అమెరికాలో హ్యారీ-మేఘన్.. ఆదాయం ఎలా?
అమెరికన్ యాంకర్ ఓప్రా విన్ఫ్రే టీవీషోకు బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ హ్యారీ.. మేఘన్ మార్కెల్ దంపతులు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బ్రిటన్ రాజకుటుంబంలో ఉన్న వివాదాలను బయటపెట్టింది. బకింగ్హామ్ ప్యాలెస్లో మేఘన్కు ఎన్నో ఇబ్బందులు
ఇంటర్నెట్ డెస్క్: అమెరికన్ యాంకర్ ఓప్రా విన్ఫ్రే టీవీషోకు బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ హ్యారీ.. మేఘన్ మార్కెల్ దంపతులు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బ్రిటన్ రాజకుటుంబంలో ఉన్న వివాదాలను బయటపెట్టింది. బకింగ్హామ్ ప్యాలెస్లో మేఘన్కు ఎన్నో ఇబ్బందులు ఏర్పడటం.. కుటుంబంలో జరుగుతున్న కొన్ని విషయాలు హ్యారీకి కూడా నచ్చకపోవడంతో ఇద్దరు కలిసి ప్యాలెస్తోపాటు, రాజకుటుంబాన్ని వీడి బయటకు వచ్చేశారు. మేఘన్ స్వస్థలం యూఎస్లోని కాలిఫోర్నియాకి వచ్చి స్థిరపడ్డారు. హ్యారీ తీసుకున్న నిర్ణయంతో ఆగ్రహించిన బ్రిటన్ రాజకుటుంబం అతడి ఖర్చులకు ఇవ్వాల్సిన నిధులను నిలిపివేసింది. దీంతో తన తల్లి ప్రిన్సెస్ డయానా నుంచి వారసత్వంగా వచ్చిన డబ్బుతోనే తన ఆర్థిక అవసరాలు తీరుతున్నాయని హ్యారీ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అయితే, డయానా నుంచి హ్యారీకి ఎంతమొత్తంలో నగదు అందింది? అమెరికాలోని కాలిఫోర్నియాలాంటి ప్రధాన రాష్ట్రంలో హ్యారీ కుటుంబం జీవించడానికి డబ్బులు ఎలా వస్తున్నాయి? వంటి ప్రశ్నలు చాలా మందిలో మెదులుతున్నాయి. పలు అంతర్జాతీయ పత్రికలు వాటిపై ఆరా తీసి.. సమాధానం కనిపెట్టాయి. అదేంటంటే..
అంతర్జాతీయ మీడియా అంచనా ప్రకారం.. ప్రిన్స్ హ్యారీకి తన తల్లి నుంచి వారసత్వంగా 10 మిలియన్ పౌండ్లు వచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి ప్రిన్స్ హ్యారీ పేరు మీద డయానా 8.9మిలియన్ పౌండ్లు మాత్రమే దాచిపెట్టారట. దానిపై వచ్చిన వడ్డీ.. ఇతర ఆదాయం కలిపి మొత్తం 10 మిలియన్ పౌండ్లు అయినట్లు మీడియా పేర్కొంది. ఆమె పెద్దకుమారుడు.. హ్యారీ సోదరుడు విలియమ్కు కూడా డయానా 9 మిలియన్ పౌండ్లు వదిలివెళ్లారట.
