Babasaheb Purandare: ప్రముఖ రచయిత బాబాసాహెబ్ పురందరే కన్నుమూత
దిల్లీ: భారతీయ ప్రముఖ రచయిత, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత బాబాసాహేబ్ పురందరే సోమవారం ఉదయం 5గంటలకు కన్నుమూశారు. ఆయన వయసు 99 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
దిల్లీ: భారతీయ ప్రముఖ రచయిత, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత బాబాసాహెబ్ పురందరే సోమవారం ఉదయం 5గంటలకు కన్నుమూశారు. ఆయన వయసు 99 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వృద్ధాప్య సంబంధిత వ్యాధుల కారణంగా రెండురోజుల క్రితం పుణెలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయన... వెంటిలేటర్ సాయంతో చికిత్స తీసుకుంటూ మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. దేశప్రధాని మోదీతో సహా ఇతర ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా పురందరేతో ఉన్న అనుబంధాన్ని ప్రధాని మోదీ ట్విటర్ వేదికగా గుర్తుచేసుకున్నారు.
‘‘మాటల్లో వ్యక్తపరచలేనంత బాధ కలిగింది. శివషాహీర్ బాబాసాహెబ్ పురందరే మరణం చరిత్ర, సాంస్కృతిక ప్రపంచంలో ఒక పెద్ద శూన్యతను మిగిల్చింది. రాబోయే తరాలు ఛత్రపతి శివాజీ మహారాజ్తో మరింత దగ్గరయ్యేలా చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు. ఆయన రచనలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. బాబాసాహెబ్ పురందరే చమత్కారుడు, తెలివైనవాడు, భారతీయ చరిత్ర గురించి గొప్ప జ్ఞానం కలిగిన వేత్త. కొన్నేళ్లుగా ఆయనతో చాలా సన్నిహితంగా మెలిగిన ఘనత నాకు దక్కింది. కొన్ని నెలల క్రితం, తన శతాబ్ది సంవత్సర కార్యక్రమంలో ప్రసంగించారు’’ అంటూ ట్వీట్ చేశారు. బాబాసాహెబ్కు ప్రభుత్వ పరంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు.
ఛత్రపతి శివాజీ గురించి ఎన్నో రచనలు
మహారాష్ట్రలోని బల్వంత్ మోరేశ్వర్ పురందరే.. బాబాసాహెబ్ పురందరేగా ప్రసిద్ధి. ఛత్రపతి శివాజీపై అనేక పుస్తకాలను రచించారు. ఆయన జీవితం మొత్తం చరిత్ర పరిశోధనలకే అంకితం చేశారు. 2019 జనవరి25న భారత అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ విభూషణ్, 2015లో మహారాష్ట్ర భూషణ్ అవార్డు అందుకున్నారు. 200 మందికి పైగా కళాకారులు ప్రదర్శించిన శివాజీ ‘జాంత రాజా’ నాటకాన్ని ఆయన రచించి, దర్శకత్వం వహించారు. ఇది కేవలం మహారాష్ట్రలోనే కాదు ఆంధ్రప్రదేశ్, గోవాలోనూ ప్రాచుర్యం పొందింది. ఐదు భాషల్లో దీన్ని అనువదించారు. 1970ల్లో శివసేన అధ్యక్షుడు పార్టీ బాల్ ఠాక్రేతో కలిసి పనిచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.