Covid Outbreak: వందలాది విమానాలు రద్దు.. బీజింగ్లో బూస్టర్ డోసుకు సై
చైనాలో కరోనా మళ్లీ ఉరుముతోన్న విషయం తెలిసిందే. దీంతో మహమ్మారి కట్టడికి ఈ దేశం కఠిన చర్యలు తీసుకుంటోంది. కొన్ని కేసులు బయటపడినా.. లాక్డౌన్ విధిస్తోంది. ప్రయాణ నిబంధనలను కఠినతరం చేస్తోంది. రానున్న ఫిబ్రవరిలో వింటర్ ఒలింపిక్స్కు ఆతిథ్యం...
బీజింగ్: చైనాలో కరోనా మళ్లీ ఉరుముతోన్న విషయం తెలిసిందే. దీంతో మహమ్మారి కట్టడికి ఈ దేశం కఠిన చర్యలు తీసుకుంటోంది. కొన్ని కేసులు బయటపడినా.. లాక్డౌన్ విధిస్తోంది. ప్రయాణ నిబంధనలను కఠినతరం చేస్తోంది. రానున్న ఫిబ్రవరిలో వింటర్ ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో దేశ రాజధాని బీజింగ్ అంతటా జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. తాజాగా శుక్రవారం నగరంలోని రెండు విమానాశ్రయాల్లో వందలాది విమాన సర్వీసులను రద్దు చేసింది. నగరమంతటా కార్మికులకు బూస్టర్ డోసులు తప్పనిసరి చేసినట్లు అధికారిక మీడియా చైనా సెంట్రల్ టెలివిజన్ వెల్లడించింది. మరోవైపు ప్రజలంతా కొవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది.
60 లక్షల మంది లాక్డౌన్లో..
చైనాలో ప్రస్తుతం కేసుల సంఖ్య.. ఇతర దేశాలతో పోల్చితే చాలా తక్కువే. శుక్రవారం 48 కొత్త కేసులు నమోదయ్యాయి. గత వారం నమోదైన 250 కంటే తక్కువే. కానీ.. వింటర్ ఒలింపిక్స్ నేపథ్యంలో ఎటువంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు. గురువారం సైతం బీజింగ్కు వెళ్లే రెండు హై-స్పీడ్ రైళ్లను నిలిపేశారు. అందులోని 450 మంది ప్రయాణికులను కరోనా పరీక్షలకు పంపారు. మరోవైపు ప్రయాణాలు మానుకోవాలని హిలాంగ్జియాంగ్ ప్రావిన్స్ అధికారులు.. స్థానికులను హెచ్చరించారు. ఈ ప్రావిన్స్ రాజధాని హార్బిన్ విమానాశ్రయంలో మూడో వంతు విమానాలను నిలిపివేశారు. ప్రస్తుతం చైనావ్యాప్తంగా దాదాపు 60 లక్షల మంది లాక్డౌన్లో ఉన్నారు. లాన్జౌలో 40 లక్షల మంది, ఎజిన్లో దాదాపు 35 వేల మంది ఇళ్లకే పరిమితమ్యారు. అనేక ప్రావిన్స్లు ప్రయాణికులకు నెగెటివ్ రిపోర్టు తప్పనిసరి చేశాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
పెద్ద సంఖ్యలో తరలిరండి.. ఓటర్లకు ప్రధాని మోదీ పిలుపు
-
కిడ్నాప్ చేయించి.. 30 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
-
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