డయానా వివాహం.. విడాకులు.. భరణం
బ్రిటన్ రాణి ఎలిజబెత్ II పెద్ద కుమారుడు ప్రిన్స్ చార్లెస్తో డయానాకు 1981లో వివాహమైంది. బ్రిటన్లో ఉన్నత కుటుంబంలో జన్మించిన ఆమె.. చార్లెస్తో వివాహంతో బ్రిటన్ రాజకుటుంబంలో సభ్యురాలిగా మారారు. వారి వివాహబంధానికి గుర్తుగా ప్రిన్స్ విలియమ్స్.. ప్రిన్స్ హ్యారీలు జన్మించారు. కానీ, డయానా దంపతుల దాంపత్య జీవితం అంత సఖ్యంగా ఉండేది కాదు. పలు అంశాల్లో వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో 1996లో విడాకులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో డయానాకు భరణం కింద 17 మిలియన్ పౌండ్లు, జీవన భృతి కింద ఏటా 4లక్షల పౌండ్లు అందేలా ఒప్పందం కుదిరింది. కానీ, విడాకులు తీసుకున్న మరుసటి ఏడాది అంటే 1997లో కారు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. అయితే, అంతకుముందే భరణం కింద వచ్చిన డబ్బును డయానా తన ఇద్దరు పిల్లల పేరుమీద దాచిపెట్టారు. వారిద్దరికి పాతికేళ్లు వచ్చాక ఆ డబ్బుకు సంబంధించిన వడ్డీ వచ్చేలా.. 30 ఏళ్లు వచ్చిన తర్వాత మొత్తం నగదు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. అలా 36ఏళ్ల హ్యారీకి తన తల్లి నుంచి వారసత్వంగా వచ్చిన డబ్బే అమెరికాలో స్థిరపడటానికి ఉపయోగపడింది.
మేఘన్ వృత్తి.. ఒప్పందాలు
ప్రిన్స్ హ్యారీతో వివాహానికి ముందు మేఘన్ అనేక టీవీ సిరీస్లు.. పలు సినిమాల్లో నటించింది. సూట్స్ అనే సిరీస్లో మేఘన్ ఒక ఎపిసోడ్కు 50వేల డాలర్లు పారితోషికంగా తీసుకుందట. అలాగే, పలు బ్రాండ్స్కు ప్రచారకర్తగా, స్పాన్సర్షిప్ కింద ఏటా 80వేల డాలర్లు సంపాదిస్తోంది. ప్రస్తుతం ఆమె ఆస్తి విలువ దాదాపు 2 మిలియన్ డాలర్లు ఉంటుందట. ఇద్దరి డబ్బులతో కాలిఫోర్నియాలో 14.65 మిలియన్ డాలర్లు పెట్టి విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశారు. అంతేకాదు, ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ నెట్ఫ్లిక్స్, స్పూటిఫైలతో హ్యారీ, మేఘన్ మిలియన్ డాలర్ల ఒప్పందాలు కుదుర్చుకున్నారు. కుటుంబ పోషణ కోసమే ఈ ఒప్పందాలు చేసుకున్నామని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో హ్యారీ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
20 మంది ఎమ్మెల్యేలు సహా.. 4 లక్షల ఓటర్లలో ఒక్కరూ ఓటెయ్యలేదు!
నాగాలాండ్లో 6 జిల్లాల్లో సున్నా పోలింగ్ నమోదైంది. స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు లక్షల మంది ఓటర్లు ఈ ప్రక్రియకు దూరంగా ఉన్నారు. -
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
First phase of LS polls: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. -
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
PM Modi: ప్రచార సభలో తన తల్లి ఫొటోను చూసి ప్రధాని మోదీ ఉద్వేగానికి లోనయ్యారు. ఆ చిత్రాన్ని గీసిన యువకుడిని అభినందించారు. -
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే బలమైన, స్థిర ప్రభుత్వం అవసరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
తనకు జైల్లో ఇన్సులిన్ అందించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) దిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. -
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
ఉత్తరప్రదేశ్లోని ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు ఫేషియల్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే.. -
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
UPSC: ఏళ్లపాటు కష్టపడి తృటిలో అవకాశం కోల్పోయిన యూపీఎస్సీ అభ్యర్థుల కోసం డిట్టో ఇన్సూరెన్స్ ఉద్యోగ అవకాశం ఇచ్చేందుకు ముందుకువచ్చింది. -
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
20 మంది ఎమ్మెల్యేలు సహా.. 4 లక్షల ఓటర్లలో ఒక్కరూ ఓటెయ్యలేదు!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు