబుల్ వెంటిలేటర్ను సెన్సర్లు, మైక్రో కంట్రోలర్లతో అనుసంధానించారు. దీని ఆధారంగా ఈసీజీ, శరీర ఉష్ణోగ్రతను ఎక్కడి నుంచైనా పర్యవేక్షించొచ్చు. దీన్ని ఆండ్రాయిడ్ అప్లికేషన్ సహాయంతో మొబైల్కు అనుసంధానించి రోగి పరిస్థితిని మానిటర్ చేయొచ్చని సాజిద్, జహంగీర్ తెలిపారు. దీంతో వైద్యుల సహకారం పొందడం వీలవుతుందని వారు పేర్కొన్నారు. ఈ వెంటిలేటర్ను శ్రీనగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశీలించింది. కొవిడ్-19 ఓపెన్ ఇన్నోవేషన్ ఛాలెంజ్లో ఇది మొదటిస్థానంలో నిలిచింది. దీని ధర రూ.20 వేల కంటే తక్కువేనని సాజిద్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434